Tuesday 29 November 2016

ఎక్కువ మందితో సెక్స్ చేస్తే డేంజ‌ర్‌


మాన‌వ‌జీవితంలో సెక్స్‌కు ఎంతో ప్రాముఖ్య‌త ఉంది.జీవితంలో డ‌బ్బు ఎంత ఉన్నా శృంగారంలో సంతృప్తి లేక‌పోతే జీవితం ఆనంద‌మ‌యం కాదు. అయితే సెక్స్ గురించి కొన్ని డేంజ‌ర్ విష‌యాలు తాజా సర్వేలో వెల్ల‌డ‌య్యాయి. ఒక‌రి కంటే ఎక్కువ మందితో సెక్స్‌లో త‌ర‌చూ పాల్గొంటూ ఉండేవారికి ముప్పు త‌ప్ప‌ద‌ట‌.లైంగిక భాగస్వాముల సంఖ్య ఎక్కువ ఉన్న పురుషులకు ప్రోస్టేట్‌ కేన్సర్‌ ముప్పూ ఎక్కువేనని  వెల్ల‌డైంది.


        జీవిత కాలంలో ఏడుగురికంటే ఎక్కువ మందితో లైంగిక అనుబంధం ఉన్నా.. 17 ఏళ్లకన్నా ముందే లైంగిక చర్యలో పాల్గొన్నా మిగతా వారితో పోలిస్తే ప్రోస్టేట్‌ కేన్సర్‌ ముప్పు పెరుగుతుందట‌.ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్‌ శాస్త్రవేత్తల బృందం జ‌రిపిన సర్వేలో ఈ షాకింగ్ మ్యాట‌ర్ తేలింది. ఈ బృందంలో భారత సంతతి పరిశోధకుడు కూడా ఉన్నారు. పదివేల మందిని పరీక్షించగా.. లైంగిక చర్యకు ప్రోస్టేట్‌ కేన్సర్‌కు మధ్య సంబంధం ఉన్నట్టు తేలిందని

క్యాన్సర్ వ్యాధికి కూడా లింగ వివక్ష

క్యాన్సర్ వ్యాధికి కూడా లింగ వివక్ష ఉన్నట్లుంది. కాకపోతే పురుషులపై కాస్త మమకారం ఎక్కువేమో. ప్రపంచవ్యాప్తంగా 74 లక్షల మంది పురుషులకు క్యాన్సర్ వ్యాధిరాగా, 66 లక్షల మంది మహిళలు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. మహిళలకన్నా పురుషులకు ఎక్కువగా ఈ వ్యాధి రావడానికి కారణం ఆహారపు అలవాట్లతోపాటు ధూమ పానం, మద్యపానం కారణమని పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఆశ్చర్యకరంగా బాలికలకన్నా కూడా క్యాన్సర్ వచ్చిన బాలలే ఎక్కువగా ఉన్నారు. అందుకు కారణం మాత్రం ధూమపానం, మద్యపానం కాదట. ఎందుకంటే వారికి ఈ అలవాట్లు ఉండవు కనుక.


          పురుషుల్లో ఎక్కువ కాలేయం, వీర్యగ్రంధి, పురీష నాళ క్యాన్సర్లు వస్తుండగా, మహిళల్లో ఎక్కువగా బ్రెస్ట్, కాలేయం, పురీషనాళ క్యాన్సర్లు వస్తున్నాయి. క్యాన్సర్ వచ్చిన పిల్లలు జీవించే కాలం అభివృద్ధి చెందిన అధికాదాయ దేశాల్లో 80 శాతం పెరిగిందని వైద్య పరిశోధకులు తెలియజేశారు. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో క్యాన్సర్ బారిన పడిన పిల్లలు కనీసం ఐదేళ్లు జీవిస్తుండగా, పేద దేశాల్లో ఎక్కువ కాలం బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వారంటున్నారు. లైంగిక క్రోమోజోములు అభివృద్ధి చెందేవరకు పిల్లల్లో ఆడైనా, మగైనా క్యాన్సర్ బారిన పడే అవకాశాలు సమానంగా ఉన్నాయని వారు చెప్పారు.

Monday 28 November 2016

గోదారి నీళ్లతో కేన్సర్ గ్యారెంటీ


ఒకచోట మంద్రంగా, గంభీరంగా.. ఒకచోట ఉరుకుల పరుగులతో.. పచ్చటి ప్రకృతి గుండా సాగిపోయే వేదమంటి గోదావరి.. క్రమంగా కాలుష్య కాసారంగా మారిపోతోంది. గోదావరి కాలుష్యంలో 18 శాతం మాత్రమే పరిశ్రమల వల్ల వస్తోంది. మిగిలినదంతా ప్రజలు వదిలే వ్యర్థాలు, వ్యవసాయానికి ఉపయోగించే ఎరువుల వల్ల జరుగుతోంది.
ఈ ముప్పు నుంచి ప్రజలను కాపాడాలంటే.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో మొత్తం గోదావరి పరీవాహక ప్రాంతాన్ని సర్వే చేయించాలి. మానవ రహిత విమానాలు, రిమోట్‌ సెన్సింగ్‌ టెక్నాలజీలు, వెబ్‌ సెన్సర్‌ బేస్డ్‌ టెక్నాలజీల వల్ల ప్రయోజనం ఉంటుంది.
        
 పచ్చటి పంటలతో అలరారే గోదావరి పరీవాహక ప్రాంతానికి పెనుముప్పు ముంచుకొస్తోంది. స్వచ్ఛమైన జలాలతో ఉరుకుల పరుగులిడే గోదారి తల్లి కాలుష్యకాసారంగా మారిపోతోంద. కాలకూట విషాల్లాంటి పారిశ్రామిక వ్యర్థాలు.. నిండు ప్రాణాలకు మరణశాసనం రాసే ఎరువులు, పురుగుమందుల అవశేషాలు.. ఆ జీవనదిని ప్రాణాలు తీసే విషమయ కాళింది మడుగులా మార్చేస్తున్నాయి. ఫలితం.. పంట దిగుబడులు తగ్గిపోతున్నాయి. కేన్సర్లు పెరిగిపోతున్నాయి.

Saturday 26 November 2016

ముందే గుర్తిస్తే కేన్సర్ తో నో ప్రాబ్లమ్


బోన్ కేన్సర్లు అంటే అవి కేవలం ఎముకల్లో పుట్టేవి మాత్రమే కాదు. కొన్ని సార్లు ఇతర భాగాల్లో ఉన్న కేన్సర్లు కూడా ఎముకలకు పాకవచ్చు. అలాగే ఎముకల్లో పుట్టిన కేన్సర్ ఇతర భాగాలకూ పాకవచ్చు . అయితే ఈ కేన్సర్లు అన్నింటికీ చాలా వేగంగా వ్యాపించే లక్షణం ఒక టుంది. అందుకే ఈ కేన్సర్లను ఎంత తొందరగా గుర్తించి చికిత్స తీసుకుంటే అంత ప్రయోజనం. ఎప్పుడైనా పిల్లలు ఎక్కువ రోజులు కుంటుతూ నడుస్తూ ఉంటే, ఏదోలే అనుకుంటే ఒక్కోసారి ప్రమాదం ముంచుకు రావచ్చు.అప్పుడెప్పుడో దెబ్బ తగిలిన తాలూకు నొప్పే అనుకుంటే అది ఆ తరువాత బాగా ముదిరిపోయిన బోన్ కేన్సర్ కావచ్చు అందుకే ఈ విషయమై ఎంత తొందరగా డాక్టర్‌ను సంప్రదిస్తే, అంత శ్రేయస్కరం.



              ఎముకల్లో రెండు రకాల కేన్సర్ కణుతులు వస్తూ ఉంటాయి. వీటిని ప్రైమరీ, సెకండరీ బోన్ కేన్సర్స్ అంటూ ఉంటాం. ఎముకల్లో పుట్టేవి ఒక రకమైతే, శరీరంలోని ఇతర భాగాల్లో పుట్టి ఎముకల్లోకి పాకేవి రెండో రకం. అయితే ఎముకల్లో పుట్టే కేన్సర్ కణుతులు తక్కువే కాని. బయట ఎక్కడో పుట్టి, ఎముకల్లోకి విస్తరించేవే ఎక్కువ. నిజానికి అన్ని రకాల కేన్సర్లూ ఎముకలకు పాకవచ్చు.అయితే కొన్నిరకాల కేన్సర్లు ప్రత్యేకించి, ప్రొస్టేట్ కేన్సర్ చాలా వేగంగా పాకుతుంది. అందుకే ప్రొస్టేట్ కేన్సర్ ఉన్నట్లు తేలిన వారికి వెంటనే బోన్ స్కాన్ చేయించడం తప్పనిసరి అవుతుంది. అలాగే కిడ్నీ కేన్సర్, లంగ్ కేన్సర్, థైరాయిడ్ కేన్సర్, రొమ్ముకేన్సర్‌లు కూడా ఎముక లకు పాకే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ కారణంగానే రొమ్ము కేన్సర్‌కు వైద్యచికిత్సలు తీసుకున్న తరువాత కూడా ప్రతి ఏటా బోన్‌స్కాన్ సూచిస్తారు..

Friday 25 November 2016

లంగ్ కేన్సర్ యమ డేంజర్

 శ్వాసకోశాల కేన్సర్‌ నిర్ధారణ చాలా  క్లిష్టమైనది. ఈ  కేన్సర్‌ లక్షణాలు, క్షయ వ్యాధి లక్షణాలు దాదాపు ఒకేలా ఉండడం వల్ల, శ్వాసకోశ  కేన్సర్‌ను  క్షయవ్యాధిగా పొరబడే ప్రమాదం ఉంది. అందుకే క్షయ వ్యాధి మందులతోనే చాలా కాలం గడిపేయవచ్చు.  పైగా శ్వాసకోశ వ్యాధికి చాలా వేగంగా పెరిగే లక్షణం ఉంది.  అందుకే ఆలస్యమయ్యే కొద్దీ నాటికి  వ్యాధి బాగా ముదిరిపోవచ్చు. మొదట్లో  సాధారణ వైద్యచికిత్సలేవో తీసుకున్నా, లక్షణాలు తగ్గకపోవడం, తగ్గినా మళ్లీ మళ్లీ అవే లక్షణాలు  కనిపించినప్పుడు,  అది శ్వాసకోశ  కేన్సరేమోనని అనుమానించి  వెంటనే కేన్సర్‌  వైద్య నిపుణులను సంప్రదించాలి.



                   కొన్ని రకాల కేన్సర్‌ కణాలు  కొంత నిదానంగానే పెరుగుతూ వెళతాయి. మరికొన్ని చాలా వేగంగా విస్తరిస్తూ వెళతాయి. శ్వాసకోశాల్లో మొదలయ్యే కేన్సర్‌ కణాలకు కూడా చాలా వేగంగా పెరిగే లక్షణమూ ఇతర భాగాలకు పాకే తత్వమూ ఎక్కువ. శ్వాసకోశాల్లో మొదలయ్యే కేన్సర్లను ప్రైమరీ  లంగ్‌ కేన్సర్లనీ, కార్సినోమా కేన్సర్లనీ పిలుస్తారు. శ్వాసకోశ కేన్సర్‌ బారిన పడిన దాదాపు 85 శాతం మందిలో పొగ  తాగడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మిగతా 15 శాతం జన్యుపరమైన కారణాలతో పాటు  వాతావరణ కాలుష్యాలు కూడా కొంత కారణమవుతున్నాయి.

Thursday 24 November 2016

రాష్ట్రాన్ని కబళిస్తున్న కేన్సర్

తినే తిండి కల్తీ! పీల్చే గాలి కల్తీ! తాగే నీరు కూడా కల్తీ! వీటితోపాటు అనారోగ్యకరమైన జీవనశైలి! కారణమేదైనా గానీ.. తెలంగాణ రాష్ట్రంలో కేన్సర్‌ రోగుల సంఖ్య క్రమేపీ పెరుగుతుందన్నది మాత్రం చేదునిజం! ఆరోగ్యశ్రీ పథకంలో కేన్సర్‌ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో పాటు ప్రభుత్వం  నిర్వహించిన బ్రెస్ట్‌కేన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్ష ల్లోనూ కేన్సర్‌ రోగులు పెరుగుతున్నట్లు తేలుతోంది. మరోవైపు కేన్సర్‌ చికిత్సల వల్ల ప్రజలపైనే కాకుండా ప్రభుత్వంపై కూడా ఆర్థికంగా భారం అధికం అవుతోంది. ఇప్పటిదాకా వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే.. రాష్ట్రంలో కేన్సర్‌ వ్యాధి ఆందోళన కలిగించేలా విస్తరిస్తోందని తెలుస్తోంది.




                  ప్రభుత్వం  మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జడ్చర్ల, గంగాపూర్‌, వరంగల్‌ జిల్లా రాయపర్తి, మహబూబాబాద్‌లలో మహిళల కోసం బ్రెస్ట్‌ కేన్సర్‌ మొబైల్‌ స్క్రీనింగ్‌ కేంద్రాలను నిర్వహించింది. రెండు రోజుల్లో 1,271 మంది మహిళలకు పరీక్షలు చేశారు. వీరిలో 273 మందికి కేన్సర్‌ ఉన్నట్లు అనుమానం కలగడంతో మమ్మోగ్రామ్‌ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 135 మందికి కేన్సర్‌ ఉందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. వీరికి మరిన్ని పరీక్షల కోసం శాంపిళ్లను సేకరించి బయాప్సీ కోసం పంపించారు. 

Wednesday 23 November 2016

పండులో ఆరోగ్యం

మనం తీసుకునే ఆహారంతో పాటు .. పండ్లను కూడా తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. పండ్లలో అనేక రకాలై పోషకపదార్థాలు ఉంటాయి. అలాగే రోజూ  పండ్లు తినివారిలో  వ్యాధి నిరోధక శక్తి  అధికంగా  ఉంటుంది. వివిధ రకాలైన  పండ్లు రోజూ  తీసుకోవడం వల్ల .. కొన్ని రకాలైన వ్యాధులు రాకుండా ముందే నిరోధించవచ్చని వైద్యులు చెబుతున్నారు. మన గుండెను భద్రంగా  చూసుకోవాలంటే .. పాలి పినాల్స్ ఎక్కువగా ఉండే  ఫ్రూ ట్స్ తినాలి .
           

క్యాన్సర్  మహమ్మరి… ఎవరిని ఏరకంగా చుట్టుముడుతుందో అస్సలు చెప్పలేం.  చాలా మంది రకరకాల క్యాన్సర్ల బారిన పడుతూ ఉంటారు. అలాంటి కేన్సర్ మన దరికి చేరకుండా చూడాలంటే .. పండ్ల ప్రత్యామ్నాయం . లిచీ ఫ్రూట్ రెగ్యులర్ గా తింటూ ఉంటే … బ్రెస్ట్ కేన్సర్ ను దూరంగా పెట్టొచ్చు.  లిచీలో  యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అవి కేన్సర్ కారకాలను అరికడతాయని వైద్యులు చెబుతున్నారు. ఇక బొప్పాయి లాంటి  పండ్లలో  బీటా క్రిపోక్సాంథిన్  ఎక్కువగా ఉంటుంది. ఇది లంగ్ కేన్సర్ నుంచి రక్షిస్తుంది.

 

Tuesday 22 November 2016

ఆ అయిదు వైర‌స్ ల తోనే క్యాన్స‌ర్..


మానవ రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేసే మహమ్మారి వైరస్‌.. హెచ్‌ఐవీ టైప్‌ 1 ద్వారా కేన్సర్‌ కూడా వచ్చే ముప్పు ఉందని అమెరికాకు చెందిన హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌ విభాగం వెల్లడించింది. మనుషుల్లో కేన్సర్‌కు కారణమయ్యే ఏడు కారకాలను ను శాస్త్రవేత్తలు కార్సినోజెన్ల జాబితాలో కొత్తగా చేర్చారు. అందులో ఒకటి ఈ హెచ్‌ఐవీ టైప్‌1 కాగా.. దాంతోపాటు మరో నాలుగు వైర్‌సలు, ఒక రసాయన పదార్థం, ఒక లోహం ఉన్నాయి. దీంతో మొత్తం కేన్సర్‌ కారకాల సంఖ్య 248కు చేరింది.


        జూ హెచ్‌ఐవీ-1, జూ హ్యూమన్‌ టి-సెల్‌ లింఫోట్రోపిక్‌ వైరస్‌ టైప్‌ 1, జూ ఎప్‌స్టీన్‌-బర్‌ వైరస్‌ , జూ కపోసి సర్కోమా-అసోసియేటెడ్‌ హెర్పి్‌సవైరస్‌ , జూ మెర్కెల్‌ సెల్‌ పోల్యోమావైరస్‌. ఈ ఐదు వైర్‌సలకూ.. నాన్‌-మెలనోమా స్కిన్‌ కేన్సర్‌, కంటి కేన్సర్‌, ఊపిరితిత్తుల కేన్సర్‌, ఉదరకోశ కేన్సర్‌, లింఫోమా సహా 20 రకాల కేన్సర్లతో సంబంధం ఉందని హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌ తన 14వ నివేదికలో వెల్లడించింది. వైర‌స్ లు కావచ్చు.. రసాయనాలు కావచ్చు.. కేన్సర్‌ కారకాల జాబితాలో ఉన్న వాటికి ఎక్స్‌పోజ్‌ అయినంత మాత్రాన కేన్సర్‌ వచ్చేస్తుందేమోనని భయపడాల్సిన పని లేదని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. రాత్రి సమయాల్లో పని చేసినా, ఉదయం కొంత సమయం నిద్రించకపోయినా, అలాగే రాత్రి పది గంటల కన్నా ఎక్కువ సేపు నిద్రించినా కేన్సర్‌ ముప్పు తప్పదని చైనా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Monday 21 November 2016

శ్వాసతో ఊపిరితిత్తుల కేన్సర్‌ గుర్తింపు

ప్రాణాంతక ఊపిరితిత్తుల కేన్సర్‌ను తొలినాళ్లలోనే పసిగట్టేందుకు సరికొత్త పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. లంగ్‌ కేన్సర్‌ ఇండికేటర్‌ డిటెక్షన్‌,లూసిడ్‌ గా వ్యవహరిస్తున్న ఈ పరికరం.. శ్వాసను పరీక్షించడం ద్వారా ఊపిరితిత్తుల కేన్సర్‌ జాడలను ఇట్టే పసిగడుతుందని అన్నారు. కేంబ్రిడ్జికి చెందిన ఓవల్‌స్టోన్‌ నానోటెక్‌ లిమిటెడ్‌ కంపెనీ ఈ పరికరాన్ని అభివృద్ధి చేసింది.


 లంగ్‌ కేన్సర్‌ సోకిన తర్వాత బాధితుల జీవితకాలం ఐదేళ్లకు పడిపోతుంది. ఈ క్రమంలో దీన్ని ముందుగా గుర్తించడం వల్ల బాధితులను రక్షించేందుకు అవకాశం లభిస్తుందని ఓవల్‌స్టోన్‌ సహ వ్యవస్థాపకుడు బిల్లీ బోయలే తెలిపారు. ప్రస్తుతం తుది పరిశీలన దశలో ఉన్న లుసిడ్‌ను వచ్చే ఏడాది తొలినాళ్లలో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ పరికరంతో లంగ్‌ కేన్సర్‌ను ఖచ్చితంగా నిర్ధారించవచ్చని వివరించారు.

Sunday 20 November 2016

పడగవిప్పుతున్న లంగ్‌ క్యాన్సర్‌

ప్రపంచవ్యాప్తంగా లంగ్‌ కాన్సర్‌ కేసులు పెరిగిపోతున్నాయి. అవగాహన కల్పించడం, కారణాలను వెంటనే గుర్తించడం చేస్తున్నప్పటికీ ఎన్నో ఏండ్లుగా ఫలితాల్లో మాత్రం మార్పు ఉండడంలేదు. అందుకే ఈ క్యాన్సర్‌కు కారణమయ్యే వాటిని గుర్తించి, కమ్యూనిటీ స్థాయిలో నిరోధకచర్యలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. భారతదేశంలో ఏటా సుమారుగా 63,000 లంగ్‌ కాన్సర్‌ కేసులు నమోదవుతున్నాయని ఓ సర్వేలో నిర్థారణ అయ్యింది. అన్ని కాన్సర్‌ కేసుల్లోనూ స్త్రీ, పురుషుల మరణాలకు సంబంధించి 9.3 శాతం వాటికి లంగ్‌ క్యాన్సర్‌ కారణమవుతోంది. ఢిల్లీ, చెన్నై, బెంగళూరులలో స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ లంగ్‌క్యాన్సర్‌ గణనీయంగా పెరుగుతున్నట్టుగా గణాంకాలు సూచిస్తున్నాయి.


             గ్లోబొకాన్‌ నివేదిక ప్రకారం వివిధ రకాల క్యాన్సర్‌లలో బ్రెస్ట్‌, సెర్వికల్‌, ఓరల్‌ కేవిటీల తరువాత లంగ్‌ కేన్సర్‌ నాలుగోస్థానంలో ఉంది. కేన్సర్‌ ఉదంతాలకు సంబంధించి పురుషుల్లో ఇది రెండో స్థానంలో నిలువగా, మహిళల్లో ఆరో స్థానంలో ఉంది. ఏటా భారతీయ పురుషుల్లో 53,728, మహిళల్లో 16,547 నూతన లంగ్‌క్యాన్సర్‌ను గుర్తిస్తున్నారు. ఈ క్యాన్సర్‌తో ఉన్న భారతీయ రోగుల్లో ధూమపానం చేసే అలవాటు పురుషుల్లో 87 శాతంగా, మహిళల్లో 85 శాతంగా ఉంది. పాసివ్‌ టొబాకో ఎక్స్‌పోజర్‌కు గురయ్యే వారు 3 శాతంగా ఉన్నారు. అంటే అన్ని కేసుల్లోనూ 90% పొగాకు దుష్ప్రభావాలకు లోనవడం మూలాన్నే లంగ్‌క్యాన్సర్‌ బారిన పడుతున్నారు.

Saturday 19 November 2016

కేన్సర్ వేగం.. గుర్తింపు ఆలస్యం



కొన్ని రకాల కేన్సర్‌ కణాలు  కొంత నిదానంగానే పెరుగుతూ వెళతాయి. మరికొన్ని చాలా వేగంగా విస్తరిస్తూ వెళతాయి. శ్వాసకోశాల్లో మొదలయ్యే కేన్సర్‌ కణాలకు కూడా చాలా వేగంగా పెరిగే లక్షణమూ ఇతర భాగాలకు పాకే తత్వమూ ఎక్కువ. శ్వాసకోశాల్లో మొదలయ్యే కేన్సర్లను ప్రైమరీ  లంగ్‌ కేన్సర్లనీ, కార్సినోమా కేన్సర్లనీ పిలుస్తారు. శ్వాసకోశ కేన్సర్‌ బారిన పడిన దాదాపు 85 శాతం మందిలో పొగ  తాగడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మిగతా 15 శాతం జన్యుపరమైన కారణాలతో పాటు  వాతావరణ కాలుష్యాలు కూడా కొంత కారణమవుతున్నాయి.


శ్వాసకోశ కేన్సర్లు రెండు రకాలు. వాటిలో మొదటిది స్మాల్‌ సెల్‌ లంగ్‌ కేన్సర్‌. ఈ రకం కేన్సర్లు శ్వాసకోశ కేన్సర్లలో 14 శాతం దాకా ఉంటాయి. ఈ కేన్సర్‌ను ఓట్‌ సెల్‌ కార్సినోమా అని కూడా పిలుస్తారు. ఈ కేన్సర్‌కు అత్యంత వేగంగా విస్తరించే లక్షణం ఉంది. అలాగే ఇతర శరీర భాగాలకు అంటే లింఫ్‌నోడ్స్‌, ఎముకలు, మెదడు, అడ్రినల్‌ గ్లాండ్స్‌, లివర్‌ భాగాలకు  వ్యాపించే గుణం ఉంది.  ఈ కేన్సర్‌ కారకుల్లో దాదాపు 95 శాతం మందిలో పొగాకు సేవించే అలవాటు ఉన్నవారే. నాన్ స్మాల్ లంగ్‌ కేన్సర్‌ ను తిరిగి  మూడు తరగతులుగా  విభజించారు.  అందులో స్క్వామస్‌ సెల్‌ కార్సినోమా ఒకటి. దాదాపు 30 శాతం మందిలో ఈ కేన్సర్లే కనిపిస్తాయి. ఈ కేన్సర్‌కు కూడా పొగాకు అలవాట్లే కారణం.

Thursday 17 November 2016

నడకతో కేన్సర్ దూరం


రోజుకు కనీసం 20 నిమిషాల పాటు నడక.. మంచి నిద్రతో ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇంకా ఆయుష్షును పెంచుకోవచ్చు. అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని వైద్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా గుండెపోటు, లివర్ సమస్యలు, కేన్సర్ వంటి వ్యాధులను దూరం చేసుకుంటేనే ఆయుష్షును పెంచుకున్నట్లేనని.. వాటికి కొన్ని చిట్కాలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.  వాటిలో మొదటిది ఆల్కహాల్ తీసుకోకపోవడం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండటం వంటివి చేస్తేనే ఆరోగ్యం ఉన్నట్టే. ఆల్కహాల్‌ను ఎంతమటుకు తగ్గిస్తే అంతమటుకు లివర్‌ను కాపాడుకోవచ్చు. ఇంకా బరువును కూడా తగ్గించుకోవచ్చు. హాయిగా నిద్రపోవచ్చు.          




  అలాగే వ్యాయామం రోజు వారీ పనుల్లో ఒక భాగమైపోవాలి. రోజుకు 20 లేదా అరగంటపాటు నడిస్తే గుండె నొప్పిని దూరం చేసుకోవచ్చు. కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేయవచ్చు. బీపీని నియంత్రించుకోవచ్చు. ఇక మూడోది పొగాకు ఉత్పత్తులను దూరంగా ఉంచడం.. తద్వారా లంగ్ కేన్సర్, గుండెనొప్పిని దరిచేరనీయకుండా చేసుకోవచ్చు. అలాగే మనం తీసుకునే ఆహారంలో షుగర్ శాతాన్ని తగ్గించుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌కు బ్రేక్ వేయవచ్చు. ఒత్తిడిలోనుకాకుండా ప్రశాంతంగా ఉంటే హైబీపీ తరిమికొట్టవచ్చునని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Sunday 13 November 2016

లంగ్ కేన్సర్.. వెరీ డేంజర్

ప్రపంచవ్యాప్తంగా లంగ్‌ కాన్సర్‌ కేసులు పెరిగిపోతున్నాయి. అవగాహన కల్పించడం, కారణాలను వెంటనే గుర్తించడం చేస్తున్నప్పటికీ ఎన్నో ఏండ్లుగా ఫలితాల్లో మాత్రం మార్పు ఉండడంలేదు. అందుకే ఈ క్యాన్సర్‌కు కారణమయ్యే వాటిని గుర్తించి, కమ్యూనిటీ స్థాయిలో నిరోధకచర్యలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. భారతదేశంలో ఏటా సుమారుగా 63,000 లంగ్‌ కాన్సర్‌ కేసులు నమోదవుతున్నాయని ఓ సర్వేలో నిర్థారణ అయ్యింది. అన్ని కాన్సర్‌ కేసుల్లోనూ స్త్రీ, పురుషుల మరణాలకు సంబంధించి 9.3 శాతం వాటికి లంగ్‌ క్యాన్సర్‌ కారణమవుతోంది. ఢిల్లీ, చెన్నై, బెంగళూరులలో స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ లంగ్‌క్యాన్సర్‌ గణనీయంగా పెరుగుతున్నట్టుగా గణాంకాలు సూచిస్తున్నాయి.


      గ్లోబొకాన్‌ నివేదిక ప్రకారం వివిధ రకాల క్యాన్సర్‌లలో బ్రెస్ట్‌, సెర్వికల్‌, ఓరల్‌ కేవిటీల తరువాత లంగ్‌ కేన్సర్‌ నాలుగోస్థానంలో ఉంది. కేన్సర్‌ ఉదంతాలకు సంబంధించి పురుషుల్లో ఇది రెండో స్థానంలో నిలువగా, మహిళల్లో ఆరో స్థానంలో ఉంది. ఏటా భారతీయ పురుషుల్లో 53,728, మహిళల్లో 16,547 నూతన లంగ్‌క్యాన్సర్‌ను గుర్తిస్తున్నారు. ఈ క్యాన్సర్‌తో ఉన్న భారతీయ రోగుల్లో ధూమపానం చేసే అలవాటు పురుషుల్లో 87 శాతంగా, మహిళల్లో 85 శాతంగా ఉంది. పాసివ్‌ టొబాకో ఎక్స్‌పోజర్‌కు గురయ్యే వారు 3 శాతంగా ఉన్నారు. అంటే అన్ని కేసుల్లోనూ 90% పొగాకు దుష్ప్రభావాలకు లోనవడం మూలాన్నే లంగ్‌క్యాన్సర్‌ బారిన పడుతున్నారు.

కొన్నేళ్ల ముందే కేన్సర్ గుర్తించొచ్చా..?

ప్రస్తుతం మహమ్మారిగా మారిన కేన్సర్‌ రావచ్చని దాదాపు పదేళ్ల ముందే గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన కొత్త రక్త పరీక్ష త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. డీఎన్‌ఏకు సంబంధించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. మన శరీరంలో టెలోమెర్స్‌ అనే చిన్న చిన్న ఆకారాలు ఉంటాయి. వాస్తవానికి, మన షూ లేస్‌కు చివర్లో ప్లాస్టిక్‌ మూతలా ఒకటి ఉంటుంది కదా! అలాగే, మన క్రోమోజోములకు చివర్లో మూతలా ఈ టెలోమెర్స్‌ ఉంటాయి. క్రోమోజోముల్లోని డీఎన్‌ఏ పాడవకుండా అది కాపాడుతుంది. షూ లేస్‌ చివర్లోని ప్లాస్టిక్‌ పోయిందనుకోండి.. ఇక లేస్‌ అంతా పాడవుతుంది కదా! అలాగే, టెలోమెర్స్‌ పాడయితే క్రోమోజోముల్లోని డీఎన్‌ఏ కూడా దెబ్బతింటుంది.


                 ఇక, మనకు వయసు పెరుగుతున్నకొద్దీ ఈ టెలోమెర్స్‌ చిన్నవి అవుతూ ఉంటాయి. దాంతో మన డీఎన్‌ఏ కూడా పాడవుతూ వస్తుంది. తద్వారా, వయసుతోపాటు వచ్చే అల్జీమర్స్‌, డయాబెటిస్‌, గుండెపోటు వంటి వ్యాధులు వస్తాయి. ఈ టెలోమెర్స్‌ కనక సాధారణం కంటే చిన్నవి అయిపోయాయనుకోండి. అది అనారోగ్యానికి, మరణానికి చేరువ అవుతున్నారనడానికి సంకేతం అన్నమాట. ఇప్పుడు, టెలోమెర్స్‌ పొడవులో మార్పులను బట్టి కేన్సర్‌ వచ్చే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని కనుగొనవచ్చని నార్త్‌వెస్టర్న్‌ అండ్‌ హార్వర్డ్‌ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటి పొడవులో భారీగా మార్పులు వచ్చేస్తే.. అంటే చిన్నవి అయిపోతే, అతనికి కేన్సర్‌ వచ్చే అవకాశం ఉందని చాలా ఏళ్లకు ముందుగానే గుర్తించవచ్చని వివరిస్తున్నారు.

Friday 11 November 2016

పిల్లల వద్ద పొగ తాగితే మీకే నష్టం

లండన్: పొగతాగే వారి పక్కనవుంటే దాని చెడు ప్రభావం వారిపై కూడా వుంటుందని అధ్యయనాలు చెపుతున్నాయి. అయితే, ఇపుడు తాజాగా పొగతాగే వారి పక్కన కనుక పిల్లలు, యుక్తవయస్కులు వుంటే వారికి వినికిడి కొరవడుతుందని కూడా మరో అధ్యయనంలో తేలింది. న్యూయార్క్ విశ్వవిద్యాలయం 12 సంవత్సరాలనుండి 19 సంవత్సరాల వయసుకల 1500 మంది పిల్లలపై ఈ అధ్యయనాన్ని నిర్వహించి పొగ పీల్చిన కారణంగా నత్త ఆకారంలో వున్న వారి లోపలి చెవి భాగంలో సమస్యలు వచ్చాయని తేల్చారు. సైంటిస్టుల మేరకు, పాసివ్ స్మాకింగ్ చెవి లోపలి భాగాలకు రక్తసరఫరా ఆటంకపరచి పిల్లలకు, చెప్పేది అవగాహన చేసుకోకుండా చేస్తుందని దానితో వారు చదువులలో వెనుకబడటం, పాఠశాలలో అల్లరి చిల్లరిగా ప్రవర్తించటం చేస్తారని చెపుతున్నారు.


           సాధారణంగా ఈ వినికిడిలోపం వయసు మళ్ళిన వారిలోను లేదా పుటుకతోనే వినికిడి సమస్య వున్న వారికి వుంటుందని అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త మైకేల్ వీజ్ మన్ తెలియజేస్తున్నారు. పాసివ్ స్మాకింగ్ పై చేయబడిన పరిశోధనలు ఇప్పటికే ఆస్తమా, గుండె జబ్బులు, లంగ్ కేన్సర్ మొదలైన ప్రభావాలు చూపుతున్నాయని తెలుపబడింది. ప్రస్తుత అధ్యయనంకుగాను పరిశోధకులు యుక్తవయస్కులపై విస్తృత పరిశోధనలు చేశారు. పొగ తాగే వారి పక్కన వున్న పిల్లలకు, పొగతాగని వారి పక్కన వున్న పిల్లలకు మధ్య ఈ వినికిడి లోపం ఏర్పడుతోందని గుర్తించారు.

Thursday 10 November 2016

మీకు లంగ్‌ కేన్సర్‌ వస్తుందా?


 ధూమపానం చేసేవారికి రకరకాల కేన్సర్లు.. ముఖ్యంగా లంగ్‌ కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందనేది అందరికీ తెలిసిన పాత విషయమే. కానీ.. కొంతమంది జీవితాంతం సిగరెట్లు తాగినా రాదు. కొందరికి వస్తుంది. స్మోకర్లలో అలా ఎవరికి లంగ్‌ కేన్సర్‌ వస్తుందో ఇన్నాళ్లూ వైద్యులు సైతం చెప్పలేకపోయారు. కానీ.. దీన్ని నిర్ధారించగల సరికొత్త వైద్యపరీక్షను యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు రూపొందించారు.



సిగరెట్‌ తాగేవారి నోటి నుంచి ముక్కు నుంచి స్రావాలను సేకరించి వాటిని పరారుణ కాంతి (ఇన్‌ఫ్రారెడ్‌ లైట్‌) కింద పెడతారు. ధూమపానం వల్ల ఊపిరితిత్తుల్లోని, నోరు, ముక్కులోని కణాలు ఒకరకమైన ప్రభావానికి గురవుతాయి. ఆ ప్రభావానికి గురైన కణాలు పరారుణ కిరణాలకు ఒకరకంగా వెలుగుతాయి. అలాకానివి మరో రకంగా వెలుగుతాయి. ఈ తేడా ఆధారంగా లంగ్‌ కేన్సర్‌ వచ్చేదీ రానిదీ అంచనా వేయవచ్చు.

Wednesday 9 November 2016

పాప్ కార్న్ తో జర భద్రం



పాప్ కార్న్ ని ఇష్టపడని వారు ఎవరుంటారు. పెద్దల దగ్గర్నుంచి పిల్లల వరకు పాప్ కార్న్ కి ఫ్యాన్స్ ఎక్కువే. ఇది ఓ టైం పాస్ స్నాక్. ఒకప్పుడు మాల్స్ లోనో, సినిమా హాల్స్ లోనో పాప్ కార్న్ దొరికేది. కానీ ఇప్పుడు బస్టాండ్స్, రైల్వేస్టేషన్స్ , పార్క్ లు ఇలా ఏ ప్లేస్ లో చూసినా పాప్ కార్న్ దొరకుతోంది. అంతేకాదు ఇప్పుడు ఇంట్లోనే టైంపాస్ కి ఐదు నిమిషాల్లో తయారుచేసుకునే విధంగా పాప్ కార్న్స్ వచ్చేశాయి. ఇందులో చాలా ఫ్లేవర్స్ కూడా వస్తున్నాయి.
      

ఇధంతా బాగానే ఉంది. కానీ టైంపాస్ కి తినే పాప్ కార్న్ భారీ మూల్యం చెల్లించమని అడుగుతోంది. అవును అసలు విషయం ఏంటంే పాప్ కార్న్ ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మైక్రోవేవ్ పాప్ కార్న్ తో లంగ్ కేన్సర్ బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు. మైక్రోవేవ్ పాప్ కార్న్ లో ఉండే డియాసిటైల్ అనే కెమికల్ వల్ల లంగ్ కేన్సర్ ప్రమాదం ఉందట. అందువల్ల మైక్రోవేవ్ పాప్ కార్న్ ను తినడం మానేయాలని హెచ్చరిస్తున్నారు. పాప్ కార్న్ ప్రియులకు బ్యాడ్ న్యూసే అయినా మానేయక తప్పదు కదా.

Tuesday 8 November 2016

పండులో ఆరోగ్యం

మనం తీసుకునే ఆహారంతో పాటు .. పండ్లను కూడా తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. పండ్లలో అనేక రకాలై
పోషకపదార్థాలు ఉంటాయి. అలాగే రోజూ  పండ్లు తినివారిలో  వ్యాధి నిరోధక శక్తి  అధికంగా  ఉంటుంది. వివిధ రకాలైన  పండ్లు రోజూ  తీసుకోవడం వల్ల .. కొన్ని రకాలైన వ్యాధులు రాకుండా ముందే నిరోధించవచ్చని వైద్యులు చెబుతున్నారు.

గుండె
మన గుండెను భద్రంగా  చూసుకోవాలంటే .. పాలి పినాల్స్ ఎక్కువగా ఉండే  ఫ్రూ ట్స్ తినాలి . ద్రాక్ష, లిచీ పండ్ల లో పాలిపినాల్స్ ఎక్కవగా ఉంటాయి.  అంతే కాదు. క్యాన్సర్ ను అరికట్టడంలోనూ బాగా పనిచేస్తాయి.

 క్యాన్సర్
క్యాన్సర్  మహమ్మరి… ఎవరిని ఏరకంగా చుట్టుముడుతుందో అస్సలు చెప్పలేం.  చాలా మంది రకరకాల క్యాన్సర్ల బారిన పడుతూ ఉంటారు. అలాంటి కేన్సర్ మన దరికి చేరకుండా చూడాలంటే .. పండ్ల ప్రత్యామ్నాయం . లిచీ ఫ్రూట్ రెగ్యులర్ గా తింటూ ఉంటే … బ్రెస్ట్ కేన్సర్ ను దూరంగా పెట్టొచ్చు.  లిచీలో  యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అవి కేన్సర్ కారకాలను అరికడతాయని వైద్యులు చెబుతున్నారు. ఇక బొప్పాయి లాంటి  పండ్లలో  బీటా క్రిపోక్సాంథిన్  ఎక్కువగా ఉంటుంది. ఇది లంగ్ కేన్సర్ నుంచి రక్షిస్తుంది.

 ఒబేసిటీ , కోలెస్ట్రాల్
ఒబేసిటీ, కోలె స్ట్రాల్ తో బాధపడే వారు.. రేగుపళ్లు, యాపిల్స్ తింటే మంచిది. పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది. 40 శాతానికి పైగా  పీచు పదార్థం ఈ పండ్లలో ఉంటుంది. కోలె స్ట్రాల్ ను నియంత్రించడానికి చక్కగా సహాయ పడతాయి

రక్తపోటు
రక్తపోటును తగ్గించడంలో .. అరటి పండు చాలా మేలు చేస్తుంది.  రోజుకో అరటి పండు తింటే ..రక్త పోటు కంట్రోల్ లో ఉంటుంది. అత్తి పండు  లో కూడా రక్తపోటును తగ్గించే పోటాషియం అదికంగా ఉంటుంది.

జీర్ణశక్తి
అజీర్తితో బాధడేవాళ్లు.. బొపాయి, జామపండు ముక్కులు  తింటే మంచిది. వాటిలో ఉండే పీచు పదార్థాలు జీర్ణ శక్తి కి సహకరిస్తాయి. అలాగే బొప్పాయిలోని పపెయిన్ అనే ఎంజైమ్ జీర్ణశక్తిని పెంచుతుంది. ఇక సీ విటమిన్ ఎక్కువగా ఉండే కమలా పండు వల్ల  మహిళల్లో చర్మంపై మడతలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

Monday 7 November 2016

టైర్లు కాలిస్తే క్యాన్సర్ ఖాయం


టైర్లు  కాలితే వెలువడే పొగ రకరకాల అనారోగ్యాలకు దారితీస్తుందని అనేక పరిశోధనల్లో తేలింది! ముఖ్యంగా కేన్సర్ ముప్పు అధికమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
1.ఒక్క టైరు తయారీలో సహజ రబ్బరుతోపాటు సింథటిక్ రబ్బరును, స్టీలు వైర్లను వాడతారు. సింథటిక్ రబ్బరు తయారీలో దాదాపు 7 లీటర్ల పెట్రోలు, క్లోరిన్, స్టైరీన్, బుటాడియెన్‌వంటి హానికర రసాయనాలు, 20 రకాలకు పైగా హెవీ మెటల్స్ వాడతారు. వీటిలో స్టైరీన్, బుటాడియెన్ రెండూ కేన్సర్ కారకాలే. అలాగే.. టైర్ల తయారీలో వాడే సీసం, క్రోమియం, కాడ్మియం, పాదరసం ప్రమాదకర కాలుష్య కారకాలు.

2.ఈ పొగ నుంచి వెలువడే డయాక్సిన్లు సుదీర్ఘ దూరాల పాటు ప్రయాణించి భూమిమీద, నీళ్లలోనూ, మొక్కలపైనా, జంతువులు, మనుషులపైనా దట్టంగా పరుచుకుంటాయి. జంతువుల, మనుషుల కొవ్వు కణాల్లో పేరుకుపోతాయి. ఈ డయాక్సిన్లు మనుషుల్లో పునరుత్పత్తి సామర్థ్యాన్ని మందగింపజేస్తాయి. వీటివల్ల మధుమేహం వచ్చే ముప్పు అధికంగా ఉంటుంది.

3. 1991లో.. కెనడియన్ ఓంటారియో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ ఎనర్జీ వారు ఒక పరిశోధన చేశారు. దాని ప్రకారం.. టైర్లు కాల్చిన నేలలో ఆ కాలుష్యం రెండు వందల రోజులకు పైగా తన ప్రభావం చూపుతోందని వారు గుర్తించారు. అంతేకాదు, ఆ ప్రదేశం నుంచి చుట్టుపక్కల 200 మీటర్ల దూరం దాకా పండించిన కూరగాయల్లోనూ ఆ కాలుష్యం తాలూకు ఆనవాళ్లున్నాయి.


4.టైర్లను కాల్చినప్పుడు వాటిలో ఉండే భారలోహాలు పూ ర్తిగా నాశనం కాకుండా వాటి అవశేషాలు నేలలో కలిసి మన ఆహారచక్రంలోకి ప్రవేశించి తీవ్ర అనారోగ్యాలకు కారణమవుతాయి. ఈ అవశేషాలు కలిగిన ఆహారం తినేవారిలో నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదమూ ఉంది. జింక్ అవశేషాలు పుట్టబోయే బిడ్డల్లో అనేక లోపాలను కలగజేస్తాయి. ఇక క్రోమియం..కేన్సర్ బారిన పడేస్తుంది.

5.ఆందోళన సమయాల్లో టైర్లను తగలబెట్టేవారికి తెలియని విషయమేంటంటే.. ఈ చర్య ద్వారా వారు తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే కాకుండా ఆ చుట్టుపక్కల నివసించేవారిని సైతం లంగ్ కేన్సర్, బ్లడ్ కేన్సర్ వంటి వాటి బారిన పడేస్తున్నారు. ముఖ్యంగా.. చిన్నపిల్లలపై ఈ విషవాయువుల ప్రభావం మరింత తీవ్రంగా ఉం టుంది. టైర్ల పొగ నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు వారి ఊపిరితిత్తుల్లోకి చొరబడి వాటిని పాడుచేస్తాయి.

6. టైర్లలోని సీసం నేలలో కరిగి ఆహారచక్రంలో కలిసినప్పుడు.. ఆ ఆహారం తినే పసిపిల్లలు మానసిక వైకల్యానికి గురయ్యే ముప్పు అధికం.

Sunday 6 November 2016

చిటికెలో కేన్సర్ పరీక్ష



గట్టిగా శ్వాస తీసుకోండి.. ఇప్పుడు ఒకసారి వదిలి పెట్టండి.. వెరీ గుడ్, ఊపిరితిత్తుల కేన్సర్ లేదు... మీరు నిశ్చింతగా ఉండొచ్చు... ఇదేంటి అనుకుంటున్నారా..? భవిష్యత్తులో వాస్తవ రూపం దాల్చనున్న చిటికెలో పూర్తయ్యే లంగ్ కేన్సర్ పరీక్ష ఇలానే ఉండబోతోంది. ఇలా శ్వాస ద్వారా విడుదల చేసే గాలిలో ఉండే రసాయనాల ఆధారంగా పరిశోధకులు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని చెప్పేస్తారట.


కేన్సర్ కణాలు కణుతుల ఎదుగుదలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన రసాయనాన్ని విడుదల చేస్తాయని భావిస్తున్నట్లు అమెరికాలోని క్లీవ్ లాండ్ రెస్పిరేటరీ ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్ పీటర్ జే మజోన్ అంటున్నారు. తమ పరిశోధనలో వచ్చిన ఫలితాల ఆధారంగా శ్వాస ఆధారిత కేన్సర్ ను గుర్తించే పరీక్షను రూపొందించే పనిలో ఉన్నామని చెప్పారు.

Saturday 5 November 2016

ఉమ్మిలో నెత్తురు పడితే.. కేన్సరే


సాధారణంగా ఉమ్మిలో నెత్తురు ముక్కునుంచి రక్తం కారిన కొంతసేపటి తరువాతనైనా కనిపి స్తుంది, లేదా బ్రష్‌తో బలంగా దంతధావనం చేసి నప్పుడు చిగుళ్లకు గాయం కావడం వల్లనైనా కనిపి స్తుంది. లేకపోతే శ్వాస మార్గంలో ఎక్కడైనా ఇన్‌ ఫెక్షన్‌కావటం, ఇరిటేట్‌ కావటం వల్లనైనా ఉమ్మిలో నెత్తురు కనిపించవచ్చు.కళ్లెలో రక్తం పడటానికి మరొక ప్రధాన కారణం ఏమిటంటే గడ్డకట్టిన రక్తం ఊపిరితిత్తులలో ప్రయా ణించటం. ఊపిరితిత్తులకు కేన్సర్‌ సోకటం వలన కూడా కళ్లెలో రక్తం కనిపిస్తుంది. అయితే ఈ రెండు కారణాలూ చాలా అరుదు. మీరు దగ్గిన ప్పుడు లేదా ఉమ్మివేసినప్పుడు ఉమ్మిలో రక్తంలో కనిపిస్తే ఈ కింది కారణాల్లో ఏదో ఒకటి కారణమై ఉండవచ్చునని భావించాలి. కళ్లె ఏ రంగులో ఉంది? ఏ సందర్భంలో రక్తం పడింది అనే విష యాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
          


 కొద్ది రోజులు, వారాలనుండి విడవకుండా కఫంలో రక్తం చారికలు కనిపిస్తుంటే ఒకప్పుడు దానిని డాక్టర్లు మొట్టమొదట టిబిగా సందేహించే వారు. సమాజంలో ఇప్పుడు టిబి చాలా వరకూ తగ్గిపోయింది. అందువల్ల ఇప్పుడు ఈ లక్షణం కనిపిస్తే క్రానిక్‌ బ్రాంకైటిస్‌ బాగా ముదిరిపోతే వచ్చే బ్రాంకిఎక్టాసిస్‌గా సందేహించడం జరుగుతుంది.బ్రాంకిఎక్టాసిస్‌లో ఊపిరితిత్తుల తాలూకు శ్వాస గొట్టాలు ఏ భాగంలోనైనా విశాలం కావడమో, బల హీనపడటమో జరుగుతుంది. ఈ రోగులకు సైనస్‌ సమస్య కూడా ఉంటుంది. మనిషికి ఒకసారి బ్రాంకిఎక్టాసిస్‌ వచ్చిందంటే శాశ్వతంగా ఉండిపో తుంది. దీర్ఘకాలం యాంటి బయాటిక్స్‌ వాడటం, ఛాతీకి ఫిజియోథెరపీ అవసరమవుతాయి.

Friday 4 November 2016

చెడు అలవాట్లతో కేన్సర్ ముప్పు




సిటీల్లో  రోడ్ల మీద ఎలాంటి మాస్కులు, హెల్మెట్ కూడా పెట్టుకోకుండా ఒక్క గంట సేపు తిరిగితే చాలు.. ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి నెలకొంది.  పెరుగుతోన్న వాహన కాలుష్యంతో కనీసం స్వచ్ఛమైన గాలి కూడా కరవైంది. హైదరాబాద్ గాలిలో ఒక క్యూబిక్ మీటరుకు 60 మైక్రో గ్రాముల వరకు పర్టిక్యులేట్ మేటర్  ఉండవచ్చని కాలుష్య నియంత్రణ మండలి లెక్కలు వెల్లడిస్తున్నాయి. అది ఇప్పుడు 95 మైక్రో గ్రాములకు చేరింది.


                    జంటనగర వాసులు ఆందోళన, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఒత్తిడి నుంచి ఉపశమనానికి వారి ఆహారపు అలవాట్లు అంటే జంక్ ఫుడ్ తినడంతో పాటు ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్ల వల్ల కూడా కేన్సర్ వస్తుందని వైద్య నిఫుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో, మామూలు ఆస్తమా నుంచి ఊపిరితిత్తుల కేన్సర్, గుండెపోటుతో సహా అనేక రకాల జబ్బులు వచ్చే ప్రమాదముంది. ఇక, ఆటోలు, బస్సులు, ఇతర వాహనాల నుంచి వెలువడుతోన్న పొగలో ఉండే కాలుష్య కారకాలతో పలు రకాల కేన్సర్లు వస్తాయని వైద్య నిఫుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా కనపడుతోంది. లంగ్ కేన్సర్ రావడానికి ఇదే ప్రధాన కారణమని పల్మనాలజిస్టులు పేర్కొన్నారు.

Thursday 3 November 2016

కేన్సర్ పై ముప్పేట దాడి



ఊపిరితిత్తుల కేన్సర్‌ నివారణకు శాస్త్రవేత్తలు సరికొత్త చికిత్సా విధానాన్ని కనుగొన్నారు. ఇందులో రెండు రకాల ఔషధాలను ఉపయోగించడంతోపాటు రేడియేషన్‌ చికిత్సను కూడా ఏకకాలంలో చేయిస్తే ఊపిరితిత్తుల కేన్సర్‌ను నివారించవచ్చని థామస్‌ జఫర్సన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఎలుకలపై చేసిన పరీక్షల్లో వెల్లడైంది. ప్రమాదకరమైన నాన్‌ స్మాల్‌ సెల్‌ లంగ్‌ కేన్సర్‌  నివారణలో ఆధునిక చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నా.. కొన్ని కేన్సర్‌ కణాలు మాత్రం రూపాన్ని మార్చుకుని శరీరంలోనే ఉంటున్నాయి.


           రెండు రకాలైన ఔషధాలను, రేడియేషన్‌ చికిత్సను ఏకకాలంలో చేయడం వల్ల కేఆర్‌ఏఎస్‌ జన్యువులోని మార్పుల వల్ల వచ్చే కేన్సర్‌లను నివారించవచ్చని వర్సిటీ ప్రొఫెసర్‌ బో లూ తెలిపారు. కేన్సర్‌ కణితులు, మెలనోమా కేన్సర్‌ నివారణకు ఉపయోగించే రెండు రకాల కేన్సర్‌ ఔషధాలను కలిపి సరికొత్త ఔషధాన్ని తయారుచేస్తున్నామని, ప్రస్తుతం ఇది వైద్య పరీక్షల దశలో ఉందన్నారు.

Wednesday 2 November 2016

కాలుష్యంతో కేన్సర్ ముప్పు



ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం కేన్సర్ వ్యాధిగ్రస్తులు కూడా ప్రపంచంలో మొత్తంలో భారతదేశంలోనే ఎక్కువగా 10 లక్షలమందికి పైగా ఉన్నారు. కేవలం వివిధ రకాల కాలుష్యాల వల్ల భారత్ లో ఏడాదిలో మరణించిన వారి సంఖ్య 14 లక్షలకు పైగా ఉంది.  చిన్న చిన్న తప్పులే పెనుముప్పులా మారి మొత్తం దేశాన్నే కాలుష్య కార్ఖానాగా మార్చాయన్నది విమర్శ కాదు వాస్తవం. వాయుకాలుష్యం, నీటి కాలుష్యం, భూ కాలుష్యం, శబ్దకాలుష్యం ముఖ్యమైనది. వాయు కాలుష్యం ముఖ్యంగా పరిశ్రమల నుంచి, వాహనాల నుంచి వెలువడే పొగ వల్ల ఇంకా ఇప్పటికీ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న బొగ్గు ఆధారిత పవర్ ప్రాజెక్టులవల్ల ఏర్పడుతోంది. మనదేశంలో ఎక్కువ మంది బాధపడుతున్న లంగ్ కేన్సర్ కు కారణం కూడా ఈ వాయు కాలుష్యమే.


                 స్వాతంత్య్రం రాకముందే మహాత్మాగాంధీ ఈ దేశ ప్రజల అపరిశుభ్రత చూసి ఆవేదనతో ఈ దేశానికి స్వాతంత్య్రం రావడం ఎంత ముఖ్యమో పరిశు భ్రత అంతకన్నా ముఖ్యమని చెప్పినా, అర్థం చేసుకోని బుద్ధిమాంద్యం మన వారసత్వం. అంతరిక్ష విజయాల గురించి గొప్పలు చెప్పుకుంటున్న మనకు నేటికీ, దేశంలో పలు ప్రాంతాలలో బహిరంగ మల,మూత్ర విసర్జనలు, హారన్ మోతలు పంటికింద రాయిలా తగులుతున్నాయి. తెలిసి చేసినా, తెలియక చేసినా కాలుష్యం వల్ల వచ్చేది నష్టమే. పోయేది ఆరోగ్యమే. మనకోసం, మన భవిష్యత్ తరాలకోసం కాలుష్యాన్ని అరికట్టాలి. కాలుష్యం ఇదే స్థాయిలో పెరిగితే దేశమంతా లంగ్ కేన్సర్ బారిన పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tuesday 1 November 2016

పాంక్రియాజ్ కేన్సర్ అవేర్ నెస్ మంత్ నవంబర్



నవంబర్ ను పాంక్రియాటిక్ కేన్సర్ మంత్ గా పాటిస్తున్నారు. పాంక్రియాజ్, స్టమక్ కేన్సర్ లక్షణాలను జాగ్రత్తగా గమనిస్తే ముందు జాగ్రత్త పడటం తేలికౌతుంది. ఆ లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం. డైటింగ్‌, వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గుతున్నట్లయితే ఫర్వాలేదు. కానీ ఆహారపు అలవాట్లు మార్చుకోకుండానే, ఏ కారణం లేకుండానే బరువు తగ్గుతున్నట్లయితే అనుమానించాల్సి ఉంటుంది. పాంక్రియాజ్‌, స్టమక్‌ వంటి కేన్సర్‌లలో బరువు తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఎంతకీ విడవని జ్వరం లింఫోమా, ల్యుకేమియా వంటి బ్లడ్‌కేన్సర్‌లకు సంకేతం కావచ్చు. కాబట్టి జ్వరం తగ్గకుండా ఉన్నట్లయితే డాక్టర్‌ను సంప్రదించాలి. ఒకవేళ అది కేన్సర్‌ కాకపోయినా జ్వరం తగ్గేవరకు చికిత్స తీసుకోవడం మరువద్దు.








              నొప్పికి చాలా కారణాలుంటాయి. అయితే వదలకుండా ఉన్న తలనొప్పి బ్రెయిన్‌ కేన్సర్‌ సంకేతం కావచ్చు. నడుంనొప్పి రెక్టల్‌, ఒవేరియన్‌ కేన్సర్‌కు సంకేతం కావచ్చు. ఒకవేళ విడవకుండా నొప్పి ఉన్నట్లయితే వైద్యుని సంప్రదించి కారణం తెలుసుకోండి. చాలా రోజులుగా దగ్గు బాధిస్తోందా? అది లంగ్‌ కేన్సర్‌కు సంకేతం కావచ్చు. సీజనల్‌ అలర్జీ వల్ల వచ్చిన దగ్గు కావచ్చు. కారణం ఏదైనా పరీక్ష చేయించుకోవడం మాత్రం మరువద్దు. శరీరంలో ఎక్కడైనా గడ్డల మాదిరిగా తగిలితే నిర్లక్ష్యం పనికిరాదు. బ్రెస్ట్‌, టెస్టికల్స్‌, లింఫ్‌ నోడ్స్‌ దగ్గర గడ్డల మాదిరిగా ఉంటే పరీక్ష చేయించడం ఉత్తమం. అబ్‌నార్మల్‌ బ్లీడింగ్‌ కేన్సర్‌కు సంకేతం కావచ్చు. దగ్గినపుడు కఫంలో రక్తం పడటం, మలంలో రక్తం పడటం, మూత్రంతో పాటు రక్తం రావడం, వెజైనల్‌ బ్లీడింగ్‌ వంటివి కేన్సర్‌కు సంకేతాలు. ఒకవేళ పుండు ఎంతకీ తగ్గకుండా ఉన్నట్లయితే డాక్టర్‌తో చెక్‌ చేయించుకోవాలి. నోట్లో పుండ్లు ఉన్నా ఓరల్‌ కేన్సర్‌ లక్షణం కావచ్చు. ఒకవేళ పుట్టుమచ్చల్లో ఏమైనా మార్పులు కనిపించినా, చర్మంపై ఇతర మార్పులు కనిపించినా మెలనొమాకు సంకేతం కావచ్చు. కాబట్టి డెర్మటాలజిస్టును కలవాలి.  ఎప్పుడూ నీరసంగా ఉండటం కూడా కేన్సర్‌ సంకేతం కావచ్చు. చాలా మందిలో వివిధ కారణాల వల్ల నీరసం ఉంటుంది. ఒకవేళ రోజంతా నీరసంగా ఉన్నట్లయితే డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం.

Monday 31 October 2016

లంగ్ కేన్సర్ అవేర్ నెస్ మంత్ నవంబర్



నవంబర్ ను లంగ్ కేన్సర్ అవేర్ నెస్ మంత్ గా జరుపుకుంటున్నారు. కేన్సర్‌ మూలంగా చనిపోవడానికి కారణం ఆలస్యంగా వ్యాధి నిర్ధారణ జరగడమే. తొలిదశలో గుర్తిస్తే కేన్సర్‌ను జయించే అవకాశాలు 99 శాతం ఉంటాయి. అయితే కొన్ని కేన్సర్లలో వ్యాధి లక్షణాలు త్వరగా బయటపడవు. వ్యాధి నిర్ధారణ చేయడానికి అవసరమైన పరీక్షలు కూడా కష్టంగా ఉంటాయి. అలాంటి వాటిలో లంగ్‌ కేన్సర్‌ కూడా ఒకటి. అయితే ఈ కేన్సర్‌ను పసిగట్టేందుకు ఓ కొత్త మార్గాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో కేన్సర్‌ నిర్ధారణలో ఉపయోగించే బాధాకరమైన పద్ధతులకు వీడ్కోలు పలకవచ్చని వారు భావిస్తున్నారు.


                         లంగ్‌ కేన్సర్‌ బాధితులలో తాజాగా గుర్తించిన ఓ బయోమార్కర్‌ ద్వారా కేన్సర్‌ను ఖచ్చితంగా గుర్తించవచ్చని కనుగొన్నారు. ప్రస్తుతం ఊపిరితిత్తుల కేన్సర్‌ నిర్ధారణకు ఉపయోగించే బ్రోంకోస్కోపీ పరీక్ష ఖర్చుతో కూడుకోవడంతో పాటు బాధాకరమైంది కూడా. ఈ నేపథ్యంలో కేన్సర్‌ సోకిందేమోననే అనుమానం కలిగితే వైద్యులు ఈ కొత్త విధానం ద్వారా తక్కువ ఖర్చుతో తేలిగ్గా వ్యాధినిర్ధారణ చేయవచ్చు.





Wednesday 12 October 2016

స్మార్ట్ ఫోన్ ఫ్లాష్ తో కంటి కేన్సర్ గుర్తింపు

ఐదేళ్లలోపు చిన్నారులలో కంటి కేన్సర్‌ బాధితులను స్మార్ట్‌ఫోన్‌ కెమెరాతో గుర్తించవచ్చని కేన్సర్‌ నిపుణులు చెబుతున్నారు. రెటినోబ్లాస్టోమాగా వ్యవహరించే ఐ కేన్సర్‌ను స్మార్ట్‌ఫోన్‌ కెమెరా ఫ్లాష్‌ ద్వారా పసిగట్టవచ్చని చైల్డ్‌హుడ్‌ ఐ కేన్సర్‌ సెంటర్‌ పరిశోధకులు పేర్కొన్నారు. రెటీనాపై పడిన ఫ్లాష్‌ వల్ల కనుగుడ్డు తెల్లగా కనిపిస్తుందని, దీన్ని ఫొటోలో స్పష్టంగా గుర్తించవచ్చన్నారు.


   కంటి లోపల పెరిగే ఆర్‌బీ కేన్సర్‌ కణితి చూపుతో పాటు ప్రాణాలనూ హరిస్తుంది. అయితే దీన్ని తొలిదశలో గుర్తించడం కష్టమని చెప్పారు. స్మార్ట్‌ఫోన్‌ కెమెరా సాయంతో ఆర్‌బీని ప్రారంభ దశలో గుర్తించగలిగితే ఆ చిన్నారి ప్రాణాలను కాపాడవచ్చని వివరించారు.

Sunday 2 October 2016

కేన్సర్ అవేర్ నెస్ మంత్ అక్టోబర్

రొమ్ము కేన్సర్‌ను అడ్వాన్స్డ్‌ స్టేజీ వచ్చేంత వరకు గుర్తించడం లేదు. మన దేశంలో కేవలం 5 శాతం మంది మాత్రమే స్ర్కీనింగ్‌ చేయించుకుంటున్నారు. మిగతా వారిలో 65శాతం మహిళల్లో అడ్వాన్స్డ్‌ బ్రెస్ట్‌ కేన్సర్‌ బయట పడుతోంది.
ఈ లెక్కన మన దేశంలో ప్రతి వెయ్యి మందికి ఒక మహిళ బ్రెస్ట్‌ కేన్సర్‌తో బాధపడుతున్నారు. ఏటా 1.50 లక్షల మంది రొమ్ము కేన్సర్‌ బాధితులను గుర్తిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన బ్రెస్ట్‌ స్ర్కీనింగ్‌ క్యాంప్‌లను జాతీయ స్థాయిలో నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. 
     
        
చాలా మంది మహిళలు రొమ్ములో 5 సెంటీమీటర్ల వరకు కణతి పెరిగేంత జబ్బును గుర్తించలేకపోతున్నారని, అయితే 1.52 సెంటీర్లు ఉన్నప్పుడే గుర్తిస్తే తొలిదశలోనే కేన్సర్‌ను అరికట్టవచ్చునన్నారు. మహిళలు మోమెగ్రమీ పరీక్షలు చేయించుకోవడానికి ముందుకురావడం లేదని, దీనివల్లనే బ్రెస్ట్‌ కేన్సర్‌ను తొలిదశలో గుర్తించడం లేదన్నారు. అంతర్జాతీయ రొమ్ము కేన్సర్‌ అవగాహన పేరుతో కలర్‌తో చారిత్రక కట్టడాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు.

Tuesday 30 August 2016

కలుపు మందుతో కేన్సర్

గ్లైఫొసేట్.. ఇది అత్యంత ప్రభావశీలి అయిన కలుపు మందు. ప్రపంచంలో వాడుకలో ఉన్న కలుపునాశిని రసాయనాల్లోకెల్లా అగ్రగామి. దీన్ని వాడని దేశం లేదు. ఇది మన దేశంలోనూ విరివిగా వాడుతున్న కలుపు మందు కూడా. ఇది సురక్షితమైన కలుపు మందుగా పరిగణించబడినది. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని కేన్సర్ కారకంగా గుర్తించడంతో ప్రపంచవ్యాప్తంగా కలకలం మొదలైంది. నెదర్లాండ్స్ దీనిపై వెంటనే నిషేధం విధించింది. మరికొన్ని దేశాలు ఇదే బాటను అనుసరించే దిశగా పయనిస్తున్నాయంటున్నారు.


 వ్యవసాయంలో కూలీల కొరత ముంచుకొస్తున్నకొద్దీ గ్లైఫొసేట్ గడ్డి మందు వాడకం బాగా పెరిగింది. గ్లైఫొసేట్ అంతర్వాహక చర్య కలిగిన ప్రభావశీలమైన కలుపు నాశక రసాయనం. ఈ కలుపు మందు చెట్టు మీద పడిన వెంటనే మొక్కల శిఖర భాగాలకు.. అంటే నేలలోని పీచు వేళ్ల నుంచి, చిటారు కొమ్మల చిగుళ్ల దాకా చేరుతుంది. చెట్టుకు అత్యంత ఆవశ్యకమైన అమైనో ఆమ్లాల తయారీని అడ్డుకొని కొన్ని రోజులకు పూర్తిగా చంపేస్తుంది.

Monday 29 August 2016

ఆవునెయ్యితో కేన్సర్ దూరం

ఆవునెయ్యి అన్నిరకాలా మంచిదని మన పెద్దలు చెప్పే మాటల్లో నిజం ఉంది. నెయ్యిలో అనేక విటమిన్లు ఉంటాయి. అందుకే రోజువారీ భోజనంలో ఆవునెయ్యిని చేరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఆవునెయ్యిలో రోజూ తక్కువమోతాదులో ఉపయోగిస్తే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అరచేయి. అరికాలి మంటలు తగ్గుతాయి. ఆవునెయ్యి కేన్సర్ నిరోధకంగా కూడా పనిచేస్తుంది. బ్రెస్ట్ కేన్సర్, పేగు కేన్సర్ ను నివారిస్తుంది.
       


 ఆవునెయ్యి చిన్నపిల్లలకు మంచిది. పురుషుల్లో వీర్యం పెంచుతుంది. హృద్రోగులకు కూడా ఆవునెయ్యి వరం. రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలలో ఆవునెయ్యి వేసుకుని తాగితే.. అప్పటిదాకా ఉన్న అలసట పోయి.. ఉత్సాహాన్ని సంతరించుకుంటారు. ఆవునెయ్యి బరువును కూడా సమపాళ్లలో ఉంచుతుంది. బరువు తక్కువ ఉన్నవాళ్లు బరువు పెరగాలన్నా, ఊబకాయం తగ్గాలన్నా ఆవునెయ్యికి మించింది లేదు.
ఆవుపాలలో మిరియాల పొడి, పంచదార కలిపి తాగితే.. కంటి సమస్యలు తగ్గుతాయి. 

Sunday 28 August 2016

అల్సరా..? కేన్సరా..?

కడుపులో మంట అనగానే అల్సర్ అని చాలా మంది అనుకుంటారు. ఏవో తెలిసిన నాలుగు మాత్రలు వేసేసుకుంటారు. కానీ అది కేన్సర్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. నిర్లక్ష్యం చేస్తే వ్యాధి అడ్వాన్స్ స్టేజ్‌కు చేరుకుని చికిత్స అందించినా ఫలితం ఉండని పరిస్థితి ఏర్పడవచ్చు. అందుకే ఏ కాస్త ఆకలి తగ్గినా, అరుగుదల తగ్గినా, మంటగా ఉన్నా వైద్యులను సంప్రదించి తగిన వైద్యపరీక్షలు చేయించుకోవాలంటున్నారు సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. టి.ఎల్.వి.డి ప్రసాద్‌బాబు.


ఒక్కోసారి సాధారణ లక్షణాలను గుర్తించడంలో పొరపాటు చేస్తే అది బాగా ముదిరిపోయిన దశలో కేన్సర్‌గా బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా అన్నవాహిక, జీర్ణకోశం, పెద్దపేగుకు వచ్చే కేన్సర్లలో ఈ అవకాశం ఎక్కువ. ఇటీవలి కాలంలో ఈ కేన్సర్ల బారినపడే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. 60లో వచ్చే కేన్సర్ ఇప్పుడు 40లోనే కనిపిస్తోంది.

Friday 26 August 2016

బ్లూబెర్రీతో కేన్సర్ దూరం

బ్లూబెర్రీ చాలా రుచికరంగా ఉంటాయి, దీనితో పాటుగా బ్లూబెర్రీ వలన చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇది సాధారణంగా అమెరికా, యూరప్, కెనడా మరియు ఆసియాలో పెరుగుతాయి. బ్లూబెర్రీ పెరిగే పొదల ఆధారంగా 3 రకాలుగా అభివర్ణించారు. బ్లూబెర్రీ చర్మాన్ని మృదువుగా, శక్తిని మెదడు పెంచుతాయి మరియు కేన్సర్ వ్యాధిని కూడా తగ్గించి వేస్తాయి. బ్లూబెర్రీల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు అకాల వృద్దాప్యాన్ని అడ్డుకుంటాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెదడు పనితీరు స్థిరీకరిస్తాయి.



            బ్లూబెర్రీలకు నీలి రంగును ఆపాదించే ఆంతోసైనిన్ లు కేన్సర్ కారకపు ఫ్రీ రాడికల్ పై దాడి చేసి, ట్యూమర్ పెరుగుదలను నియంత్రిస్తాయని అర్బానా- కాంపైన్ లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ ఎట్ ఇల్లినాయిస్ పరిశోధకులు తెలిపారు. కాబట్టి కోలన్ కేన్సర్ లేదా ఇతర కేన్సర్ లను కలిగి ఉన్న వారు రోజు బ్లూబెర్రీలను తింటే కేన్సర్ కు దూరంగా ఉండొచ్చని చెబుతున్నారు. 

Thursday 25 August 2016

విశృంఖల శృంగారమే కేన్సర్ కు మందు

20 మంది మహిళలలతో పురుషుడు సెక్సులో పాల్గొంటే అతడికి ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే అవకాశం 28% మేర తగ్గిపోతుందట. ఈ అధ్యయనం కెనడాకు సంబంధించిన పరిశోధకులు చేసి, పలువురు పురుషులను పరిశీలించిన అనంతరం వెల్లడించినట్లు కేన్సర్ ఎపిడమాలజీ జర్నల్ తెలిపింది. దీనికి కారణం అంతమంది మహిళలతో సెక్సులో పాల్గొనేవారు ఎక్కువసార్లు వీర్యాన్ని స్ఖలిస్తారు కనుక వీర్యంలో ప్రొస్టేట్ కేన్సర్ కారక ఫ్లూయిడ్ బయటకు వచ్చేస్తుందని వారు తెలుసుకున్నారు.

       

అయితే కొన్ని దేశాల్లో ఇలా ఎక్కువమంది స్త్రీలతో సెక్స్ చేసే పరిస్థితి ఉండదనీ, అలాంటి దేశాల్లో మగవారు హస్త ప్రయోగం చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించగలుగుతారని చెపుతున్నారు. అధ్యయనంలో భాగంగా సెక్స్ పరీక్షల్లో పాల్గొన్న పురుషుల్లో ఎక్కువమంది స్త్రీలతో లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నవారిలో ప్రొస్టేట్ కేన్సర్ అవకాశాలు తక్కువగా కనబడగా భాగస్వామితో మాత్రమే సెక్స్ సంబంధాన్ని కలిగి ఉన్నవారిలో కొంతమందికి ఈ వ్యాధి లక్షణాలున్నట్లు తేలింది. ఐతే ఇది కొన్ని దేశాలకు మాత్రమే వర్తిస్తుందని పరిశోధకుల మాటలను బట్టి తెలుస్తుంది.

Wednesday 24 August 2016

లేజర్ తో కేన్సర్ ముప్పు

వెంట్రుకలను తొలగించే లేజర్‌ ట్రీట్‌మెంట్లు కేన్సర్‌కు దారి తీస్తాయంటున్నారు శాస్త్రవేత్తలు. లేజర్‌ ట్రీట్‌మెంట్‌ చేసేటప్పుడు విడుదలయ్యే పొగ వల్ల ఈ ప్రమాదం ఉంటుందట. రోజూ ఈ పొగను పీల్చేవాళ్లకయితే ప్రమాదం మరీ ఎక్కువట. వెంట్రుకలు కాలడం వల్ల వచ్చే పొగలో గాలిని కాలుష్యం చేసే రసాయనిక కారకాలున్నాయి. ఇవే కేన్సర్‌కు దారితీస్తాయని కాలిఫోర్నియా యూనివర్సిటీ సైంటిస్టులు చెబుతున్నారు. సరైన శిక్షణ లేని ప్రొఫెషనల్స్‌తో లేజర్‌ ట్రీట్‌మెంట్‌ చేయించడం వల్ల, కావలసిన పరికరాలు లేకపోవడం వల్ల చాలామంది పేషెంట్లు కేన్సర్‌ బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు. 
                  



 ఎయిర్‌ ఫిల్టరైజేషన్‌ సిస్టమ్‌, స్మోక్‌ ఎవాక్యుయేటర్‌లు ఉన్నచోట లేజర్‌ ట్రీట్‌మెంట్‌ను నిర్వహించాలని పరిశోధకులు చెబుతున్నారు. ఇద్దరు వలంటీర్ల నుంచి హెయిర్‌ శాంపిల్స్‌ను సేకరించి, వాటిని గాజు సీసాల్లో ఉంచి సీల్‌ చేశారు. తర్వాత ఆ వలంటీర్లకు లేజర్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. ఆ సమయంలో 30 సెకండ్ల ఫ్యూమ్‌ను సేకరించారు. దానిలో మొత్తం 377 రసాయన కారకాలు ఉన్నాయి. వాటిల్లో పర్యావరణానికి హాని కలిగించే కార్బన్‌ మోనాక్సైడ్‌లాంటి 20 రకాల టాక్సిన్స్‌ కూడా ఉన్నాయి. 13 రకాల కెమికల్స్‌లో కేన్సర్‌ కారకాలు ఉన్నాయని వెల్లడైంది.

Tuesday 23 August 2016

స్మార్ట్ ఫోన్ తో కేన్సర్ రాదు

స్మార్ట్‌ఫోన్ అతిగా వాడితే దాని రేడియేషన్ వల్ల చర్మ కేన్సర్ వస్తుందని ఇన్నాళ్లూ రకరకాల భయాలు ఉండేవి. కానీ, అలా భయపడక్కర్లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే.. సెల్‌ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల వేరే ఆరోగ్య సమస్యలు వస్తాయని, ముఖ్యంగా పిల్లలకు ఇది ముప్పేనని అంటున్నారు. మొబైల్ ఫోన్ వాడకంతో పాటు ఇతర రేడియో ఫ్రీక్వెన్సీ విద్యదయస్కాంత క్షేత్రాల వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కొంతకాలం క్రితం ప్రపంచ ఆరోగ్యసంస్థకు చెందిన అంతర్జాతీయ కేన్సర్ పరిశోధన సంస్థ చెప్పింది. అయితే దాన్ని నిర్ధారించడానికి పరిశోధన మాత్రం జరగలేదని తెలిపింది.
       


స్మార్ట్ ఫోన్లతో కేన్సర్ రాకపోయినా.. అతిగా వాడటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే మొబైల్స్ కు ఎడిక్టైన యూత్.. మానసిక సమస్యలతో బాథపడుతున్నారని హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్స్ క్వాలిటీని బట్టి కూడా రేడియేషన్ ఆధారపడి ఉంటుందని మరికొందరంటున్నారు. సాధారణ స్మార్ట్ ఫోన్స్ తో పోలిస్తే.. బ్రాండెడ్ మొబైల్స్ రేడియేషన్ ఎక్కువగా విడుదల చేయవని తెలుస్తోంది. 

Monday 22 August 2016

లివర్ కేన్సర్ కు పవర్ ఫుల్ వైద్యం



శరీరంలోని కీలక అవయవాల్లోకెల్లా అతి పెద్దది, అతి ముఖ్యమైనది కాలేయం. ఆ అవయవమే కేన్సర్ బారిన పడితే? ఒకప్పుడైతే ఇది కలవరపెట్టే విషయమే. కానీ, ఆధునిక వైద్య విధానాలు ప్రవేశించాక ఇప్పుడా సమస్య మునుపటిలా కలవరపెట్టే అంశం కాకుండా పోయింది. ప్రత్యేకించి సర్జరీలోనూ, కీమో, రేడియేషన్ థెరపీల్లో వచ్చిన ఆధునిక రీతులు కాలేయ సంబంధమైన కేన్సర్‌ను అధిగమించడం సులభతరం చేశాయి. కాకపోతే, లివర్ కేన్సర్ అనగానే డిప్రెషన్‌లోకి జారిపోకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, విధిగా వైద్య చికిత్సలు తీసుకుంటే లివర్ కేన్సర్ నుంచి సంపూర్ణంగా విముక్తి పొందడం సాధ్యమేనంటున్నారు కేన్సర్ వ్యాధి నిపుణులు
         

ఈ రోజుల్లో కేన్సర్ బారిన పడి మృత్యువు పాలైన వారిలో ఎక్కువ మంది వ్యాధిని ముందే గుర్తించి, వైద్య చికిత్సలకు వెళ్లడంలో నిర్లక్ష్యం చేసినవారే. కాకపోతే వైద్య చికిత్సలో ఎంతో నైపుణ్యం కూడా అవసరం అవుతుంది. ఎందువల్ల అంటే, లివర్ కేన్సర్లన్నీ ఒకే రకం కాదు. అందువల్ల వాటికి చేసే చికిత్సలు కూడా అన్నీ ఒకే రకంగా ఉండవు. కేన్సర్ రకాన్ని అనుసరించి, చికిత్సలు కూడా వేరువేరుగా ఉంటాయి. ప్రధానంగా లివర్‌లో వచ్చే కేన్సర్ కణుతులు ప్రైమరీస్, సెకండరీస్ అంటూ రెండు రకాలుగా ఉంటాయి. లివర్‌లోనే పుట్టిన కణుతులను ప్రైమరీ లివర్ ట్యూమర్స్ అనీ, మిగతా భాగాల్లో అంటే, శ్వాసకోశాల్లో గానీ, పెద్ద పేగుల్లో గానీ, క్లోమగ్రం«థిలో గానీ, కిడ్నీలో గానీ, ఎముకల్లోగానీ కణుతులు పుట్టి అవి కాలేయానికి పాకే రకాన్ని సెకండరీ లివర్ ట్యూమర్స్ అనీ అంటాం. నిజానికి ప్రైమరీ లివర్ ట్యూమర్ల కంటే, ఈ సెకండరీ లివర్ ట్యూమర్లే ఎక్కువగా వస్తాయి.

శృంగారమే దివ్యౌషధం

ప్రపంచంలో చాలామంది పురుషుల్ని పట్టి పీడిస్తున్న ప్రొస్టేట్ కేన్సర్ కు శృంగారమే పరమౌషధమని పరిశోధనలు చెబుతున్నాయి. రోజూ శృంగారంలో పాల్గొంటే ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువని తేలింది. నెలలో 21 రోజులు శృంగారంలో పాల్గొనే పురుషులకు.. ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే అవకాశం 23 శాతం తగ్గుతోందట. అయితే శృంగారంలో కేవలం జీవిత భాగస్వామికే పరిమితమవ్వాలని, విశృంఖల శృంగారం కొత్త సమస్యలకు దారితీస్తుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
       



రోజూ శృంగారంలో పాల్గొనడం కారణంగా ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్, టెస్టోస్టిరాన్ హార్మోన్స్ అధికంగా ఉత్పత్తి అవుతాయని. ఈ హార్మోన్లు కేన్సర్ ను నిరోధిస్తాయని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షా డెబ్భై వేల మంది కేన్సర్ తో బాథపడుతున్నారు. రోజూ వీర్యం బయటికి పోతుంటే.. శరీరంలో ఆరోగ్యకరమైన మార్పులు వస్తాయని అంటున్నారు. కాబట్టి ఇకపై శృంగారాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దని సైంటిస్టులు సూచిస్తున్నారు. 

Saturday 20 August 2016

కాఫీతో కేన్సర్ గ్యారెంటీ




పొద్దున లేవగానే కాఫీ తాగనిదే పూటగడవని పరిస్థితి.ఇది చాలామందికి అలవాటుగా మారింది.  మరీ వేడివేడి కాఫీ
తాగితే కేన్సర్ ఖాయమంటున్నారు పరిశోధకులు.  ఐరాసకు చెందిన అంతర్జాతీయ సంస్థ చేసిన పరిశోధనలో పలు కీలక విషయాలు వెల్లడించింది. కాఫీ వంటి పానీయాలతో అన్నవాహిక కేన్సర్ తలెత్తే  అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పరిశోదకులు తేల్చిచెప్పారు.



               65 డిగ్రీల ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ వేడి ఉన్న పదార్థాలను అన్నవాహిక ద్వారా తాగితే కొన్ని రకాల కేన్సర్ లకు దారితీస్తున్నట్టు ఇందులో వెల్లడైంది.

Friday 19 August 2016

కేన్సర్ గుర్తింపు చిటికెలో పని

పట్టుమని పదినిమిషాల్లో నోటి కేన్సర్‌ కణాలను గుర్తించే మైక్రోఫ్లూడిక్స్‌ పరికరాన్ని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. ఈ డివైజ్‌ డెంటిస్ట్‌లకు సులభతరంగా, వ్యయపరంగా కూడా అందుబాటులో ఉంటుందని వారంటున్నారు. సర్వికల్‌ కేన్సర్‌తో సహా ఇతర కేన్సర్‌లను పరీక్షించేందుకు కూడా ఈ డివైజ్‌ ఉపకరిస్తుంది. లాబ్‌లో పెరిగే కేన్సర్‌ కణాలపై ఇది సమర్ధవంతంగా పనిచేస్తోంది. నోటి కేన్సర్‌ రోగుల నుండి బయోప్సిస్‌పై ప్రస్తుతం దీన్ని పరీక్షిస్తున్నారు.
                   

 చాలా వరకూ ఓరల్‌ కేన్సర్‌లు ప్రాథమిక దశలో నొప్పి ఉండకపోవడంతో రోగులు, వైద్యులు వాటిని గుర్తించలేకపోతారని నేషనల్‌ కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆన్‌ డెఫ్‌నెస్‌ అండ్‌ అదర్‌ కమ్యూనికేషన్‌ డిజార్డర్స్‌లో హెడ్‌ అండ్‌ నెక్‌ సర్జరీ విభాగం అధిపతి కార్టర్‌ వాన్‌ వేస్‌ అంటున్నారు. ఈ ఏడాది 22,560 మందిలో ఓరల్‌ కేన్సర్‌ గుర్తించవచ్చని, 5000 మంది ఈ వ్యాధితో మరణించవచ్చని నేషనల్‌ కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ గుర్తించింది. అస్టిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌కు చెందిన కెమిస్ట్రీ ప్రొఫెసర్‌ జాన్‌ మెక్‌డెవిట్‌ ఈ పరికరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. 

Thursday 18 August 2016

పొగ తాగితే కేన్సర్ ఖాయం

పన్నెండు రకాల కేన్సర్లు.. లక్షా అరవై ఏడు వేల మరణాలు.. కారణం మాత్రం ఒక్కటే. పొగత్రాగడం వల్ల కలిగే దుష్పరిణామాలే ఇవన్నీ.. అమెరికాలో ఏటా కేన్సర్‌తో మరణిస్తున్న వారిలో దాదాపు సగంమంది ఊపిరితిత్తులు, శ్వాసనాళం, స్వరపేటికకు సంబంధించిన కేన్సర్లతోనే పోతున్నారని ఇటీవలి అధ్యయనంలో తేలింది. వీటిలో చాలా మరణాలు కొని తెచ్చుకున్నవేనని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.  అట్లాంటాలోని అమెరికన్‌ కేన్సర్‌ సొసైటీ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. సిగరెట్‌ పొగ వల్ల 12 రకాల కేన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. ఇందులో ఊపిరితిత్తుల కేన్సర్‌ మొదటిది, ముఖ్యమైందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.



             ఏడాదిలో అమెరికా వ్యాప్తంగా పలు రకాల కేన్సర్లతో మరణించిన వారి సంఖ్య 3.5 లక్షలు కాగా అందులో 1.67 లక్షల మరణాలకు సిగరెట్‌ పొగే కారణమని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన రెబెక్కా సీగల్‌ వివరించారు. ఈ గణాంకాలు కేవలం పొగరాయుళ్లవేనని, వారు వదిలే పొగతో కేన్సర్‌ బారిన పడ్డ వారిని లెక్కలోకి తీసుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో పొగాకు వాడకంపై చైతన్యం తీసుకొచ్చే దిశగా ఎంతో చేయాల్సి ఉందని తెలిపారు.

Wednesday 17 August 2016

బ్రెడ్డు తింటే కేన్సర్ బోనస్

ఆరోగ్యం బాగోలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు బ్రెడ్డు తినమని డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తుంటారు. కానీ భారత ఆరోగ్య శాఖ నివేదిక చదివితే మాత్రం బ్రెడ్డు తిన్నా కేన్సర్ వస్తుందని తెలిసి జనం అవాక్కవుతున్నారు. ఎక్కడో మారుమూల పల్లెల సంగతి దేవుడెరుగు.. ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముఖ కంపెనీలు యథేచ్ఛగా కేన్సర్ కారక పదార్థాలతో బ్రెడ్ తయారుచేసి విక్రయిస్తున్నాయి. బ్రిటానియా, కేఎఫ్ సీ, మెక్ డొనాల్డ్స్, డొమినోస్, పిజ్జా హట్ లాంచి రెస్టారెంట్లో ప్యాక్ చేసిన బ్రెడ్లో పొటాషియం బ్రోమైడ్, పొటాషియం అయొడైడ్ అవశేషాలున్నాయి.
             


ఆరోగ్య శాఖ పరీక్షించిన శాంపిల్స్ లో 84 శాతం కేన్సర్ కారక పదార్థాలున్నట్లు తేలింది. ఇవి తింటే కేన్సర్ కొని తెచ్చుకున్నట్లేనని అధికారులు ప్రకటించారు. అయితే బ్రాండెడ్ కంపెనీలు మాత్రం తాము నిషేధిత పదార్థాలు వాడటం లేదని చెవిలో పువ్వులు పెడుతున్నాయి. కానీ తమ ల్యాబుల్లో కాకుండా బయట ల్యాబుల్లో కూడా పరీక్షించాకే ఈ నివేదిక విడుదల చేసినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటికే ప్యాకేజ్డ్ బ్రెడ్ ను విదేశాల్లో నిషేధించారని, మన దేశంలో మాత్రం యథేచ్ఛగా అమ్ముతున్నారని తెలుస్తోంది. కాబట్టి.. బ్రెడ్డు తినేముందు పారాహుషార్. 

Tuesday 16 August 2016

వాయుకాలుష్యంతో కేన్సర్ ముప్పు

వాయు కాలుష్యంతో కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ  హెచ్చరించింది.  ఈ ముప్పు ఆగ్నేయ ఆసియా దేశాల్లో అధికంగా ఉందని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా టాప్ 20 కాలుష్య నగరాల్లో ఆగ్నేయాసియాలో 14 ఉన్నాయి. ప్రపంచంలో ఏటా 8.2 మిలియన్ల మంది ఈ వ్యాధితో మరణిస్తున్నాని, వీటిల్లో మూడింట రెండో వంతు మరణాలు మధ్య, దిగువ మధ్య తరగతి వర్గాల్లోనే ఉన్నాయంది. మరణాల్లో 22 శాతం పొగాకు, దాని ఉత్పత్తులు వాడకంతో సంభవిస్తున్నాయని పేర్కొంది. డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయ ఆసియా రీజియన్‌లో భారత్‌తో పాటు బంగ్లాదేశ్, భూటాన్, డీపీఆర్ కొరియా, ఇండోనేసియా, మాల్దీవ్స్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్ ఉన్నాయి.



ఈ ప్రాంతంలోని పరిశ్రమల్లో కార్మికులకు సూర్య కిరణాలు, కేన్సర్ కారక రసాయనాల నుంచి  రక్షణ లేదు. మద్యపానం, అనారోగ్యకర ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం వంటివి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఆటంకాలుగా మారాయి. పొగాకు, మద్యం వాడకం తగ్గించే దిశగా, పర్యావరణ పరిస్థితుల నుంచి కార్మికులకు రక్షణ కల్పించేలా కఠిన చట్టాలు తేవాలని డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయ ఆసియా డెరైక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ చెప్పారు. ప్రపంచ కేన్సర్ దినం సందర్భంగా ఆమె ఈ వివరాలు వెల్లడించారు. అలాగే హెచ్ పీవీ, హెపటైటిస్ బి, సీ, హెలికోబక్టర్ పైలోరి వల్ల వచ్చే   వ్యాధులు కేన్సర్‌కు కారణాలుగా ఉన్నాయన్నారు.

Monday 15 August 2016

బాల్యంలో పండ్లు తింటే కేన్సర్ దూరం




బాల్యంలో పండ్లు ఎక్కువగా తింటే రొమ్ముకేన్సర్‌ బారిన పడే ముప్పు తక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. ఆల్కహాల్‌ను ఎక్కువగా తీసుకుంటే ఈ కేన్సర్‌ మరింత అధికమయ్యే ముప్పుదని, అమెరికాలోని టిహెచ్‌ చాన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. 90వేల మంది నర్సులను 20ఏళ్ల పాటు పరిశీలించారు. చిన్నతనంలో వాళ్ల ఆహారపు ఆలవాట్లు, పండ్లు అధికంగా తీసుకున్నారో లేదా వివరాలను సేకరించారు. చిన్నతనంలో ఎక్కువగా పండ్లు తీసుకున్న వారిలో రొమ్ముకేన్సర్‌ ముప్పు 25శాతం తక్కువగా ఉందని తెలిపారు.
                   



డాక్టర్లు సూచించే సమతులాహారంలో పండ్లు కూడా భాగంగా ఉంటాయి. చిన్నప్పుడే పండ్లు తినడం అలవాటైతే.. శరీరంలో రోగనిరోదశక శక్తి పెరిగి కేన్సర్ తో పాటు మరే వ్యాధులు త్వరగా దరిచేరవని సైంటిస్టులు ఎప్పట్నుంచో చెబుతున్నారు. పోషకాహారం, బలవర్థకమైన ఆహారం, సమతులాహారం, సంతులిత ఆహారం.. ఇలా పేరేదైనా ఆ ఆహారంలో పండ్లు మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే. వెజ్ అయినా,. నాన్ వెజ్ అయినా పండ్లు తినకుండా వాటిలో దొరికే పోషకాలను మరో పదార్థాన్ని తినడం ద్వారా పొందలేమని పరిశోధనలు చెబుతున్నాయి. 

Sunday 14 August 2016

వక్కపొడితో కేన్సర్ డేంజర్



వివాహాలు, శుభకార్యాలప్పుడు వక్కపొడి ఇవ్వడం మనకు తెలుసు. కానీ ఆ వక్కపొడి కేన్సర్ కు కారకంగా మారుతుందని తాజా పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ఆ ఒక్కటే కాదు అనేక రకాల వ్యాధులకు కారణమవుతున్నాయట. పాన్‌లో ఉప‌యోగించే త‌మ‌ల‌పాకు, యాల‌కులు, దాల్చిన చెక్క వరకు సరే. మిగ‌తా ప‌దార్థాల‌న్నీ ప్రాణాంత‌క క్యాన్స‌ర్‌ల‌ను కలుగజేస్తున్నాయని ది ఇంట‌ర్నేష‌న‌ల్ ఏజెన్సీ ఫ‌ర్ రీసెర్చ్ సంస్థ‌  ప‌రిశోధ‌కులు తేల్చారు. ఈ విష‌యాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా ధృవీక‌రించారు. కేన్సర్ లను క‌లిగించే ప‌దార్థాల‌న్నింటిలో వ‌క్క ప‌లుకులు ప్ర‌థ‌మ స్థానంలో ఉందని చెబుతున్నారు వాళ్లు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వ‌క్క‌పొడి తిన‌డం వ‌ల్ల కేన్సర్ వచ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయని చెప్పింది.



అదే పనిగా వక్క నమలం వల్ల నోరు, అన్న వాహిక‌ల‌కు చెందిన క్యాన్స‌ర్లు వ‌స్తాయ‌ని తేలింది. వ‌క్క‌పొడి ఎక్కువ‌గా తింటే స‌బ్ మ్యూక‌స్ ఫైబ్రోసిస్ అధికంగా ఉత్ప‌త్తి చెందుతుంది. అది ద‌వ‌డ క‌ద‌లిక‌ల్లో అంత‌రాయం కలిగిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ద‌వ‌డ‌లు పూర్తిగా బిగుసుకుపోయి ఏమీ తిన‌డానికి, తాగ‌డానికి వీలు పడదట. నోటికి రంధ్రాలు ప‌డి తిన్న‌దంతా బ‌య‌టికి వ‌స్తుంద‌ని చెబుతున్నారు. అలాంటి ప్ర‌మాద‌క‌ర నోటి క్యాన్స‌ర్ వ‌చ్చేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. వ‌క్క ప‌లుకులను ఎక్కువ‌గా తింటే దంతాలు, చిగుళ్లు రంగు మారుతాయి. వాటికి అల్స‌ర్లు వ‌స్తాయి. వ‌క్క ప‌లుకుల‌ను తినే స‌మ‌యంలో జీర్ణాశ‌యంలోకి అది వెళితే స‌మస్య‌లు వస్తాయి. గుండె జ‌బ్బులు వ‌చ్చే వీలు ఉందని వారు చెబుతున్నారు. 

Saturday 13 August 2016

బ్రెడ్ తో కేన్సర్ ఖాయం



పిజ్జాలో బ్రెడ్‌... బర్గర్‌లో బ్రెడ్‌.... చాయ్‌లోకి బన్ను... బట్టర్‌, జామ్‌ రాసిన బ్రెడ్‌ ముక్కలు... జ్వరమొస్తే ఆహారంగా బ్రెడ్‌. ఇంకా... శాండ్‌విచ్‌లు, పావ్‌భాజీ, టోస్టులతోపాటు రకరకాల రూపాల్లో బ్రెడ్‌ను మింగేస్తున్నాం. మొత్తానికి బ్రెడ్‌తో మనిషికి అవినాభావ ఆహారబంధం. అయితే... ఇదే బ్రెడ్డులు, బన్నులలో కేన్సర్‌ కారక రసాయనాలున్నాయని తేలింది. ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఈ సంగతి తేల్చింది. బ్రెడ్డు తయారీలో పొటాషియం బ్రోమేట్‌, పొటాషియం అయోడేట్‌ ఉపయోగిస్తారు. కేన్సర్‌ కారక రసాయనాల జాబితాలో పొటాషియం బ్రోమేట్‌కూడా ఒకటి. ఇక పొటాషియం అయేడేట్‌వల్ల శరీరంలో అయోడిన్‌ స్థాయి పెరిగి థైరాయిడ్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతిమంగా... థైరాయిడ్‌ కేన్సర్‌ రావొచ్చు. ప్రము ఖ కంపెనీలుసహా మార్కెట్‌లోగల బ్రెడ్‌లు, బన్నులపై సీఎ్‌సఈ పరీక్షలు చేసింది. బేకరీల నుంచి సేకరించిన 84 శాతం శాంపిల్స్‌లో బ్రోమేట్‌, అయోడేట్‌ అవశేషాలున్నట్లు తెలిపింది.





                             పొడి లేదా గుళికల రూపంలో ఉండే పొటాషియం బ్రోమేట్‌కు రంగు, రుచి, వాసన ఉండవు. దీన్ని పులియబెట్టే ఉత్ప్రేరకంగా వాడతారు. దీనివల్ల కేన్సర్‌ ముప్పుందని అంతర్జాతీయ కేన్సర్‌ పరిశోధన సంస్థ నిర్ధారించింది. ఈ రసాయనాన్ని కేటగిరీ-2బీలో చేర్చింది. దీనివల్ల కడుపునొప్పి, డయేరియా, తల తిరగడం, వాంతులు, కిడ్నీ వైఫల్యం, చెవుడు, బీపీ, డిప్రెషన్‌వంటి సమస్యలూ తలెత్తుతా యని వివిధ పరిశోధనల్లో తేలింది. ఈ రసాయనాన్ని ఆహార పదార్థాల తయారీలో వినియోగించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఎఫ్‌ఏవోల సంయుక్త నిపుణుల కమిటీ ఎప్పుడో స్పష్టం చేశాయి. బ్రోమేట్‌ను అనేక దేశాల్లో నిషేధించారు. పొరుగునే ఉన్న శ్రీలంక, చైనాల్లోనూ నిషేధం ఉంది.

సాఫ్ట్ డ్రింక్స్ తో ప్రోస్టేట్ కేన్సర్



సాఫ్ట్‌ డ్రింక్స్‌ ఎక్కువుగా తాగే పురుషుకు ప్రొస్టేట్‌ కేన్సర్‌ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయట. స్వీడన్‌కు చెందిన శాస్తవ్రేత్తల నూతన పరిశోధనలో ఈ విషయం వెల్లడెైంది. ఈ అంశంపెై పదిహేనేళ్ల పాటు సుదీర్ఘ అధ్యయనం చేశారు. ఒక రోజుకు సుమారు 300 ఎంఎల్‌ సాఫ్ట్‌డ్రింక్‌ను తాగే పురుషులకు ఈ వ్యాధి వచ్చే అవకాశాలు 40 శాతం వరకు ఉన్నాయి. సాఫ్ట్‌ డ్రింక్‌ తాగని వారితో పోల్చి చూసినపుడు ఈ ఫలితాలు వచ్చాయి. రక్తపరీక్షల ద్వారా మాత్రమే ప్రొస్టేట్‌ కేన్సర్‌ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అవుతుందని డెయిలీ మెయిల్‌లో పేర్కొన్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇన్సులిన్‌ హార్మోన్‌ విడుదలకు షుగర్‌ కారణమవుతుంది. ఈ అధ్యయనానికి సంబంధించిన అం శాలను అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ న్యూట్రిషన్‌లో ప్రచురించారు.



గత అధ్యయనంలో కూడా పలు అంశాలు వెల్లడయ్యాయి. సాఫ్ట్‌ డ్రింక్‌ మోతాదుకు మించి తాగే పురుషలలో గుండెనొప్పులు, మధుమేహం, ఒబెసిటీ, పెళుసుగా ఉండే ఎముకలు, పాంక్రియాటిక్‌ కేన్సర్‌, కండరాల బలహీనత, పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ. 45-73 సంవత్సరాల వయస్సు గల 8,000 మంది పురుషులపెై పదిహేనేళ్లపాటు శాస్తవ్రేత్తలు అధ్యయనం చేశారు. రెైస్‌, పాస్తా, కేక్‌లు, బిస్కెట్లు, తియ్యగా ఉండే తృణధాన్యాల అల్పాహారం తీసుకుంటే ప్రొస్టేట్‌ కేన్సర్‌ వ్యాధి తీవ్రత తగ్గేందుకు తోడ్పడతాయి. 

Thursday 11 August 2016

పోషకాహారంతో కేన్సర్ దూరం



పోషకాల సహాయంతో కేన్సర్ వ్యాధిని తగ్గించాలనుకుంటున్నారా? అయితే వీటితో పాటుగా మందుల సహాయం కూడా అవసరమే, ఎందుకంటే కేన్సర్ ఆరోగ్యకర కణాలకు సోకకుండా ఉండాలంటే మందుల సహాయం తప్పక అవసరం. పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు మరియు మందులు కలిస్తే కేన్సర్ వ్యాధికి వ్యతిరేకంగా పోరాడే అద్భుతమైన ఆయుధమని చెప్పవచ్చు. వీటి వలన పూర్తి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.



            తినే ఆహారాన్ని సరైన పద్దతిలో వండుకోవాలి. శరీరంలో అనారోగ్యాలను కలిగించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా జంక్ ఫుడ్ కు వీలైనంత దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్ మాత్రమే కాకుండా, ఇంట్లోనే వండే నూనె, చక్కెర, అనారోగ్యకర కొవ్వు కలిగి ఉండే ఆహారాలకు ,శరీరానికి కావలసిన మినరల్ మరియు విటమిన్ లు లేని ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. కూరగాయలు, పండ్లు మరియు ఫైబర్ ఇతర ఆహార పదార్థాలు కేన్సర్ వ్యాధి పెరుగుదలకు వ్యతిరేఖంగా పోరాడటమే కాకుండా, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

లంగ్ కేన్సర్ కు క్యూబా మందు

అమెరికా పక్కనే ఉండే చిన్న ద్వీపం క్యూబా. పంచదార ఎక్కువగా పండించే ఈ దేశం లంగ్ కేన్సర్ రోగులకు ఒక తీపి వార్తను వినిపించింది. క్యూబా రాజధాని హవానాలో ఉన్న సెంట్రో దీ ఇమ్యునలోజియా మాలిక్యూల్ అనే పరిశోధనా కేంద్రంలో పనిచేసే శాస్త్రవేత్తలు ప్రపంచ వ్యాప్తంగా చాలా మందిని పట్టి పీడిస్తున్న లంగ్ కేన్సర్ భూతానికి వేక్సిన్ ను కనుగొన్నారు. దీనితో ఈ పరిశోధనా కేంద్రం పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టుల దృష్టి పడింది. సిం అవాక్స్ పేరుతో పిలిచే ఈ వేక్సిన్ ను ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 5 వేల మందిమీద ప్రయోగించి సంతృప్తికర ఫలితాలు సాధించారట. 

 
ఈ వేక్సిన్ తీసుకున్న కేన్సర్ రోగుల జీవిత కాలం తీసుకొని వారికంటే సగటున 11 నెలలు ఎక్కువగా ఉందని సమాచారం. ఈ వేక్సిన్ తీసుకున్న ఆల్బర్ట్ సాన్చేజ్ అనే 77 ఏళ్ల వృద్ధుడు మాత్రం 2002 లోనే లంగ్ కేన్సర్ బారిన పడినా ఇప్పటికీ జీవించే ఉన్నాడు. వేక్సిన్ తో పాటు తనకున్న మనోధైర్యమే అతని జీవిత కాలం పెరగటానికి కారనామని ఆ సైంటిస్టులు అన్నారు. ఈ వేక్సిన్ ఇతర కేన్సర్ ఔషదాలలాగా కేన్సర్ కణాలను నేరుగా చంపివేయదని, శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచి అది కేన్సర్ కణాలను చంపేలా చేస్తుందని అంటున్నారు. క్యూబాలోని ఈ పరిశోధనా కేంద్రం ఇప్పటివరకు 21 ప్రాణాంతక రోగాలకు వేక్సిన్లను కనుగొన్నది.

Tuesday 9 August 2016

శ్వాసతో లంగ్ కేన్సర్ గుర్తింపు



ప్రాణాంతక ఊపిరితిత్తుల కేన్సర్‌ను మొదటిదశలోనే పసిగట్టేందుకు సరికొత్త పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. లంగ్‌ కేన్సర్‌ ఇండికేటర్‌ డిటెక్షన్‌, లూసిడ్  గా వ్యవహరిస్తున్న ఈ పరికరం.. శ్వాసను పరీక్షించడం ద్వారా ఊపిరితిత్తుల కేన్సర్‌ జాడలను ఇట్టే పసిగడుతుందని అన్నారు. కేంబ్రిడ్జికి చెందిన ఓవల్‌స్టోన్‌ నానోటెక్‌ లిమిటెడ్‌ కంపెనీ ఈ పరికరాన్ని అభివృద్ధి చేసింది. లంగ్‌ కేన్సర్‌ సోకిన తర్వాత బాధితుల జీవితకాలం ఐదేళ్లకు పడిపోతుంది.
                         



లంగ్ కేన్సర్ ను ముందుగా గుర్తించడం వల్ల బాధితులను రక్షించేందుకు అవకాశం లభిస్తుందని ఓవల్‌స్టోన్‌ సహ వ్యవస్థాపకుడు బిల్లీ బోయలే తెలిపారు. ప్రస్తుతం తుది పరిశీలన దశలో ఉన్న లుసిడ్‌ను ఏడాదిలో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ పరికరంతో లంగ్‌ కేన్సర్‌ను ఖచ్చితంగా నిర్ధారించవచ్చని వివరించారు.

Monday 8 August 2016

ఫ్రూట్స్ తో లంగ్ కేన్సర్ దూరం





పొగతాగే అలవాటు ఉన్న వారు లంగ్‌ క్యాన్సర్‌ ముప్పును తగ్గించుకోవాలంటే.. ప్రతిరోజూ ఎనిమిది రకాల ఫ్రూట్స్‌ తీసుకోవాలి. ప్రతిరోజూ రకరకాల ఫ్రూట్స్‌ తీసుకుంటే లంగ్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు 23 శాతం మేర తగ్గుతాయి. ఈ విషయం ఇటీవల జరిపిన ఓ పరిశోధనలో వెల్లడయింది. రోజూ ఐదు రకాల పళ్లు, కూరగాయలు తీసుకుంటే రూన్సర్‌ రాకుండా నివారించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్న సంగతి తెలిసిందే.



               యూరప్ లోని ఒక సంస్థ పలు దేశాలలో లంగ్‌ క్యాన్సర్‌పై పరిశోధనలు నిర్వహించింది. ఇందులో ఎక్కువ ఫ్రూట్స్‌ తీసుకోవడమే కాకుండా, రకరకాల కూరగాయలు తీసుకునే వారిలో కూడా లంగ్‌ క్యాన్సర్‌ రిస్క్‌ చాలా వరకు తక్కువగా ఉందని వెల్లడయింది. పొగతాగే అలవాటు మానుకోలేకపోతే ఫ్రూట్స్‌నైనా ఎక్కువగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు క్యూబాలో లంగ్ కేన్సర్ కు కొత్త వ్యాక్సిన్ కనిపెట్టారు. అయితే ఇదింకా పరిశోధన దశనలోనే ఉందని, త్వరలోనే ఫలితాలు వెల్లడలిస్తామని సైంటిస్టులు చెబుతున్నారు.