Monday 7 August 2017

బ్లడ్ కేన్సర్ కు కొత్త మందు

లడ్ కేన్సర్ బాధితులకు గుడ్ న్యూస్. వ్యాధితో బాధ పడుతున్న వారికి మెరుగైన చికిత్సను అందించేందుకు ఓ కొత్త మెడిసిన్ ను సైంటిస్టులు తయారు చేశారు. ఈ మందును విడిగా వాడినా.. కిమోథెరపీతో పాటు అందించినా మంచి ప్రభావం చూపిస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్ లో స్పష్టమైంది. ఈ డ్రగ్ ను అభివృద్ధి చేసిన టీంకు భారత సంతతి పరిశోధకురాలు,యూనివర్శిటీ ఆఫ్ యూటా పోస్ట్ డాక్టొరల్ శ్రీవిద్య భాస్కర  నేతృత్వం వహించారు. అక్యూట్ లింపోబ్లాస్టిక్ లుకేమియా(ALL) గా వ్యవహరించే బ్లడ్ కేన్సర్ చిన్నా పెద్దా తేడాలేకుండా అందరిపైనా దాడిచేస్తుంది.











దీని బాధితుల్లోని 30% మందిలో ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. క్రోమోజోమ్ లోని రెండు విభాగాలు వాటి స్వభావానికి భిన్నంగా అతుక్కుపోతే దాన్ని ఫిలడెల్పియా క్రోమోజోమ్ గా వ్యవహరిస్తారు. కొత్తగా ఏర్పడిన ఈ క్రోమోజోమ్ DNA ను మరమ్మతు చేయడం ప్రారంభిస్తుంది. DNA  రిపేర్ అంటే వినడానికి ఏదేదో మంచి విషయంలాగానే అనిపించవచ్చు. కానీఈ క్రమోజోమో చే మరమ్మతు ఫలితం చెడుకే దారి తీస్తుంది. ఆ ప్రక్రియ వ్యసనంగా మారి నిరంతరం కొనసాతుంది. ఈ ప ర్రక్రియ కోసం ఆక్రోమోజోమ్ వినియోగించే రకరకాల ప్రోటీన్లను అడ్డుకోడానికి పలు రకాల మందలను వాడాలి. అలా వాడితే అవి విషపూరితంగా మారి సాధారణ కణాలపై దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అందుకే ఈ వ్యసనాన్ని నిరోధించేందుకు విస్తృతంగా ప్రయోగాలు చేసి హిస్టోన్ డియాసిటైలసిస్ అనే రెండు ప్రొటీన్లపై ప్రధానంగా దృష్టి సారించి సరికొత్త మెడిసిన్ ను ఆవిష్కరించినట్లు పరిశోధకులు తెలిపారు.

Sunday 6 August 2017

కేన్సర్ కు పసుపుతో చెక్

పసుపులో ఔషధ గుణాలున్నాయని మన పూర్వీకులు ఏనాడో చెప్పారు. ఇప్పుడు దీనికున్న మరో అద్భుతమైన గుణాన్ని శాస్త్రవేత్తలు పరిశోధించి కనుగొన్నారు. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసే పసుపు కేన్సర్‌ నిరోధించడానికీ సాయపడుతుందని అమెరికా శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. ఈ బృందంలో భారత సంతతి శాస్త్రవేత్త కూడా ఉండడం విశేషం. పసుపులో ఉండే కర్కమిన్‌ సాయంతో పసికందులలో వచ్చే కేన్సర్‌ను సమర్థమంతంగా నిరోధించవచ్చట.



కాగా, పదేళ్లలోపు చిన్నారులకు ఈ కేన్సర్‌ ముప్పు ఎక్కువ. ఇందులో కణుతులు మందులకు లొంగవని నిపుణులు చెబుతున్నారు. ఈ తరహా మొండి కణుతులే లక్ష్యంగా సూక్ష్మ అణువులను పంపించేందుకు కర్కమిన్‌ తోడ్పడుతుందన్నారు. కణితిని అణిచివేసే సూక్ష్మ అణువులను కర్కమిన్‌కు జతచేసి నేరుగా లక్ష్యానికి చేర్చవచ్చన్నారు. ఇలా ఓ ప్రత్యేక పద్ధతిలో దాడి చేసి కేన్సర్‌ను నియంత్రించవచ్చని చెప్పారు. ఈ విషయంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.

ఏపీలో కేన్సర్ చికిత్స

జిల్లాకు ఒక యూనిట్‌, ప్రాంతానికి ఒక సూపర్‌ స్పెషాలిటీ, ఉన్న దగ్గర ఉన్నతంగా మెరుగులు.. ఏపీ అంతా కేన్సర్‌ వైద్య అవకాశాలను పెద్దఎత్తున పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. రాష్ట్రంలో కేన్సర్‌ వైద్య చికిత్సకు అవకాశాలు తక్కువ. ఉన్నదగ్గర కూడా, ప్రాథమికస్థాయిలోని కేసులకే వైద్యం అందించే వీలుంది.  విజయవాడలో ఈరోజుకీ ఒక్క కేన్సర్‌ సెంటర్‌ కూడా లేదు. విశాఖ, గుంటూరులలో స్టేజ్‌-1 కేసులను చూడగలుగుతున్నారు. దీంతో, అయితే హైదరాబాద్‌ లేదంటే చెన్నై, బెంగళూరుకు రోగులు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపధ్యంలో వారికి వారు ఉన్నదగ్గరే పూర్తిస్థాయిలో పరీక్షలు, చికిత్సను అందుబాటులోకి తీసుకురావడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా.. 13 జిల్లాల్లోనూ జిల్లాకు ఒక చొప్పున కేన్సర్‌ యూనిట్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.



విశాఖ కేజీహెచ్‌లో ఆంకాలజీ విభాగంలో రేడియేషన్‌ థెరపీతో కేన్సర్‌ రోగులకు వైద్యం చేస్తున్నారు. సాధారణ స్టేజ్‌లో ఉన్న రోగులకు మాత్రమే ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. ఈ విభాగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం గత ఏడాది పక్కా ప్రణాళిక రూపొంచింది. కర్నూలు జిల్లాలో రూ.120 కోట్ల నిధులతో స్టేట్‌ కేన్సర్‌ సెంటర్‌ ఏర్పాటు కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించే ఈ ఆసుపత్రి.. రిఫరల్‌ సేవలు అందిస్తుంది. రాష్ట్రంలోని అన్ని కేన్సర్‌ ఆసుపత్రులు, ఓపీ బ్లాక్‌ల నుంచి చివరి దశ రోగులను ఇక్కడకు తరలిస్తారు. ఇక..నెల్లూరు జిల్లాలో రూ. 40కోట్లతో థెర్సికేర్‌ కేన్సర్‌ సెంటర్‌ ఏర్పాటు కాబోతుంది. తిరుపతి స్విమ్స్‌లో ఆంకాలజీ విభాగం అద్భుతంగా కొనసాగుతోంది. విజయవాడ, గుంటూరు బోధనాసుపత్రుల్లో ప్రత్యేకంగా సూపర్‌ స్పెషాలిటీ విభాగాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమయింది.

Saturday 5 August 2017

బ్రెడ్డుతో కేన్సర్ ఖాయమా..?

సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ (సీఎస్ఈ) అనేది విశ్వసనీయ సంస్థ. ఈ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో బ్రెడ్, బర్గర్, పిజ్జాలలో పొటాషియం బ్రోమేట్, పొటాషియం అయోడేట్ ఉన్నట్టు తెలిసింది. మార్కెట్లో ఉన్న 38 ప్రముఖ బ్రాండ్ల బ్రెడ్లు, బన్ లు, బర్గర్, పిజ్జాల శాంపిల్స్ ను సేకరించి తన పరిధిలోని ల్యాబ్ లోను, మూడో పక్షానికి చెందిన ల్యాబ్ లలోను పరీక్షింపజేసింది. వీటిలో 84 శాతం శాంపిల్స్ లలో ఈ ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని సీఎస్ఈ వెల్లడించింది.






దేశీయ తయారీదారులు బ్రెడ్ తయారీలో ఈ రసాయనాలను వినియోగిస్తున్నట్టు తెలిపింది. పొటాషియం బ్రోమేట్ కేటగిరీ 2బి కార్సినోజెన్... అంటే ఇది కేన్సర్ కు దారితీయగలదు. థైరాయిడ్ కేన్సర్, మూత్రపిండాలు, ఉదర సంబంధ కేన్సర్లకు కూడా కారణమవుతుంది. పొటాషియం అయోడేట్ రసాయనం థైరాయిడ్ సమస్యకు దారితీస్తుంది. వీటితో ఆరోగ్యానికి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకున్న సీఎస్ఈ తక్షణమే వీటిని నిషేధించాలని దేశీయ ఆహార భద్రత, ప్రమాణాల సంస్థను కోరింది.

Friday 4 August 2017

బోన్ కేన్సర్ వ్యాధి విద్యార్థి సీబీఎస్ఈ పరీక్షల్లో టాపర్

అతడి పట్టుదల ముందు భయంకరమైన కేన్సర్ వ్యాధి తలవంచింది ప్రాణాంతకమైన కేన్సర్‌తో పోరాటం చేస్తూ ఓ పందొమ్మిదేళ్ల విద్యార్థి ప్లస్‌ 2లో 95 శాతం మార్కులు సాధించాడు. ఇటీవలే ప్రకటించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ ప్లస్ 2 ఫలితాల్లో రాంచీకి చెందిన తుషార్ రిషి 95 శాతం మార్కులు సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కేన్సర్ వ్యాధికి చికిత్స కోసం న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌‌కు వెళ్తూ ఎలాంటి శిక్షణ లేకుండానే ఇంగ్లిష్‌లో 95, ఫిజిక్స్‌లో 95, మ్యాథ్‌మెటిక్స్‌లో 93, కంప్యూటర్స్‌లో 89, ఫైన్ఆర్ట్స్‌లో 100 మార్కులు సాధించాడు.








2014లో కేన్సర్ బారిన పడిన తుషార్ రిషి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాయలేకపోయాడు. పరీక్షలకు ముందే బోన్ కేన్సర్ సోకినట్లు నిర్ధరణ కావడంతో 11 నెలల పాటు కిమోథెరపీ చేయించుకున్నాడు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న తుషార్ 2015లో పదో తరగతి పరీక్షలకు హాజరై 10కి పది పాయింట్లు సాధించాడు. సైన్స్ విద్యార్థి అయిన రిషి ఇంజినీరింగ్ కోర్సు కాకుండా ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లిష్ లేదా ఎకనమిక్స్‌ డిగ్రీ చేస్తానని పేర్కొన్నాడు.

Thursday 3 August 2017

పెద్దపేగుకు క్యాన్సర్ వస్తే..

పెద్దపేగు, మలద్వారాలకు వచ్చే కేన్సర్‌ను కోలోరెక్టల్, కోలన్ కేన్సర్ అని అంటారు. ఈ వ్యాధిలో పెద్దపేగు, మలద్వారం, అపెండిక్స్ భాగాల్లో కేన్సర్ కంతులు ఏర్పడి క్రమంగా పెరుగుతూ వుంటాయి. కేన్సర్ వ్యాధుల్లో దీనిని మూడవ అతి పెద్ద కేన్సర్‌గా చెపుతారు. కేన్సర్ వల్ల వచ్చే మరణాలకు ఇది రెండవ అతి పెద్ద కారణం. ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా 6,55,000 మంది కోలన్ కేన్సర్‌వల్ల మృత్యువు బారిన పడుతున్నారని ఎన్నో సర్వేలు తెలియజేస్తున్నాయి. ఈ మధ్య ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.



     

పెద్దపేగులో పెరిగి- కేన్సర్ కాని కంతులైన అడినోమాటస్ పాలిప్స్ నుంచి ఈ కేన్సర్ కంతులు ఉద్భవిస్తాయని భావిస్తున్నారు. కుక్కగొడుగులలాగా ఉండే ఈ అడినోమాటస్ పాలిప్స్.. మామూలుగా బినైన్ కంతులే అయి ఉంటాయి. కాని వాటిలోని కొన్ని మాత్రం తర్వాత కాలంలో కేన్సర్లుగా పరిణామం చెందుతాయి. పెద్దపేగులో వచ్చే కేన్సర్లను కొలనోస్కోపీ పరీక్ష ద్వారా నిర్థారించడం జరుగుతుంది.

Wednesday 2 August 2017

అన్ని జబ్బులకు ఒకటే మందు

మనకు తెలుసు మానవ శరీరం దానికదే రోగ నివారిణి గా పనిచేస్తుంది. అది ప్రకృతి మనకు ప్రసాదించిన వరం. అమెరికా లోని ఒక వ్యక్తి దీన్ని స్ఫూర్తి గా తీసుకొని సర్వరోగ నివారిణి గా ఒక మందు తయారు చేసాడు. అతని పేరు డాక్టర్ సెబి. అతనొక్కడే రోగ నిర్దారక వైద్యుడు,జీవ శాస్త్రవేత్త,ఔషద శాస్త్రవేత్త. ఆటను హోండురాస్ నుంచి వలస వచ్చి అమెరికాలో వైద్యుడిగా స్థిరపడ్డాడు. రోగం ఏదైనప్పటికీ ప్రజలకు తన సేవలను అందించాడు. అతను ప్రకృతి వైద్యం ఉపయోగించి నయం కాని రోగాలను నయం చేస్తున్నాడు. అయితే 1988 లో న్యూయార్క్ సుప్రీం కోర్టులో అతనిపై విచారణకు ఉపక్రమించారు.





లైసెన్స్ లేకుండా అతను ప్రాక్టీస్ చేస్తున్నాడని, న్యూయార్క్ పోస్ట్ వంటి వార్తా పత్రికల్లో ప్రచారం చేస్తున్నదనేది అతనిపై అభియోగం. విచారణలో జడ్జి అతన్ని ఒక్క సాక్ష్యమైనా చూపించమని అడగ్గా 77 మంది సాక్షులు అతని తరపున సాక్ష్యం చెప్పేందుకు వచ్చారు. ఇప్పుడు ఆశ్చర్యపోవడం జడ్జి వంతయింది. ఆటను నిజంగా నయం చేయగలదని రుజువు కావడంతో న్ర్దోశిగా విడుదల చేసారు. అతని దగ్గర వైద్యం చేయించుకున్న ప్రముఖుల్లో మైఖేల్ జాక్సన్, మాజిక్ జాన్సన్, ఎడ్డీ మర్ఫీ, జాన్ ట్రవోల్టా వంటి ప్రముఖులు ఉన్నారు.

Tuesday 1 August 2017

కేన్సర్ కు టీకా మందు

ప్రాణాంతక కేన్సర్‌కు విరుగుడు కనుక్కునేందుకు శాస్త్రవేత్తలు చేయని ప్రయత్నంలేదు. రోగ నిరోధక వ్యవస్థ కేన్సర్‌ కణాలపై దాడి చేసే విధానాన్ని ఇప్పటివరకు శాస్త్రవేత్తలు ప్రయత్నించలేదు. అయితే చర్మ కేన్సర్లపై ఇటీవల జరిగిన రెండు క్లినికల్‌ ట్రయల్స్‌ కేన్సర్‌ కణితులకు అనుగుణంగా టీకాలను అభివృద్ధి చేయగలమన్న భరోసా శాస్త్రవేత్తల్లో కల్పిస్తున్నాయి. కేన్సర్‌ కణాల ఉపరితలంపై కనిపించే నియో యాంటీజెన్స్‌ ద్వారా ఇది సాధ్యం కావచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అమెరికాలోని బోస్టన్‌లోని డానా ఫార్బర్‌ కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్, జర్మనీకి చెందిన బయో ఫార్మాసూటికల్‌ న్యూ టెక్నాలజీస్‌లు వేర్వేరుగా నిర్వహించిన ప్రయోగాల ద్వారా ఈ విషయం స్పష్టమైంది.









కేన్సర్‌ కణితుల్లో ఉండే యాంటీజెన్లను కృత్రిమ పద్ధతుల్లో తయారు చేసి రోగి శరీరాల్లోకి ఎక్కించినప్పుడు దీర్ఘకాలం పాటు కేన్సర్‌ తిరిగి రాలేదని నిపుణులు గుర్తించారు. కొంతమందిలో కేన్సర్‌ కణాల ఆనవాళ్లు లేకుండా పోయాయని.. ఈ రెండు ప్రయోగాల్లో వాడిన టీకాలు సత్ఫలితాలివ్వడంతో కేన్సర్‌కు విరుగుడుగా టీకా అభివృద్ధి చేసే అవకాశాలు పెరిగాయంటున్నారు. ఈ టీకా ఒక్కో రోగికి ప్రత్యేకంగా తయారవుతుందట. కేన్సర్‌ కణాల్లోని నియోయాంటీజెన్లతో టీకాలను అభివృద్ధి చేయడానికి ప్రస్తుతం అధిక మొత్తంలో ఖర్చు కావడమే కాకుండా ఎక్కువ సమయం పడుతుందని తెలిపిన శాస్త్రవేత్తలు.. ఇది అందరికీ అందుబాటులోకి రావాలంటే మరికొంత సమయం పట్టొచ్చు అని వెల్లడించారు.

Monday 31 July 2017

ఫేస్‌ క్రీంలతో కేన్సర్‌?


నల్లగా ఉన్నామనే న్యూనతతో నలుగురితో కలవలేకపోతున్నారా...? అయితే మా ఫేస్‌క్రీమ్‌ వాడండి! తెల్లగా అవుతారు. అరె! మీరు నల్లగా ఉండడం వల్ల ఎవరికీ నచ్చక... ఎంతకీ పెళ్లి కావడంలేదా...? అయితే మా క్రీమ్‌ వాడిన వారంలోనే మీకు పెళ్లి ఖాయం. మగవారి అందాన్నీ మరింత ఇనుమడింపజేసేందుకు ఇప్పుడు మార్కెట్‌లోకి వచ్చేసింది సరికొత్త ఫేస్‌ క్రీమ్‌... ఇలా ఉంటాయి ఫేస్‌ క్రీమ్‌ కంపెనీల ప్రకటనలు. ఇలాంటి ప్రకటనలు చూసి మోసపోయి ఫేస్‌ క్రీమ్‌లు తెగ పులుమేసుకుంటున్నారా...? రంగు మారడం మాటేమోకాని ముందుగానే ముఖంపై ముడుతలు, ఆ తరువాత కేన్సర్‌ ఖాయం అంటున్నారు నిపుణులు. ఫేస్‌ క్రీం ఏ కంపెనీదైనా తయారీలోలో హైడ్రోక్వినాన్‌ అనే రసాయనాన్ని వాడతారు.



ఫేస్‌క్రీమ్‌ రాసిన చోట ఈ రసాయనం వల్ల నిగారింపు వస్తుంది. మెలనిన్‌ తయారు కావడం ఆగిపోయి చర్మం కింద కరల్‌ సెల్స్‌ తయారవుతాయి. రసాయనాలతో కూడిన ఈ ఫేస్‌ క్ర్రీమ్‌లు వాడడం వల్ల వచ్చే నిగారింపు తాత్కాలికమే. దీని వల్ల చర్యంపై ముడుతలు త్వరితంగా ఏర్పడి వృద్దాప్య ఛాయలు చిన్న వయసులోనే కనబడతాయి. దీర్ఘకాలంలో ఇది చర్మ కేన్సర్‌కు దారి తీస్తుంది. అందు వల్ల సహజంగా లభించే వృక్ష సంబంధమైన వాటితో చర్మ సౌందర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి చర్మానికి అది అన్ని విధాలా మంచిది. ఇలా వచ్చిన నిగారింపు ఎక్కువకాలం నిలక డగా ఉంటుంది, సహజంగా వయసు రీత్యా ముఖంలో వచ్చే వృద్ధాప్య ఛాయలను వాయిదా వేస్తుంది. కాంతి వంతమైన చర్మం కలిగి నవారు నల్లగా ఉన్నా అందం గానే ఉంటారనే విషయా న్ని ముందుగా గమనించాలి.

Sunday 30 July 2017

బొజ్జతో పాటు పెరుగుతున్న కేన్సర్‌ ముప్పు

పెరిగిపోతున్న బొజ్జతో కేన్సర్‌ ముప్పు కూడా పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అధ్యయనం హెచ్చరించింది. ఇందులో ప్రేగు, రొమ్ము కేన్సర్లతో పాటు పాంక్రియాటిక్‌ కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువన్నారు. బీఎంఐ లానే పొట్ట, నడుము కొలతలు కూడా కేన్సర్‌ ముప్పును అంచనా వేయడానికి బాగా తోడ్పడతాయని అంతర్జాతీయ పరిశోధకులు వివరించారు. పొట్ట 11 సెంటీమీటర్లు పెరిగితే స్థూలకాయానికి సంబంధించిన కేన్సర్ల ముప్పు 13 శాతం పెరుగుతోందని వివరించారు.





ముఖ్యంగా బొజ్జ 8 సెంటీమీటర్లు పెరిగితే ప్రేగు కేన్సర్‌ వచ్చే ముప్పు 15 శాతం పెరుగుతోందన్నారు. ఓ అధ్యయనం ప్రకారం.. కేన్సర్‌ రావడానికి కారణమయ్యే అంశాలలో పొగ త్రాగే అలవాటు తర్వాతి స్థానం స్థూలకాయానిదేనట! బరువును నియంత్రించుకోవడం ద్వారా ఈ ముప్పును తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. అధిక బరువుతో లైంగిక హర్మోన్ల స్థాయుల్లో మార్పులు చోటుచేసుకొని, కేన్సర్‌ ముప్పును పెంచుతున్నాయన్నారు.

Saturday 29 July 2017

అనారోగ్య జీవనశైలితో పెద్దపేగు కేన్సర్

జీవనశైలి మార్పుల కారణంగా వస్తున్న ప్రాణాంతక సమస్యల్లో పెద్దపేగు కేన్సర్ ఒకటి. ఇటీవలి కాలంలో ఈ తరహా కేన్సర్ కేసులు పెరగటం ఏంటో ఆందోళన కలిగిస్తోన్న అంశం. అయితే సమస్యకు గల కారణాలను అవగాహన చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకొంటే ఈ సమస్యను నివారించటం సాధ్యమే. తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమైన తర్వాత మిగిలిన వ్యర్ధాలు మలంగా మారతాయి. దీనిని బయటికి పంపటమే పెద్దపేగు పని. పెద్దపేగు(కొలన్)కు సోకిన కేన్సర్ ను  కొలన్ కేన్సర్ అనీ, పెద్దపేగు చివరి భాగమైన పాయువుకు సోకితే రెక్టల్ కేన్సర్ అంటారు.




ఈ తరహా కేన్సర్ సోకినప్పుడు పేగు బిగుసుకు పోవటం, పేగులోపల తిత్తులు(పాలిప్స్) ఏర్పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో ఈ లక్షణాలు అసలు కనిపించక పోవచ్చు. పెద్దపేగు కేన్సర్ వంశపారంపర్యంగా వస్తుందని చెప్పే ఖచ్చితమైన ఆధారాలు లేకపోయినా రాదని మాత్రం గ్యారెంటీ లేదు. అందుకే పెద్దలకు ఈ సమస్య ఉన్నప్పుడు ముందు జాగ్రత్తగా 15 ఏళ్ళు నిండిన వారి పిల్లలకు ఏడాదికి ఒకసారి ఈ పరీక్షలు చేయించటం అవసరం. ఎంత ముందుగా సమస్యను గుర్తించగలిగితే అంత  సమర్ధవంతంగా దీన్ని నయం చేయవచ్చు. సమస్యను ప్రాథమిక స్థాయిలో గుర్తించే పలు ఆధునిక పరీక్షలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Friday 28 July 2017

పసుపుతో కేన్సర్ కు చెక్

పసుపులో ఔషధ గుణాలున్నాయని మన పూర్వీకులు ఏనాడో చెప్పారు. ఇప్పుడు దీనికున్న మరో అద్భుతమైన గుణాన్ని శాస్త్రవేత్తలు పరిశోధించి కనుగొన్నారు. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసే పసుపు కేన్సర్‌ నిరోధించడానికీ సాయపడుతుందని అమెరికా శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. ఈ బృందంలో భారత సంతతి శాస్త్రవేత్త కూడా ఉండడం విశేషం! పసుపులో ఉండే కర్కమిన్‌ సాయంతో పసికందులలో వచ్చే కేన్సర్‌ను సమర్థమంతంగా నిరోధించవచ్చట.



కాగా, పదేళ్లలోపు చిన్నారులకు ఈ కేన్సర్‌ ముప్పు ఎక్కువ. ఇందులో కణుతులు మందులకు లొంగవని నిపుణులు చెబుతున్నారు. ఈ తరహా మొండి కణుతులే లక్ష్యంగా సూక్ష్మ అణువులను పంపించేందుకు కర్కమిన్‌ తోడ్పడుతుందన్నారు. కణితిని అణిచివేసే సూక్ష్మ అణువులను కర్కమిన్‌కు జతచేసి నేరుగా లక్ష్యానికి చేర్చవచ్చన్నారు. ఇలా ఓ ప్రత్యేక పద్ధతిలో దాడి చేసి కేన్సర్‌ను నియంత్రించవచ్చని చెప్పారు. ఈ విషయంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.
 

Thursday 27 July 2017

రొమ్ము కేన్సర్‌ చికిత్సకు కొత్తరకం మాత్రలు

రొమ్ము కేన్సర్‌ చికిత్సలో ఉపయోగించే కొత్తరకం మాత్రలను శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసింది. ఈ బృందంలో భారత సంతతి శాస్త్రవేత్త కూడా ఉన్నారు. సైక్లిన్‌ డిపెండెంట్‌ కినాస్‌ నిరోధకాలుగా వ్యవహరించే ఈ మందులతో దుష్పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం కూడా తక్కువే.


నోటి ద్వారా తీసుకునే ఈ మందులతో హోర్మోన్‌ రిసెప్టార్‌ పాజిటీవ్‌ కేన్సర్‌ను సమర్థవంతంగా నియంత్రించవచ్చని రొమ్ము కేన్సర్‌ చికిత్సా నిపుణుడు ఆదిత్యా బార్డియా పేర్కొన్నారు. కేన్సర్‌ వేగంగా విస్తరించడానికి సీడీకే ఎంజైమ్‌లు తోడ్పడతాయని, తాజాగా అభివృద్ధి చేసిన కొత్తరకం ముందులతో వీటికి అడ్డుకోవచ్చని చెప్పారు.

Wednesday 26 July 2017

కేన్సర్ కు కొబ్బరినూనె దివ్యౌషధం

కొబ్బరినూనె దివ్యౌషధం అంటున్నారు అమెరికన్ శాస్త్రవేత్తలు. అవును, కొబ్బరినూనె వాడితో రోజుల వ్యవధిలో 90 శాతం పేగు కేన్సర్ దూరమవుతుందట. అమెరికన్ కేన్సర్ సొసైటీ ఆధ్వర్యంలో 95వేల 270 కేసుల్ని పరిశోధించిన వైద్యులు, ఆపరేషన్, రేడియేషన్, కీమోథెరపీ కంటే కొబ్బరినూనె వాడకమే మేలని నిర్థారించారు. రేడియేషన్ ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ కొబ్బరినూనె ద్వారా రావని తేలింది.



కొబ్బరినూనెలో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయని అమెరికన్ శాస్త్రవేత్తలు అర్థం చేసుకున్నారు. బాగా పెరిగిన కొబ్బరికాయ కంటే పెరిగీ పెరగకుండా ఉండే కొబ్బరికాయ నుంచి తీసే ఆయిల్ ఇంకా శక్తివంతంగా పనిచేస్తుంది. కొబ్బరినూనెలోని లారిక్ యాసిడ్ కేన్సర్ నాశక గుణాలను కలిగి ఉంటుంది.

Tuesday 25 July 2017

కేన్సర్ కి చెక్ పెట్టబోతున్న ఆస్పిరిన్

ఆస్పిరిన్ డ్రగ్ కేన్సర్ ని అరికడుతుందని గత కొద్ది సంవత్సరాలుగా డాక్టర్లు చెప్తూ వస్తున్నారు. కానీ అది ఎంతవరకు నిజమన్నది స్పష్టం చేయలేదు. ఆ ప్రశ్నకు సమధానం చెప్తున్నారు మద్రాసు ఐఐటీకి చెందిన బయోటెక్నాలజీ ప్రొఫెసర్ అమల్ కాంతి బేరా. సింపుల్ పెయిన్ కిల్లర్ భయంకరమైన కేన్సర్ కణాలను నాశనం చేస్తుందని ఆయన ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తున్నారు.






ఆస్పిరిన్ అనే నాన్ స్టెరాయిడల్, యాంటీ ఇన్ ఫ్లిమేటరీ డ్రగ్ ప్రాణాంతక కేన్సర్ కణాలపై దాడి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందనే పాజిటివ్ సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ డ్రగ్ కేన్సర్ కణాల్లోని మైటోకాండ్రియాలో ఉన్న అధిక స్థాయి కాల్షియం అయాన్లను ప్రేరేపిస్తుంది. ఫలితంగా ఆహారాన్ని శక్తిగా మార్చకుండా మైటోకాండ్రియాను నిరోధిస్తుంది. ఇలా ఎనర్జీ ప్రొడక్షన్ ఆగిపోవడంతో కేన్సర్ కణాలు క్రమంగా చనిపోతాయి.

Monday 24 July 2017

ఐదేళ్ల ముందే బ్రెయిన్‌ కేన్సర్‌ గుర్తింపు

 
బ్రెయిన్‌ కేన్సర్‌ వచ్చే ముప్పును ఐదేళ్ల ముందుగానే గుర్తించే వినూత్న రక్తపరీక్షను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వ్యాధికి సంబంధించి ఎలాంటి లక్షణా లు పొడచూపకున్నా.. రోగాన్ని గుర్తించేలా దీనిని తీర్చిదిద్దినట్లు ఓహియో స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు వివరించారు. బ్రెయిన్‌ కేన్సర్‌ నిర్ధారణలో గ్లియోమోలు కీలక పాత్ర పోషిస్తాయట! తాజాగా అభివృద్ధి చేసిన రక్తపరీక్ష వీటిపై దృష్టి సారిస్తుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన జూడిత వివరించారు.



                కేన్సర్లలో ఒక్కోదానికి వేర్వేరు లక్షణాలు కనిపిస్తాయి. తలనొప్పి, జ్ఞాపకశక్తి క్షీణించడం, శారీరక మార్పులు, చూపు మసకబారడం తదితర లక్షణాలు బయటపడతాయి. ఈ లక్షణాలు బయటపడ్డాక 3 నెలల వ్యవధిలో కేన్సర్‌ను గుర్తించడం సాధ్యమవుతుంది. కానీ కేన్సర్‌ కణితి అప్పటికే బాగా అడ్వాన్స్‌ దశకు చేరుకుంటుందన్నారు. కేన్సర్‌ను ప్రారంభంలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించవచ్చని వైద్య నిపుణులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో తాజా ఆవిష్కరణ కేన్సర్‌ చికిత్సకు మెరుగైన ప్రత్యామ్నాయం అభివృద్ధి చేసేందుకు తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Saturday 22 July 2017

కేన్సర్ కణాలను మట్టుబెట్టే విటమిన్ ఇది!


ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిని పొట్టన బెట్టుకుంటున్న వ్యాధుల్లో కేన్సర్ ఒకటి. ఈ వ్యాధి బారిన పడి 2015లో 90 లక్షల మంది మరణించారు. ప్రాణాంతకమైన ఈ వ్యాధిని నయం చేసేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు జరుపుతున్నారు. ఏ ఆహారం తీసుకుంటే కేన్సర్ ముప్పును తగ్గించవచ్చు, ఏ విటమిన్లు ఈ వ్యాధి కారక కణాలను నాశనం చేస్తాయి.. అనే దిశగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా సాగిన ఓ అధ్యయనంలో కేన్సర్ కణాలను విటమిన్-సి నాశనం చేస్తోందని తేలింది.



ఆంకోటార్గెట్ అనే మెడికల్ జర్నల్‌లో ఈ అధ్యయాన్ని ప్రచురించారు. ఇతర మందులతో పోలిస్తే.. కేన్సర్ మూల కణాలను విటమిన్-సి పదిరెట్లు ఎక్కువగా అంతం చేస్తోందని, వ్యాధి ఇతర భాగాలకు వ్యాపించకుండా అడ్డుకుంటోందని సదరు అధ్యయనం తేల్చింది. నిమ్మజాతి పండ్లలో విటమిన్-సి ఎక్కువగా లభిస్తుందనే సంగతి తెలిసిందే.

   

ఫేస్‌ క్రీంలతో కేన్సర్‌?



నల్లగా ఉన్నామనే న్యూనతతో నలుగురితో కలవలేకపోతున్నారా...? అయితే మా ఫేస్‌క్రీమ్‌ వాడండి! తెల్లగా అవుతారు. అరె! మీరు నల్లగా ఉండడం వల్ల ఎవరికీ నచ్చక... ఎంతకీ పెళ్లి కావడంలేదా...? అయితే మా క్రీమ్‌ వాడిన వారంలోనే మీకు పెళ్లి ఖాయం. మగవారి అందాన్నీ మరింత ఇనుమడింపజేసేందుకు ఇప్పుడు మార్కెట్‌లోకి వచ్చేసింది సరికొత్త ఫేస్‌ క్రీమ్‌... ఇలా ఉంటాయి ఫేస్‌ క్రీమ్‌ కంపెనీల ప్రకటనలు. ఇలాంటి ప్రకటనలు చూసి మోసపోయి ఫేస్‌ క్రీమ్‌లు తెగ పులుమేసుకుంటున్నారా...? రంగు మారడం మాటేమోకాని ముందుగానే ముఖంపై ముడుతలు, ఆ తరువాత కేన్సర్‌ ఖాయం అంటున్నారు నిపుణులు. ఫేస్‌ క్రీం ఏ కంపెనీదైనా తయారీలోలో హైడ్రోక్వినాన్‌ అనే రసాయనాన్ని వాడతారు.



                   ఫేస్‌క్రీమ్‌ రాసిన చోట ఈ రసాయనం వల్ల నిగారింపు వస్తుంది. మెలనిన్‌ తయారు కావడం ఆగిపోయి చర్మం కింద కరల్‌ సెల్స్‌ తయారవుతాయి. రసాయనాలతో కూడిన ఈ ఫేస్‌ క్ర్రీమ్‌లు వాడడం వల్ల వచ్చే నిగారింపు తాత్కాలికమే. దీని వల్ల చర్యంపై ముడుతలు త్వరితంగా ఏర్పడి వృద్దాప్య ఛాయలు చిన్న వయసులోనే కనబడతాయి. దీర్ఘకాలంలో ఇది చర్మ కేన్సర్‌కు దారి తీస్తుంది. అందు వల్ల సహజంగా లభించే వృక్ష సంబంధమైన వాటితో చర్మ సౌందర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి చర్మానికి అది అన్ని విధాలా మంచిది. ఇలా వచ్చిన నిగారింపు ఎక్కువకాలం నిలక డగా ఉంటుంది, సహజంగా వయసు రీత్యా ముఖంలో వచ్చే వృద్ధాప్య ఛాయలను వాయిదా వేస్తుంది. కాంతి వంతమైన చర్మం కలిగి నవారు నల్లగా ఉన్నా అందం గానే ఉంటారనే విషయా న్ని ముందుగా గమనించాలి.

Thursday 20 July 2017

జుట్టు రంగుతో రొమ్ము కేన్సర్‌ ముప్పు!

జుట్టుకు రంగు వేసుకునే మహిళలు రొమ్ము కేన్సర్‌ బారిన పడే ముప్పు ఎక్కువని తాజా అధ్యయనం వెల్లడించింది. అలాగే గర్భనిరోధానికి హార్మోనల్‌ ఇంట్రాటెరైన్‌ పద్ధతులను అనుసరించే వారిలో ఈ ముప్పు మరింత తీవ్రమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ హెల్సింకీ శాస్త్రవేత్తలు ఫిన్లాండ్‌కు చెందిన 8 వేల మంది రొమ్ము కేన్సర్‌ బాధితులు, మరో 20 వేల మంది ఆరోగ్యవంతులై మహిళలపై అధ్యయనం చేశారు.







గర్భనిరోధానికి హార్మోనల్‌ ఇంట్రాటెరైన్‌ పద్ధతులను అనుసరించే వారికి కాపర్‌ టీ వంటి పద్ధతులను అనుసరించే వారి కన్నా రొమ్ము కేన్సర్‌ వచ్చే ముప్పు 52 శాతం అధికమని తేలింది. అలాగే జుట్టుకు రంగు వేసుకునే వారికి రొమ్ము కేన్సర్‌ ముప్పు 23 శాతం ఎక్కువని శాస్త్రవేత్తలు తెలిపారు.

Wednesday 19 July 2017

బ్లడ్ కేన్సర్ కు కొత్త మెడిసిన్


బ్లడ్ కేన్సర్ బాధితులకు గుడ్ న్యూస్. వ్యాధితో బాధ పడుతున్న వారికి మెరుగైన చికిత్సను అందించేందుకు ఓ కొత్త మెడిసిన్ ను సైంటిస్టులు తయారు చేశారు. ఈ మందును విడిగా వాడినా.. కిమోథెరపీతో పాటు అందించినా మంచి ప్రభావం చూపిస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్ లో స్పష్టమైంది. ఈ డ్రగ్ ను అభివృద్ధి చేసిన టీంకు భారత సంతతి పరిశోధకురాలు,యూనివర్శిటీ ఆఫ్ యూటా పోస్ట్ డాక్టొరల్ శ్రీవిద్య భాస్కర  నేతృత్వం వహించారు. అక్యూట్ లింపోబ్లాస్టిక్ లుకేమియా గా వ్యవహరించే బ్లడ్ కేన్సర్ చిన్నా పెద్దా తేడాలేకుండా అందరిపైనా దాడిచేస్తుంది. దీని బాధితుల్లోని 30% మందిలో ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.



క్రోమోజోమ్ లోని రెండు విభాగాలు వాటి స్వభావానికి భిన్నంగా అతుక్కుపోతే దాన్ని ఫిలడెల్పియా క్రోమోజోమ్ గా వ్యవహరిస్తారు. కొత్తగా ఏర్పడిన ఈ క్రోమోజోమ్ DNA ను మరమ్మతు చేయడం ప్రారంభిస్తుంది. DNA  రిపేర్ అంటే వినడానికి ఏదేదో మంచి విషయంలాగానే అనిపించవచ్చు. కానీఈ క్రమోజోమో చే మరమ్మతు ఫలితం చెడుకే దారి తీస్తుంది. ఆ ప్రక్రియ వ్యసనంగా మారి నిరంతరం కొనసాతుంది. ఈ ప ర్రక్రియ కోసం ఆక్రోమోజోమ్ వినియోగించే రకరకాల ప్రోటీన్లను అడ్డుకోడానికి పలు రకాల మందులను వాడాలి. అలా వాడితే అవి విషపూరితంగా మారి సాధారణ కణాలపై దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అందుకే ఈ వ్యసనాన్ని నిరోధించేందుకు విస్తృతంగా ప్రయోగాలు చేసి హిస్టోన్ డియాసిటైలసిస్ అనే రెండు ప్రొటీన్లపై ప్రధానంగా దృష్టి సారించి సరికొత్త మెడిసిన్ ను ఆవిష్కరించినట్లు పరిశోధకులు తెలిపారు.

Tuesday 18 July 2017

కేన్సర్‌ వ్యాప్తి నిరోధానికి కొత్త మార్గం?

కేన్సర్‌ కణాల్లో కొన్నింటికి ఓ అనూహ్యమైన లక్షణముంటుంది. చుట్టూ ఉన్న కేన్సర్‌ కణాలను అవి తినేస్తూంటాయి. ఈ ప్రక్రియను ఎన్‌టోసిస్‌ అంటారు. వందేళ్లుగా అందరికీ తెలిసిన ఈ లక్షణాన్ని ఉపయోగించుకుని కేన్సర్‌ కణతుల పెరుగుదలను నిరోధించేందుకు కేంబ్రిడ్జ్‌లోని బబ్రహాం ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఎన్‌టోసిస్‌కు కణ విభజన ప్రక్రియ ఒక ప్రేరకంగా పని చేస్తోందని.. కణాలు అడ్డూ అదుపు లేకుండా విడిపోతూ ఉండటాన్ని కేన్సర్‌ అంటారు కాబట్టి.. ఈ రెండింటి మధ్య సంబంధంపై మానవ ఎపిథీలియల్‌ కణాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు.




సాధారణంగా ఈ కణాలు విడిపోయేటప్పుడు కూడా తమ పరిసరాలకు గట్టగా అతుక్కునే ఉంటాయి. ఒకవేళ ఇలా అతుక్కునే లక్షణం తక్కువగా ఉన్నప్పుడు ఎన్‌టోసిస్‌ లక్షణాలు అలవడుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కేన్సర్‌ కణాల్లోనూ ఇలాంటి లక్షణాన్ని పుట్టించగలిగితే కేన్సర్‌ నెమ్మదించేలా లేదా నిరోధించేలా చేయవచ్చని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ ఓలివర్‌ ఫ్లోరే అంటున్నారు.

Monday 17 July 2017

కేన్సర్ కణాలను మట్టుబెట్టే విటమిన్ ఇది!

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిని పొట్టన బెట్టుకుంటున్న వ్యాధుల్లో కేన్సర్ ఒకటి. ఈ వ్యాధి బారిన పడి 2015లో 90 లక్షల మంది మరణించారు. ప్రాణాంతకమైన ఈ వ్యాధిని నయం చేసేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు జరుపుతున్నారు. ఏ ఆహారం తీసుకుంటే కేన్సర్ ముప్పును తగ్గించవచ్చు, ఏ విటమిన్లు ఈ వ్యాధి కారక కణాలను నాశనం చేస్తాయి.. అనే దిశగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా సాగిన ఓ అధ్యయనంలో కేన్సర్ కణాలను విటమిన్-సి నాశనం చేస్తోందని తేలింది.



ఆంకోటార్గెట్ అనే మెడికల్ జర్నల్‌లో ఈ అధ్యయాన్ని ప్రచురించారు. ఇతర మందులతో పోలిస్తే.. కేన్సర్ మూల కణాలను విటమిన్-సి పదిరెట్లు ఎక్కువగా అంతం చేస్తోందని, వ్యాధి ఇతర భాగాలకు వ్యాపించకుండా అడ్డుకుంటోందని సదరు అధ్యయనం తేల్చింది. నిమ్మజాతి పండ్లలో విటమిన్-సి ఎక్కువగా లభిస్తుందనే సంగతి తెలిసిందే.

Sunday 16 July 2017

పెద్దపేగుకు క్యాన్సర్ వస్తే..

పెద్దపేగు, మలద్వారాలకు  వచ్చే కేన్సర్‌ను కోలోరెక్టల్, కోలన్ కేన్సర్ అని అంటారు. ఈ వ్యాధిలో పెద్దపేగు, మలద్వారం, అపెండిక్స్ భాగాల్లో కేన్సర్ కంతులు ఏర్పడి క్రమంగా పెరుగుతూ వుంటాయి. కేన్సర్ వ్యాధుల్లో దీనిని మూడవ అతి పెద్ద కేన్సర్‌గా చెపుతారు. కేన్సర్ వల్ల వచ్చే మరణాలకు ఇది రెండవ అతి పెద్ద కారణం. ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా 6,55,000 మంది కోలన్ కేన్సర్‌వల్ల మృత్యువు బారిన పడుతున్నారని ఎన్నో సర్వేలు తెలియజేస్తున్నాయి. ఈ మధ్య ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.



          పెద్దపేగులో పెరిగి- కేన్సర్ కాని కంతులైన అడినోమాటస్ పాలిప్స్ నుంచి ఈ కేన్సర్ కంతులు ఉద్భవిస్తాయని భావిస్తున్నారు. కుక్కగొడుగులలాగా ఉండే ఈ అడినోమాటస్ పాలిప్స్.. మామూలుగా బినైన్ కంతులే అయి ఉంటాయి. కాని వాటిలోని కొన్ని మాత్రం తర్వాత కాలంలో కేన్సర్లుగా పరిణామం చెందుతాయి. పెద్దపేగులో వచ్చే కేన్సర్లను కొలనోస్కోపీ పరీక్ష ద్వారా నిర్థారించడం జరుగుతుంది.

50 దాటిన తర్వాతే ఎక్కువగా కేన్సర్‌!

ఇన్నేళ్ల పరిశోధనల తర్వాత కూడా కేన్సర్‌ విషయంలో మనకు ప్రశ్నలే ఎక్కువ. సమాధానాలు తక్కువ. ఉదాహరణకు పొగాకు తాగేవారికి లంగ్‌ కేన్సర్‌ వస్తే- కారణం ఏమిటో మనం గమనించగలుగుతాం. జీవితంలో పొగాకు ముట్టని వాళ్లకు కేన్సర్‌ వస్తే- ఎందుకు వచ్చిందో తెలియదు. జన్యు కారణాల వల్ల రావచ్చు. జీవన శైలి వల్ల రావచ్చు. ఇక- మన దేశంలో 80 శాతం కేసుల్లో రెండో, మూడో స్టేజీల్లోనే క్యాన్సర్‌ వచ్చిందని తెలుస్తుంది. ఈ దశ లో కేన్సర్‌ నివారణ కష్టమవుతుంది. లక్షలు ఖర్చు పెట్టినా గ్యారంటీ ఉండదు. అందువల్లే కేన్సర్‌ చాలా ప్రమాదకరం.



అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 90 ఏళ్ల వయస్సు ఉన్నవారి దాకా ఎవరికైనా రావచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ఆధారంగా చూస్తే- 50 ఏళ్లు దాటిన వారికే కేన్సర్‌ ఎక్కువ వస్తోంది. ఇటీవల కాలంలో 21 ఏళ్ల వయస్సు దాటిన వారందరినీ క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ చేయించుకొమ్మని సలహా ఇస్తున్నారు. కేన్సర్‌ను ముందుగా గుర్తిస్తే నివారణ అవకాశాలు ఎక్కువ. చిన్న పిల్లలకు కూడా కేన్సర్‌ రావటం బాగా పెరిగింది.


Saturday 15 July 2017

రొమ్ము కేన్సర్‌ చికిత్సకు కొత్తరకం మాత్రలు


 రొమ్ము కేన్సర్‌ చికిత్సలో ఉపయోగించే కొత్తరకం మాత్రలను శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసింది. ఈ బృందంలో భారత సంతతి శాస్త్రవేత్త కూడా ఉన్నారు. సైక్లిన్‌ డిపెండెంట్‌ కినాస్ నిరోధకాలుగా వ్యవహరించే ఈ మందులతో దుష్పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం కూడా తక్కువే.


నోటి ద్వారా తీసుకునే ఈ మందులతో హార్మోన్‌ రిసెప్టార్‌ పాజిటివ్‌ కేన్సర్‌ను సమర్థవంతంగా నియంత్రించవచ్చని రొమ్ము కేన్సర్‌ చికిత్సా నిపుణుడు ఆదిత్యా బార్దియా పేర్కొన్నారు. కేన్సర్‌ వేగంగా విస్తరించడానికి సీడీకే ఎంజైమ్‌లు తోడ్పడతాయని, తాజాగా అభివృద్ధి చేసిన కొత్తరకం మందులతో వీటికి అడ్డుకోవచ్చని చెప్పారు.

Friday 14 July 2017

కేన్సర్ చికిత్సలో సైడ్ ఎఫెక్ట్ లను తగ్గించే ఆహార ప్రణాళికలు




కీమోథెరపీ మరియు రేడియోథెరపీలను కేన్సర్ వ్యాధి తగ్గించుటకు వాడే చికిత్సలని దాదాపు అందరికి తెలిసిందే. ఈ చికిత్సల వలన లాభాలే కాదు, నష్టాలు కూడా ఉన్నాయి, అదెలాగంటే ఈ చికిత్సల వలన శరీరంలో ఉన్న కేన్సర్ కణాలు మాత్రమే కాదు, ఆరోగ్యకర కణాలు కూడా ప్రమాదానికి గురవుతాయి. ఈ చికిత్సలలో రుచి, స్పర్శ, వాసన గ్రంధులు మరియు ఆకలి వంటివి తగ్గిపోతాయి. ఆకలిగా అనిపించకపోవటం వలన ఎక్కువగా తినలేరు మరియు తినే ఆహారం యొక్క వాసన, రుచి కూడా గ్రహించలేరు. ఫలితంగా బరువు తగ్గుతుంది. కావున రోగనిరోధక వ్యవస్థ శక్తిని పెంచే ఆహారాలను తీసుకోవటం ద్వారా ఈ సమస్యలను కొద్ది వరకైనా తగ్గించుకోవచ్చు.



కీమోథెరపీ చికిత్స  ఆకలి కోల్పోతారు కావున, ఆకలి అయిన కాకపోయిన రోజు సమయానికి ఆహరం తినండి.  భోజనానికి మధ్యలో అధిక కెలోరీలు గల ఆహరం, అధిక ప్రోటీన్ లు కలిగిన చీస్, పీ నట్ బటర్, ఉడికించిన గుడ్లు, పోషకాలను అందించే డ్రింక్స్ ను తాగండి. మీరు తాగే సూప్, వండిన తృణధాన్యాలు మరియు కూరగాయలకు క్రీమ్ లేదా బటర్ కలిపటం ద్వారా తీసుకునే కేలోరీల సంఖ్య కూడా అధికం అవుతుంది. తినే మాంసానికి సోయా సాస్ తో మారినేట్ చేయటం మరియు ఫ్యాట్ లేని డ్రెస్సింగ్ ల వంటివి చాలా ఆరోగ్యకరం. అదనంగా ఉల్లిపాయ, వెల్లుల్లి, కారంపొడి, ఆవాలు మరియు కెచప్ వంటివి కొద్దిగా కలపటం వలన మీ రుచి గ్రాహకాలకు రుచి తెలుస్తుంది.

Thursday 13 July 2017

కేన్సర్‌ వ్యాప్తి నిరోధానికి కొత్త మార్గం?

కేన్సర్‌ కణాల్లో కొన్నింటికి ఓ అనూహ్యమైన లక్షణముంటుంది. చుట్టూ ఉన్న కేన్సర్‌ కణాలను అవి తినేస్తూంటాయి. ఈ ప్రక్రియను ఎన్‌టోసిస్‌ అంటారు. వందేళ్లుగా అందరికీ తెలిసిన ఈ లక్షణాన్ని ఉపయోగించుకుని కేన్సర్‌ కణతుల పెరుగుదలను నిరోధించేందుకు కేంబ్రిడ్జ్‌లోని బబ్రహాం ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఎన్‌టోసిస్‌కు కణ విభజన ప్రక్రియ ఒక ప్రేరకంగా పని చేస్తోందని.. కణాలు అడ్డూ అదుపు లేకుండా విడిపోతూ ఉండటాన్ని కేన్సర్‌ అంటారు కాబట్టి.. ఈ రెండింటి మధ్య సంబంధంపై మానవ ఎపిథీలియల్‌ కణాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు.


సాధారణంగా ఈ కణాలు విడిపోయేటప్పుడు కూడా తమ పరిసరాలకు గట్టగా అతుక్కునే ఉంటాయి. ఒకవేళ ఇలా అతుక్కునే లక్షణం తక్కువగా ఉన్నప్పుడు ఎన్‌టోసిస్‌ లక్షణాలు అలవడుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కేన్సర్‌ కణాల్లోనూ ఇలాంటి లక్షణాన్ని పుట్టించగలిగితే కేన్సర్‌ నెమ్మదించేలా లేదా నిరోధించేలా చేయవచ్చని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ ఓలివర్‌ ఫ్లోరే అంటున్నారు. ఎన్‌టోసిస్‌ను మరింత క్షుణ్నంగా అధ్యయనం చేయడం ద్వారా కేన్సర్‌తోపాటు ఇతర వ్యాధులకు మెరుగైన చికిత్స లభిస్తుందని అంచనా.

Wednesday 12 July 2017

నొప్పి లేకుండా గర్భాశయ కేన్సర్‌ నిర్ధారణ


 గర్భాశయ కేన్సర్‌ నిర్ధారణకు ఓ సరికొత్త పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. తేలికగా, ఎక్కడికైనా తీసుకెళ్లే వీలున్న ఈ పరికరంతో ఎలాంటి నొప్పి, అసౌకర్యం ఉండదని డ్యూక్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వివరించారు. భారత సంతతికి చెందిన ప్రొఫెసర్‌ నిమ్మి రామానుజన్‌ ఈ బృందానికి నేతృత్వం వహించారు.


కాగా, గర్భాశయ కేన్సర్‌ నిర్ధారణకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న విధానం బాధాకరమైందని వైద్య నిపుణులు తెలిపారు. దీంతో చాలా మంది ఈ పరీక్షకు విముఖత చూపిస్తారు. దీంతో కేన్సర్‌ బాగా ముదిరాక కానీ బయటపడదని అన్నారు. ఇది కేన్సర్‌ మరణాలను పెంచుతోందని వివరించారు. ఈ నేపథ్యంలో తాజా పరికరంతో గర్భాశయ కేన్సర్‌ మరణాలను కనిష్ఠ స్థాయికి తగ్గించవచ్చని నిమ్మి రామానుజన్‌ తెలిపారు. పాకెట్‌ కోల్పోస్కో్‌ప గా వ్యవహరించే ఈ పరికరం సాయంతో మహిళలు సొంతంగా పరీక్ష చేసుకోవచ్చని అన్నారు.

Tuesday 11 July 2017

టీకాతో కేన్సర్ కు చెక్

ప్రాణాంతక కేన్సర్‌కు విరుగుడు కనుక్కునేందుకు శాస్త్రవేత్తలు చేయని ప్రయత్నం లేదు. రోగ నిరోధక వ్యవస్థ కేన్సర్‌ కణాలపై దాడి చేసే విధానాన్ని ఇప్పటివరకు శాస్త్రవేత్తలు ప్రయత్నించలేదు. అయితే చర్మ కేన్సర్లపై ఇటీవల జరిగిన రెండు క్లినికల్‌ ట్రయల్స్‌ కేన్సర్‌ కణితులకు అనుగుణంగా టీకాలను అభివృద్ధి చేయగలమన్న భరోసా కల్పిస్తున్నాయి. కేన్సర్‌ కణాల ఉపరితలంపై కనిపించే నియో యాంటీజెన్స్‌ ద్వారా ఇది సాధ్యం కావచ్చని అంచనా. అమెరికాలోని బోస్టన్‌లో ఉన్న డానా ఫార్బర్‌ కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్, జర్మనీకి చెందిన బయో ఫార్మాసూటికల్‌ న్యూ టెక్నాలజీస్‌లు వేర్వేరుగా నిర్వహించిన ప్రయోగాల ద్వారా ఈ విషయం స్పష్టమైంది.



కేన్సర్‌ కణితుల్లో ఉండే యాంటీజెన్లను కృత్రిమ పద్ధతుల్లో తయారు చేసి రోగి శరీరాల్లోకి ఎక్కించినప్పుడు దీర్ఘకాలం పాటు కేన్సర్‌ తిరిగి రాలేదని గుర్తించారు. కొంతమందిలో కేన్సర్‌ కణాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఈ రెండు ప్రయోగాల్లో వాడిన టీకాలు సత్ఫలితాలివ్వడంతో కేన్సర్‌కు విరుగుడుగా టీకా అభివృద్ధి చేసే అవకాశాలు పెరిగాయి. అయితే ఈ టీకా ఒక్కో రోగికి ప్రత్యేకంగా తయారవుతుంది. అయితే కేన్సర్‌ కణాల్లోని నియోయాంటీజెన్లతో టీకాలను అభివృద్ధి చేయడానికి ప్రస్తుతం అధిక మొత్తంలో ఖర్చు కావడమే కాకుండా ఎక్కువ సమయం పడుతోంది. అందరికీ అందుబాటులోకి రావాలంటే మరికొంత సమయం పట్టొచ్చు.

Sunday 9 July 2017

టాల్కమ్ పౌడర్ వలన కేన్సర్ వస్తుందా?



టాల్క్ అనేది ఖనిజం, దీనిని ప్రధానంగా మాగ్నీషియం, సిలికాన్ మరియు ఆక్సిజన్‌లతో తయారు చేస్తారు. టాల్కమ్ పౌడర్,  బేబీ పౌడర్ మరియు ఇతర కాస్మోటిక్ ఉత్పత్తుల్లో దీని వినియోగం అధికం. టాల్క్ ఖనిజంలోని కొన్ని అంశాలు వాటి సహజ స్థితిలో కేన్సర్ వ్యాపించే పదార్థం  రాతినారను కలిగి ఉంటాయి. అయితే, రాతినార గల టాల్క్ వినియోగం చాలాకాలం క్రితమే నిలిపివేసినట్లు చెబుతున్నారు. ప్రయోగశాలలోని చిట్టెలుక, ఎలుకలు మరియు హ్యామ్‌స్టెర్‌లపై రాతినార లేని టాల్క్‌ను ఉపయోగించి నిర్వహించిన అధ్యయనాల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి.  జననావయవ ప్రాంతం, శానిటరీ నాప్కిన్స్,  కండోమ్‌లు లేదా డయాఫ్రేమ్‌ల్లో ఉపయోగించడం వలన పౌడర్ యోనిలోకి ప్రవేశించి, తర్వాత గర్భాశయానికి, స్త్రీ బీజవాహిక నాళాలకు, వాటి ద్వారా అండశయాలకు చేరుకుని, అండాశయ కేన్సర్‌కు కారణం కావచ్చు.





           

 ఈ ప్రయోగాల ఫలితంగా తేలిందేమిటంటే.. రాతినార కల టాల్కమ్ తో కేన్సర్ ఖాయమని రూఢీ అయింది. కానీ ఇప్పుడు వచ్చే టాల్కమ్ పౌడర్లలో రాతినార వాడటం లేదని కంపెనీలు చెబుతున్నాయి. అయితే ఇది నిజమా.. కాదా అనే అనుమానాలు చాలా మంది మనసుల్ని తొలుస్తున్నాయి. టాల్క్ వినియోగం, కేన్సర్ కారకానికి సంబంధించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. టాల్క్ గురించి భయం ఉన్నప్పుడు వాడకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


కిడ్నీ కేన్సర్ ఇలా వస్తుంది

కిడ్నీ కేన్సర్ కలిగే ప్రమాదవకాశాలు కారణంగా వ్యక్తి కేన్సర్ కు గురయ్యే అవకాశాలు కూడా అధికమే. కానీ, ఇవి నేరుగా మూత్రపిండాల కేన్సర్ కలిగించవు. కిడ్నీ కేన్సర్ ను కలిగించే ప్రమాదవకాశాల గురించి తెలుసుకోటవటం వలన వీటికి దూరంగా ఉండవచ్చు లేదా ప్రారంభ దశలోనే వ్యాధి నిర్దారణ జరిపి తగిన చికిత్స అనుసరించవచ్చు. దాదాపు 75 శాతం వరకు కిడ్నీ కేన్సర్ లు 60 సంవత్సరాలు పైబడిన స్త్రీ మరియు పురుషులలో కలుగుతున్నాయని కనుగొన్నారు. ఇందులోనూ స్త్రీలతో పోలిస్తే పురుషులలో అధికంగా కిడ్నీ కేన్సర్ కు గురవుతున్నారు- కిడ్నీ కేన్సర్ కు గురైన ముగ్గురిలో ఇద్దరు పురుషులే కావటం విశేషం. ఆఫ్రికన్- అమెరికన్ లలో కూడా కేన్సర్ వ్యాధికి గురయ్యే వారి సంఖ్య అధికమే.





         వృత్తి పరమైన రసాయనాలకు బహిర్గతం అవటం వలన కూడా కేన్సర్ కలుగుతుంది. కేన్సర్ వ్యాధికి గురైన వారిలో దాదపు 2 ఇద్దరు ఇలా వృత్తి ప్రరమైన రసాయనిక కారకాల వలన పరిశోధనలలో వెల్లడైంది. స్టీల్ ప్లాంట్ లో పని చేసే వారు ఎక్కువ శాతం కోల ఓవెన్లు లకు బహిర్గతం అవటం వలన కిడ్నీ కేన్సర్ కు గురయ్యే అవకాశాలు రెట్టింపు ఉన్నాయి. అంతేకాకుండా, వృత్తి పరంగా కాడ్మియం వంటి వారికి గురయ్యే వారు కిడ్నీ కేన్సర్ ముదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సిగరెట్ లేదా ధూమపానం అలవాటు ఉన్నవారు కిడ్నీ కేన్సర్ కు కలిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దాదాపు కిడ్నీ కేన్సర్ కు గురయ్యే వారిలో 25 శాతం వరకు సిగరెట్ తాగే అలవాటు ఉన్నవారే మరియు ఈ అలవాటు వలన ఇతర దుష్ప్రభావాలు కూడా అధికమే. సిగరెట్ తాగే అలవాటు వలన కిడ్నీ కేన్సర్ కలిగే అవకాశాలు రెట్టింపు అవుతాయి. సిగరెట్ కు దూరంగా ఉండటం వలన కిడ్నీ కేన్సర్ కే కాదు ఇతర అనారోగ్యాలకు కూడా దూరంగా ఉండవచ్చు.

Saturday 8 July 2017

కేన్సర్ కి చెక్ పెట్టబోతున్న ఆస్పిరిన్ టాబ్లెట్




ఆస్పిరిన్ డ్రగ్ కేన్సర్ ని అరికడుతుందని గత కొద్ది సంవత్సరాలుగా డాక్టర్లు చెప్తూ వస్తున్నారు. కానీ అది ఎంతవరకు నిజమన్నది స్పష్టం చేయలేదు. ఆ ప్రశ్నకు సమధానం చెప్తున్నారు మద్రాసు ఐఐటీకి చెందిన బయోటెక్నాలజీ ప్రొఫెసర్ అమల్ కాంతి బేరా. సింపుల్ పెయిన్ కిల్లర్ భయంకరమైన కేన్సర్ కణాలను నాశనం చేస్తుందని ఆయన ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తున్నారు. ఆస్పిరిన్ అనే నాన్ స్టెరాయిడల్, యాంటీ ఇన్ ఫ్లిమేటరీ డ్రగ్ ప్రాణాంతక కేన్సర్ కణాలపై దాడి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందనే పాజిటివ్ సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ డ్రగ్ కేన్సర్ కణాల్లోని మైటోకాండ్రియాలో ఉన్న అధిక స్థాయి కాల్షియం అయాన్లను ప్రేరేపిస్తుంది. ఫలితంగా ఆహారాన్ని శక్తిగా మార్చకుండా మైటోకాండ్రియాను నిరోధిస్తుంది. ఇలా ఎనర్జీ ప్రొడక్షన్ ఆగిపోవడంతో కేన్సర్ కణాలు క్రమంగా చనిపోతాయి. ఈ డ్రగ్ ని మరింత శక్తివంతంగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని రిపోర్ట్స్ చెప్తున్నాయి.. ప్రతీ రోజు తక్కువ మోతాదు ఆస్పిరిన్ తీసుకుంటే హై రిస్క్ కార్డియాక్ డిసీజ్ ఉన్న వ్యక్తుల్లో ఎలాంటి పాజిటివ్ రియాక్షన్ వస్తుందో, కేన్సర్ విషయంలో కూడా అదే ఎఫెక్ట్ వస్తుందని శాస్త్రవేత్తలు ఆశాభావంతో ఉన్నారు.


అయితే, ఆస్పిరిన్ డ్రగ్ కేన్సర్ ని పూర్తిగా నయం చేస్తుందని ఇప్పటికప్పుడు భరోసా ఇవ్వలేం అంటున్నారు. ఇంకా క్లినికల్ స్టడీస్ జరగాలనేది వారి అభిప్రాయం. ఏది ఏమైనా చివరికి విజయం సాధిస్తామనే ధీమాతో ఉన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం 2016 నాటికి దేశంలో 14.5 లక్షల మంది కేన్సర్ రోగులున్నారు. 2020కల్లా వారి సంఖ్య 17.3 లక్షలు పెరగొచ్చని అంచనా. కేన్సర్ ప్రారంభ దశలో ఉండగా చికిత్స పొందుతున్న వారు 12.5 శాతం మంది ఉన్నారు.
ఏది ఏమైనా కేన్సర్ అనే ప్రాణాంతక వ్యాధి, ఖరీదైన దాని చికిత్సకు ఒక చిన్న మాత్ర ద్వారా చెక్ చెప్పడానికి దారులు పరుచుకున్నాయి. చేస్తున్న పరిశోధనలను, వస్తున్న రిపోర్టులను బట్టి భవిష్యత్ లో దానిపై వందశాతం నమ్మకం కలుగుతోంది. నిజంగా ఆస్పిరిన్ ద్వారా కేన్సర్ ని అరికట్టగలిగితే వైద్య చరిత్రలోనే అదొక సంచనల విజయం అవుతుంది.

Friday 7 July 2017

కేన్సర్ కణాలను మట్టుబెట్టే విటమిన్

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిని పొట్టన బెట్టుకుంటున్న వ్యాధుల్లో కేన్సర్ ఒకటి. ఈ వ్యాధి బారిన పడి 2015లో 90 లక్షల మంది మరణించారు. ప్రాణాంతకమైన ఈ వ్యాధిని నయం చేసేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు జరుపుతున్నారు. ఏ ఆహారం తీసుకుంటే కేన్సర్ ముప్పును తగ్గించవచ్చు, ఏ విటమిన్లు ఈ వ్యాధి కారక కణాలను నాశనం చేస్తాయి.. అనే దిశగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా సాగిన ఓ అధ్యయనంలో కేన్సర్ కణాలను విటమిన్-సి నాశనం చేస్తోందని తేలింది.





ఆంకోటార్గెట్ అనే మెడికల్ జర్నల్‌లో ఈ అధ్యయాన్ని ప్రచురించారు. ఇతర మందులతో పోలిస్తే.. కేన్సర్ మూల కణాలను విటమిన్-సి పదిరెట్లు ఎక్కువగా అంతం చేస్తోందని, వ్యాధి ఇతర భాగాలకు వ్యాపించకుండా అడ్డుకుంటోందని సదరు అధ్యయనం తేల్చింది. నిమ్మజాతి పండ్లలో విటమిన్-సి ఎక్కువగా లభిస్తుంది.
కేన్సర్‌పై పోరాడేందుకు రోజువారీ ఆహారంలో భాగంగా ఎంత మోతాదులో విటమిన్-సి తీసుకోవాలనే విషయమై పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు.

Thursday 6 July 2017

బొజ్జతో పాటు పెరుగుతున్న కేన్సర్‌ ముప్పు



 పెరిగిపోతున్న బొజ్జతో కేన్సర్‌ ముప్పు కూడా పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అధ్యయనం హెచ్చరించింది. ఇందులో ప్రేగు, రొమ్ము కేన్సర్లతో పాటు పాంక్రియాటిక్‌ కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువన్నారు. బీఎంఐ లానే పొట్ట, నడుము కొలతలు కూడా కేన్సర్‌ ముప్పును అంచనా వేయడానికి బాగా తోడ్పడతాయని అంతర్జాతీయ పరిశోధకులు వివరించారు. పొట్ట 11 సెంటీమీటర్లు పెరిగితే స్థూలకాయానికి సంబంధించిన కేన్సర్ల ముప్పు 13 శాతం పెరుగుతోందని వివరించారు.




ముఖ్యంగా బొజ్జ 8 సెంటీమీటర్లు పెరిగితే ప్రేగు కేన్సర్‌ వచ్చే ముప్పు 15 శాతం పెరుగుతోందన్నారు. ఓ అధ్యయనం ప్రకారం.. కేన్సర్‌ రావడానికి కారణమయ్యే అంశాలలో పొగ త్రాగే అలవాటు తర్వాతి స్థానం స్థూలకాయానిదేనట! బరువును నియంత్రించుకోవడం ద్వారా ఈ ముప్పును తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. అధిక బరువుతో లైంగిక హర్మోన్ల స్థాయుల్లో మార్పులు చోటుచేసుకొని, కేన్సర్‌ ముప్పును పెంచుతున్నాయన్నారు.

Wednesday 5 July 2017

కొవ్వులతో తరతరాలకూ కేన్సర్

కొవ్వు ఎక్కువ అవుతోంది. కాస్త తగ్గించు. మన పెద్దలు అభిమానపూర్వకంగా చెప్పే ఈ మాటలో చాలా నిగూఢార్థాలు ఉన్నాయి. అధిక కొవ్వుతో గుండెపోటుతో పాటు కేన్సర్ కూడా వస్తుందట. అదే గర్భిణులకు కొవ్వు ఎక్కువైతే వారి సంతానానికి రొమ్ము కేన్సర్ ముప్పు తప్పదని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మాటలు వింటుంటే పెద్దల మాట ఎందుకు చద్దిమూటో మరోసారి గుర్తొస్తోంది కదూ.


మహిళలు గర్భంతో ఉన్నపుడు అధిక కొవ్వు ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే సంతానానికి రొమ్ము కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరించారు. ఆ ప్రభావం మూడు తరాల వరకు ఉంటుందని తెలిపారు. అధిక కొవ్వు గర్భిణుల్లో జన్యు సంబంధ మార్పులు చోటుచేసుకుని రొమ్ము కేన్సర్‌కు దారి తీస్తుందని అమెరికాలోని జార్జ్‌టౌన్‌ లాంబార్డీ కాంప్రహెన్సివ్‌ కేన్సర్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు తెలిపారు.

Tuesday 4 July 2017

కేన్సర్ ప్రాణాపాయాన్ని గుర్తించే పరీక్ష



 రొమ్ముకేన్సర్‌ బాధితులు చికిత్స ద్వారా కణితిని తొలగించుకున్నా ముప్పు పూర్తిస్థాయిలో తప్పినట్లుకాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కణితిని తొలగించిన రెండు దశాబ్దాల తర్వాత కూడా కేన్సర్‌ కారణంగా చనిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ క్రమంలో రొమ్ము కేన్సర్‌ చికిత్స తర్వాత బాధితుల ప్రాణాపాయ ముప్పును పరీక్షించే
సరికొత్త పరీక్షను అభివృద్ధి చేసినట్లు యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు తెలిపారు.


ఈ మాలిక్యులర్‌ పరీక్షలో బాధితులకు ప్రమాదం పెద్దగా లేదని తేలితే.. వారికి అందించే చికిత్స తీవ్రతను తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో చికిత్స కారణంగా ఎదురయ్యే దుష్ప్రభావాలు కూడా తగ్గుతాయని వర్సిటీ ప్రొఫెసర్‌ లారా జే ఎసెర్‌మాన్‌ వివరించారు.

Sunday 2 July 2017

బ్లడ్ కేన్సర్ బాధితులకు గుడ్ న్యూస్


బ్లడ్ కేన్సర్ వ్యాధితో బాధ పడుతున్న వారికి మెరుగైన చికిత్సను అందించేందుకు ఓ కొత్త మెడిసిన్ ను సైంటిస్టులు తయారు చేశారు. ఈ మందును విడిగా వాడినా.. కిమోథెరపీతో పాటు అందించినా మంచి ప్రభావం చూపిస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్ లో స్పష్టమైంది. ఈ డ్రగ్ ను అభివృద్ధి చేసిన టీంకు భారత సంతతి పరిశోధకురాలు,యూనివర్శిటీ ఆఫ్ యూటా పోస్ట్ డాక్టొరల్ శ్రీవిద్య భాస్కర  నేతృత్వం వహించారు. అక్యూట్ లింపోబ్లాస్టిక్ లుకేమియా(ALL) గా వ్యవహరించే బ్లడ్ కేన్సర్ చిన్నా పెద్దా తేడాలేకుండా అందరిపైనా దాడిచేస్తుంది. దీని బాధితుల్లోని 30% మందిలో ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. క్రోమోజోమ్ లోని రెండు విభాగాలు వాటి స్వభావానికి భిన్నంగా అతుక్కుపోతే దాన్ని ఫిలడెల్పియా క్రోమోజోమ్ గా వ్యవహరిస్తారు. కొత్తగా ఏర్పడిన ఈ క్రోమోజోమ్ DNA ను మరమ్మతు చేయడం ప్రారంభిస్తుంది. DNA  రిపేర్ అంటే వినడానికి ఏదేదో మంచి విషయంలాగానే అనిపించవచ్చు. కానీఈ క్రమోజోమో చే మరమ్మతు ఫలితం చెడుకే దారి తీస్తుంది. ఆ ప్రక్రియ వ్యసనంగా మారి నిరంతరం కొనసాతుంది. ఈ ప ర్రక్రియ కోసం ఆక్రోమోజోమ్ వినియోగించే రకరకాల ప్రోటీన్లను అడ్డుకోడానికి పలు రకాల మందలను వాడాలి. అలా వాడితే అవి విషపూరితంగా మారి సాధారణ కణాలపై దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉంది.


అందుకే ఈ వ్యసనాన్ని నిరోధించేందుకు విస్తృతంగా ప్రయోగాలు చేసి హిస్టోన్ డియాసిటైలసిస్(HDAC1,2) అనే రెండు ప్రొటీన్లపై ప్రధానంగా దృష్టి సారించి సరికొత్త మెడిసిన్ ను ఆవిష్కరించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ డ్రగ్ ను రోగుల నమూనాలు, ఎలుకల మీద పరీక్షించగా సంతృప్తి కరమైన ఫలితాలు వచ్చాయన్నారు. లుకేమియా అనేది తెల్లరక్తకణాల వ్యాధి. అంటే ఇవి వచ్చినవారి శరీరం ఎర్రకర్త కణాలకు బదులు తెల్లరక్తకణాలను ఇబ్బడిముబ్బడిగా ఉత్పత్తి చేస్తుంది. అయితే.. లుకేమియా ఉన్న ఎలుకలకు ఈ మందును విడిగా ఇచ్చినా లేక కీమోథెరఫీలో ఇచ్చే డోక్సోరుబిసిన్ తో కలిపి ఇచ్చినా..అప్పటిదాకా పాలిపోయినట్టుగా ఉండే వాటి బోన్ మ్యారో ఎరుపు రంగులోకి మారడం గమనించామని…ఎర్రకర్త కణాలు ఎక్కువగా పుడుతున్నాయనడానికి ఇది సంకేతమన్నారు. ఈ ఔషదం ఒక్కటే విడిగా వాడినప్పటి కంటే డోక్సోరుబిసిన్ తో కలిపి వాడినప్పుడు మరింత మెరుగైన ఫలితాలు వచ్చాయని తెలిపారు.

Saturday 1 July 2017

తాజా కూరలతో కేన్సర్ దూరం



పెద్దల మాట చద్దిమూట అని ఎందుకంటారో.. అప్పుడప్పుడూ సైంటిస్టుల పరిశోధనలు రుజువు చేస్తుంటాయి. చాలా వరకు పరిశోధనల్లో అప్పటిదాకా సామెతలుగా ఉన్న మాటలే నిజమౌతాయి. ఎందుకంటే తాజా పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచివని ఎప్పట్నుంచో మన పెద్దలకు నమ్మకం. అందుకే గర్భిణులు, బాలింతలకే కాదు.. అందరూ ఇవి ఎక్కువ తినాలని చెబుతుంటారు. ఇప్పుడు కూడా అదే నిజమని సైంటిస్టులు తేల్చారు.

పండ్లు, కూరగాయలు, చేపలు ఎక్కువగా తింటూ సాఫ్ట్‌ డ్రింక్‌లను తగ్గిస్తే పేగు కేన్సర్ వచ్చే ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ కేన్సర్‌కు కారణం ఆహారంలో ఫైబర్లు లోపించడమేనని టెల్‌ అవీవ్‌ పరిశోధకులు పేర్కొన్నారు. దీంతోపాటు ఆల్కహాల్‌ సేవించడం, కాలరీలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం సీఆర్‌సీకి కారణమవుతున్నాయని వివరించారు.

Friday 30 June 2017

కేన్సర్ బీ 17 లోపమా..?



కేన్సర్ ఒక భయంకరమైన, ప్రాణాంతక వ్యాధి కాదని, విటమిన్ బి17 లోపమని ఓ విధమైన వాదన ప్రపంచవ్యాప్తంగా ఉంది. బి17 విటమిన్ లభించే ఆహారాన్ని తీసుకుంటే చాలు కేన్సర్ కు దూరంగా ఉండవచ్చన్న అధ్యయనాలూ ఉన్నాయి. ఇది నిజమేనా...? అన్న సందేహం చాలా మందిలో ఉండే ఉంటుంది. మరి ఆ నిజా నిజాలేంటో పలువురు పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం తెలుసుకుందాం.


బి1, బి2, బి6, బి12 విటమిన్లు గురించి వినే ఉంటారు...మరి బి17 ఎక్కడి నుంచి వచ్చింది...? నిజానికి విటమిన్ బి17 అంటూ ఏదీ లేదు. అమిగ్డాలిన్ నుంచి రూపొందించే లాట్రిలే అనే ఔషధానికి పెట్టిన నామం బి17. చాలా రకాల మొక్కల్లో లభించే విషపూరిత సైనోజెనిక్ గ్లైకోసైడ్ నే అమిగ్డాలిన్ గా పేర్కొంటారు. ఈ అమిగ్డాలిన్ ను మెరుగుపరిచి లాట్రిలేగా మారుస్తారు. శాస్త్రీయ నామం మాండెలో నైట్రిల్ బీటా డీ జెంటియోబయోసైడ్. దీన్నే నైట్రిలోసైడ్ గానూ భావిస్తారు. ఇది సైనేడ్ ను కలిగి ఉండే సహజ పదార్థం. ఇది శరీరానికి కావాల్సిన కనీస పోషకమేమీ కాదు. హైడ్రోజెన్ సైనేడ్ ను ఉత్పత్తి చేయడం ద్వారా కేన్సర్ విస్తరణను అడ్డుకుంటుందని కొందరు వైద్యులు సొంతంగా పరిశోధనలు చేసి ప్రకటించారు. కానీ, ఇంతవరకూ ఏ ప్రభుత్వమూ దీన్ని గుర్తించలేదు.

Tuesday 20 June 2017

యోగాతో అందరికీ ఆరోగ్యం

యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం. ఇది హిందూత్వ అధ్యాత్మిక సాధనలలో ఒక భాగం. మోక్షసాధనలో భాగమైన ధ్యానం అంతఃదృష్టి, పరమానంద ప్రాప్తి లాంటి అధ్యాత్మిక పరమైన సాధనలకు పునాది. దీనిని సాధన చేసే వాళ్ళను యోగులు అంటారు. వీరు సాధారణ సంఘ జీవితానికి దూరంగా మునులు సన్యాసులవలె అడవులలో ఆశ్రమ జీవితం గడుపుతూ సాధన శిక్షణ లాంటివి నిర్వహిస్తుంటారు. ధ్యానయోగం ఆధ్యాత్మిక సాధనకు మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతుంది. హఠయోగములో భాగమైన శారీరకమైన ఆసనాలు శరీరారోగ్యానికి తోడ్పడి ఔషధాల వాడకాన్ని తగ్గించి దేహధారుడ్యాన్ని, ముఖ వర్చస్సుని ఇనుమడింప చేస్తుంది.


            బుద్ధమతం, జైనమతం, సిక్కుమతం మొదలైన ధార్మిక మతాలలోనూ, ఇతర ఆధ్యాత్మిక సాధనలలోను దీని ప్రాధాన్యత కనిపిస్తుంది.
హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగమైన యోగాన్ని శాస్త్రీయంగా క్రోడీకరించిన ఆద్యుడు పతంజలి. క్రీస్తు పూర్వము 100వ శకము 500వ శకము మధ్య కాలములో ఈ రచన జరిగినట్లు పరిశోధకులు విశ్వసిస్తున్నారు. ఉపనిషత్తులు, భగవద్గీతలో యోగా ప్రస్తావన ఉంది. పతంజలి వీటిని పతంజలి యోగసూత్రాలు గా క్రోడీకరించాడు. సూత్రము అంటే దారము. దారములో మణులను చేర్చినట్లు యోగశాస్త్రాన్ని పతంజలి ఒకచోట చేర్చాడు. హఠయోగ ప్రదీపిక, శివ సంహిత దానిలో ప్రధాన భాగాలు. అంతర్భాగాలైన కర్మయోగము, జ్ఞానయోగము, రాజయోగము, భక్తియోగము మొదలైనవి హిందూతత్వంలో భాగాలు. 

Saturday 13 May 2017

అమ్మలకు కేన్సర్ టెస్ట్ తప్పనిసరి

సృష్టికి ప్రతి సృష్టి అమ్మ. ప్రపంచంలో అన్నింటి కన్నా మధురమైనది, తియ్యనైనది, అపురూపమైనది అమ్మ ప్రేమ. యుగాలు మారిన, తరాలు మారిన, మారనిది అమ్మ అభిమానం.  అమ్మ ప్రేమ వెలకట్టలేనిది, విలువ కట్టలేనిది. తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయక తన ఆనందాన్ని కుటుంబం కోసం, పిల్లలకోసం త్యజించేది అమ్మఒక్కతే. అమ్మ గురించి ఎంత చెప్పకున్నా తక్కువే. అలాంటి అమ్మ మరో ప్రాణికి జన్మనిచ్చే సమయం అంటే ఆమెకు పునర్జన్మే. అలాంటప్పుడు ఆరోగ్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రతి మహిళా జీవితంలో అత్యంత సున్నితమైనది మాతృత్వం. మహిళ గర్భం దాల్చినప్పుడు శారీరకంగా, మానసికంగా చాలా మార్పులు వస్తాయి. కొంతమందిలో ఏమి తిన్నా వెంటనే వాంతి అవ్వడం, కొన్ని రకాలవాసనలు పడకపోవడం సహజం. అలాంటప్పుడు ఏమీ తినకపోవడం వల్ల నీరసించిపోతారు. అందువల్ల ఏదో ఒక తేలిక పాటి ఆహారం తీసుకోవడం వల్ల అన్నీ క్రమంగా తగ్గుతాయి.  శరీరంలో ఉన్న హార్మోన్ల మార్పుల వల్ల ఒక్కోసారి తిన్న ఆహారం జీర్ణం కాకపోవచ్చు. ఎక్కువగా కూరగాయాలు, పండ్లు, పండ్ల రసాలు తీసుకుంటే అవి త్వరగా జీర్ణమవుతాయి. గర్భిణీలు ఒత్తిడికి లోనవకుండా, ఆనందంగా, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. కొంతమందిలో కాళ్లు, ముఖం వంటి అవయవాలకు వాపులు వస్తుంటాయి. సాయంత్రంవేళల్లో కొద్ది సేపు వాకింగ్‌
చేయడం వల్ల ఈ వాపులను తగ్గించుకోవచ్చు.



ఇక కాన్పు తర్వాత గర్భాశయం బరువు వల్ల వెన్నునొప్పి, పిరుదులు, తొడల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఫిజియోథెరఫీ చేయించుకోవడం వల్ల ఆ నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు. కాన్పు తర్వాత మూత్రానాళ ఇన్‌ఫెక్ష్లన్లూ వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు చెప్తారు. ఫెల్విక్‌ఫ్లోర్‌ వంటి వ్యాయామాలు చేయడం వల్లవాటిని నివారించవచ్చు. కాన్పు తర్వాత బిడ్డకు పాలు పట్టకపోవడం వల్ల రొమ్ముల్లో పాలు గడ్డకట్టి ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశాలూ ఎక్కువే. ఈ ఇన్‌ఫెక్షన్లు తల్లి శరీరంలోకి వ్యాపించే ప్రమాదమూ ఉంది. అలాగే పిల్లల నోటిలో పూతల వల్ల రోగక్రిములు రొమ్ముల్లోకి చేరి, చీముగడ్డలు ఏర్పడవచ్చు. అందువల్ల పిల్లలకు పాలిచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు
తీసుకోవాలి. సీజేరియన్‌ అయిన వాళ్లు కుట్ల దగ్గర చీము పట్టకుండా చూసుకోవాలి.

కాన్పు తర్వాత రక్తస్రావం జరగడం సహజమే. కానీ అదే ఎక్కువ అవుతుంటే దాన్ని వైద్య పరిభాషలో ఫోస్ట్‌ పార్టమ్‌ హేమరేజ్‌ అంటారు. దీనికి ప్రధాన కారణం గర్భాశయ ముఖద్వారం చీరిపోవడం, గర్భాశయం లోపల మాయ మిగిలిపోవడం, గర్భాశయం కుంచించుకుపోవడం. బ్లీడింగ్ ఎక్కువ అయితే తల్లి ప్రాణానికే ప్రమాదం. కాబట్టి వెంటనే వైద్యులు తగిన చర్యలు తీసుకోవాలి.  కాన్పు తర్వాత తల్లులు తమ ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా పిల్లల మీదే ఎక్కువ శ్రద్ధపెట్టడం వల్ల ఇలాంటి అనర్థాలు ఎక్కువగా జరిగి తల్లిప్రాణానికే ముప్పు వాటిల్లుతుంది. కాన్పు అవక ముందు, అయిన తర్వాత కూడా తల్లి తన ఆరోగ్యం గురించి అన్ని విధాలా పట్టించుకోవాలి.

Friday 7 April 2017

మామిడి పండుతో కేన్సర్ దూరం

మిగతా పండ్లతో పోలిస్తే మామిడి పండులోని పోషక విలువల గురించి ప్రచారం తక్కువే! భారతీయుల ఇంటింటి ఆహారమైన ఈ మామిడిపండు గురించి పాశ్చాత్యులు కాస్త చులకనగానే చూస్తారు. మామిడి కేవలం జిహ్మచాపల్యాన్ని తీర్చే తీపి పండుగానే గుర్తిస్తారు.  అమెరికాలో మామిడిపండు గురించి ఓ ఆసక్తికరమైన పరిశోధన జరిగింది. స్త్రీ జీవితంలో విషాన్ని నింపే బ్రెస్ట్ క్యాన్సర్ను మామిడిపండు ఎదుర్కొంటుందని నిరూపించింది.



మామిడిపండులోని polyphenol అనే రసాయనాలు కేన్సర్ కణాల మీద ఏ మేరకు ప్రభావం చూపుతాయో గమనించారు పరిశోధకులు. ఇందుకోసం పెద్దపేగు, వక్షోజాలు, ఊపిరితిత్తులు, ప్రొస్టేటు తదితర కేన్సర్ కణాల మీద ఈ polyphenolsను ప్రయోగించి చూశారు. వీటిలో ప్రొస్టేట్, లుకేమియా, ఊపిరితిత్తుల క్యాన్సర్ కణాల మీద మామిడిపళ్లు ఎంతోకొంత ప్రభావం చూపినట్లు గ్రహించారు. ఆశ్చర్యకరంగా వక్షోజ (breast), పెద్దపేగు(colon) క్యన్సర్ కణాలని నిరోధించడం, నాశనం చేయడంలో beమిడిపండ్లు అద్భుతమైన ప్రభావం చూపాయట!
చాలా క్యాన్సర్ చికిత్సలలో క్యాన్సర్ కణాలతో పాటుగా ఆరోగ్యవంతమైన కణాలు కూడా దెబ్బతింటూ ఉంటాయి. దీని వల్ల రోగి నీరసించిపోవడం, మళ్లీ క్యాన్సర్ బారిన పడటం జరుగుతుంది. కానీ మామిడిపండు నుంచి తీసిన రసాయనాలు మాత్రం కేవలం క్యాన్సర్ కణాల మీదే దాడి చేయడం గమనార్హం. మామిడి నుంచి తీసిన polyphenols క్యాన్సర్ కణాల మీద పనిచేసే తీరు కూడా చిత్రంగా ఉంది. విచ్చలవిడిగా పెరిగిపోతున్న క్యాన్సర్ కణాలను నిరోధించడంతో పాటుగా.... దెబ్బతిన్న కణాలను బాగుచేయడం ద్వారా polyphenols అద్భుతమైన ప్రభావాన్ని చూపాయట.
తమ పరిశోధనతో మామిడపండు సత్తా తెలిసింది కాబట్టి, polyphenolsను తీసిన మందులతో క్యాన్సర్ చికిత్సను ప్రారంభించే ప్రయత్నాలు మొదలుపెట్టాలని పరిశోధకులు కోరుకుంటున్నారు. ఆ మందులు, చికిత్సలు అందుబాటులోకి వచ్చేందుకు కొంత కాలం పడుతుంది కాబట్టి, ఈలోగా తియ్యటి మామిడిపంఢ్ల రుచిని కాస్త ఆస్వాదిస్తే సరి!

Thursday 6 April 2017

ఆరోగ్యమే మహాభాగ్యం

 
ప్రతి రోజూ ఉరుకులు, పరుగులు. డైలీ లైఫ్ లో ఎన్నో సవాళ్లు…. బిజీలో పడిపోయి లైఫ్ ని డేంజర్ లో పడేసుకుంటున్నారు జనాలు. హెల్త్ కేర్ అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో ఒక్కసారిగా వచ్చే అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్నఆరోగ్య సమస్యలపై ఎప్పటికప్పుడు అలర్ట్ చేసే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ – WHO యేటా వాల్డ్ హెల్త్ డే ను నిర్వహిస్తుంది.



డయాబెటీస్ తో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులైన  B.P, థైరాయిడ్ సమస్యతో జనం అనారోగ్యానికి గురవుతున్నారు. అన్నింటికి మించి..మనం తీసుకుంటున్న ఆహారం పొల్యూట్ అవడం హెల్త్ పై ఎఫెక్ట్ చూపిస్తోంది. పండ్లు, కూరగాయలు కూడా రసాయనాలతో పండించినవి తినాల్సిరావడం భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమే అవుతుందంటున్నారు డాక్టర్లు. క్యాన్సర్, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ డిసీజెస్ పై అవేర్ నెస్ పెరగాలంటున్నారు. ఆరోగ్యమే..మహాభాగ్యం. హెల్త్ బాగుంటేనే అన్నీ సెట్ అవుతాయి. సో ఎంత బిజీ లైఫ్ అయినా హెల్త్ పై కేర్ తప్పనిసరి అంటోంది WHO.

Friday 3 February 2017

కేన్సర్‌ను నిరోధించేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

 కేన్సర్ వ్యాధి సంక్రమించడానికి కారణం ఫలానా అని చెప్పలేకపోవచ్చు కానీ దాన్ని నిరోధించేందుకు మాత్రం ప్రత్యేకంగా కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటుంటే వ్యాధిని అడ్డుకోవచ్చని పరిశోధనాల్లో తేలింది. ప్రపంచ కేన్సర్ డే ఫిబ్రవరి 4 సందర్భంగా ఆ వివరాలను తెలుసుకుందాం...
            ప్రతిరోజూ తినే ఆహారంలో అత్యధిక స్థాయిల్లో ఫైబర్ నిల్వలున్న పదార్థాలను తీసుకునేవారిలో కేన్సర్ వ్యాధి రావడం చాలా తక్కువ. పండ్లు, కూరగాయలు వంటివి ఎక్కువగా తీసుకునే మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెపుతున్నాయి. అంతేకాదు ప్రొస్టేట్ కేన్సర్ రాకుండా అడ్డుకోవడంలో పండ్లు, కూరగాయలు కీలక పాత్రను పోషిస్తాయి.




    

చైనా పరిశోధనల ప్రకారం తెల్లని కూరగాయలు, బంగాళాదుంపలు, క్యాలీఫ్లవర్ వంటివి తీసుకుంటుంటే కేన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. వీటిని తీసుకునేవారిలో వ్యాధి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే జీర్ణాశయ కేన్సర్‌ను కూడా అడ్డుకునే శక్తి వీటికి ఉంది.

Wednesday 1 February 2017

ఆ కేన్సర్ డేంజర్!

శారీరక కేన్సర్ కంటే చుట్టూ ఉండే సమాజం, దగ్గరివాళ్లు దూరం పెట్టడమే పేషంట్లను అధికంగా బాధిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కేన్సర్ ఉందని తెలియగానే చాలా మంది సదరు పేషంట్లను దూరం పెట్టడం, వారిని మునుపటిలా పలుకరించకపోవడం చేస్తారని దీనికి వల్ల కేన్సర్ పేషంట్లు మానసికంగా కుంగిపోతారని లండన్ లోని సౌత్ హంప్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ క్లేర్ ఫోస్టర్ వెల్లడించారు.






              
 కేన్సర్ నివారణ  కోసం కిమో థెరపీ ప్రారంభించినప్పుడు, ఆ తరువాత కోలుకున్నాక కొన్నాళ్ల వరకు కూడా పేషంట్లకు సోషల్ సపోర్ట్ దక్కడం లేదని, మనసు విప్పి మాట్లాడేందుకు ఎవరూ ఉండటం లేదని స్టడీ గుర్తించింది. చికిత్స అనంతరం వాళ్లకు సాయం చేయడానికి, ఇంటి పనులు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని స్టడీ వెల్లడించింది.

Tuesday 31 January 2017

అతిగా వేయించిన చిప్స్ తింటున్నారా ?

ఈ రోజుల్లో స్నాక్స్ గా చిప్స్ తినడం మామూలు అయిపోయింది. అయితే మరి ఎక్కువ వేయించిన బ్రెడ్ ,ఆలు చిప్స్ లో ప్రాణంతక కేన్సర్ రసాయనం ఉందని వాటిని తింటే కేన్సర్ ని కొని తెచ్చుకున్నట్లే అని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పిండి పదార్దాలను అధిక ఉష్ణోగ్రతలో వేడి చేసి తింటే అక్రిలామైడ్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ఈ ప్రయోగం జంతువులపై జరిపిన ప్రయోగాల్లో వెల్లడైందని పరిశోధకులు తెలిపారు. వంటకాలను బంగారు వర్ణం వచ్చే వరకు మాత్రమే ఫ్రై చెయ్యాలి అని సూచించారు.



             కాబట్టి ఈసారి చిప్స్ తినే ముందు వాటి కలర్ చూసి తినండి. ఎందుకంటే బాగా వేయించిన చిప్స్ తో కేనస్ర్ వచ్చే ప్రమాదం ఉంది. మన ప్రమేయం లేకుండానే కేన్సర్ వచ్చే ఛాన్స్ ఎలాగో ఉంది. దీనికి తోడు మనం కేన్సర్ ను కొనితెచ్చుకోవడం అవసరం అంటారా. చెప్పండి. ఒక్క చిప్సే కాదు ఏ పదార్థమైనా అతిగా వేయించడం మంచిది కాదంటున్నారు నిపుణులు.

Monday 30 January 2017

ప్రొస్టేట్ కేన్సర్ రిస్క్ తగ్గాలంటే ?


 20 మంది మహిళలలతో పురుషుడు సెక్సులో పాల్గొంటే అతడికి ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే అవకాశం 28% మేర తగ్గిపోతుందట. ఈ అధ్యయనం కెనడాకు సంబంధించిన పరిశోధకులు చేసి, పలువురు పురుషులను పరిశీలించిన అనంతరం వెల్లడించినట్లు కేన్సర్ ఎపిడమాలజీ జర్నల్ తెలిపింది. దీనికి కారణం అంతమంది మహిళలతో సెక్సులో పాల్గొనేవారు ఎక్కువసార్లు వీర్యాన్ని స్ఖలిస్తారు కనుక వీర్యంలో ప్రొస్టేట్ కేన్సర్ కారక ఫ్లూయిడ్ బయటకు వచ్చేస్తుందని వారు తెలుసుకున్నారు. అయితే కొన్ని దేశాల్లో ఇలా ఎక్కువమంది స్త్రీలతో సెక్స్ చేసే పరిస్థితి ఉండదనీ, అలాంటి దేశాల్లో మగవారు హస్త ప్రయోగం చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించగలుగుతారని చెపుతున్నారు.



అధ్యయనంలో భాగంగా సెక్స్ పరీక్షల్లో పాల్గొన్న పురుషుల్లో ఎక్కువమంది స్త్రీలతో లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నవారిలో ప్రొస్టేట్ కేన్సర్ అవకాశాలు తక్కువగా కనబడగా భాగస్వామితో మాత్రమే సెక్స్ సంబంధాన్ని కలిగి ఉన్నవారిలో కొంతమందికి ఈ వ్యాధి లక్షణాలున్నట్లు తేలింది. ఐతే ఇది కొన్ని దేశాలకు మాత్రమే వర్తిస్తుందని పరిశోధకుల మాటలను బట్టి తెలుస్తుంది.

Sunday 29 January 2017

అక్కడి నీరు త్రాగితే కేన్సర్ గ్యారెంటీ

నీరు.. పంచభూతాల్లో ఒకటి. మనిషికి అత్యంత అవసరమైన వనరు. ఇదిలేకుండా మనిషి ఉండలేడు. సాధారణంగా ఎవరైనా ఒక ఇంటిని నిర్మించుకున్నాముందు నీటితోనే ప్రారంభిస్తారు. అంటే ఇంటి నిర్మాణానికి ముఖ్యమైన వాటిలో నీరు కూడా ఒకటి కనుక. కానీ ఇక్కడ మనం త్రాగే నీటి గురించి మాట్లాడుకుంటే, ఏదైనా అద్దె ఇంటికి వెళితే అక్కడ నీటి సౌకర్యం ఎలా ఉంటుందని ఆరా తీస్తారు. అందరూ మంచినీటి సౌకర్యం ఉన్న ప్రాంతాలలో నివసించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కొన్ని చోట్ల మంచినీరు లేకపోతే వస్తున్న నీటినే పలు విధాలుగా శుభ్రం చేసుకుని త్రాగుతారు. కానీ కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ మంచినీరు లభ్యం కాకపోవడంతో అక్కడి ప్రజలు ప్రమాదం అంచున జీవిస్తున్నారనే చెప్పాలి. దీని వలన వారు తరచూ అనారోగ్యాలకు గురి కావడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.


చాలా పెద్ద నగరాలు, పట్టణాలు సైతం నీటి కాలుష్యంలో కూరుకుపోవడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. తాజాగా అందిన సమాచారం మేరకు కొన్ని ప్రధాన పట్టణాల్లో నీటిని త్రాగితే ఆ నీటి వలన ప్రజలు ప్రాణాంతక వ్యాధులకు గురి కావచ్చనేది విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కొచ్చిన్.. దక్షిణాదిలోని ఈ నాలుగు ప్రధాన నగరాల్లో నీళ్లు తాగితే కేన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయట. పలు సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా చేసిన పరిశోధనలలో ఈ విషయం వెల్లడైంది. ఈ నాలుగు నగరాల్లో ఉన్న భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ అనే విషపదార్థం చాలా ఎక్కువ స్థాయిలో ఉందని, ఎక్కువ కాలం పాటు ఈ నీళ్లు వాడటం వల్ల కేన్సర్ వచ్చే అవకాశాలు చాలా రెట్లు ఎక్కువవుతాయని అన్నారు.

Saturday 28 January 2017

వృషణాలపై కంతులు ప్రమాదం


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -పురుషుల్లో వృషణాలపై ఏర్పడే కంతులు,Testicular Tumours- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి .



                        పురుషులకు మాత్రమే పరిమితమైన సమస్య .. వృషణాలపై కంతులు ఏర్పడటం. వృషణాలపై ఏర్పడే కంతులు కేన్సర్‌ కానివి కావచ్చు.లేదా కేన్సర్‌ కంతులైనా కావచ్చు. వృషణాలపై కంతులు ఏ వయస్సు వారికైనా వచ్చే అవకాశాలున్నప్పటికీ, సాధారణంగా ఐదేళ్లలోపు చిన్నారుల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. లేదా యుక్తవయస్సులోకి త్వరగా అడు గిడిన మగపిల్లల్లో కనిపిస్తాయి.వృషణాలపై ఏర్పడే ఈ కంతుల్లో అత్యధిక శాతం కేన్సర్‌ కాని కంతులే ఉంటాయి.

Friday 27 January 2017

గ్రీన్ టీ తో కేన్సర్ పరార్

ప్రపంచంలో నీరు తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన పానీయం టీ మాత్రమే. ఇటీవలి కాలంలో గ్రీన్ టీ విస్తృత ప్రచారంలో ఉంది. ఇప్పుడు గ్రీన్ టీ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు చెబుతున్నారు సైంటిస్టులు. గ్రీన్ టీ ఓ అద్భుత ఆరోగ్య సంపద. ఏకంగా కేన్సర్ లాండి డెడ్లీ డిసీజెస్ కూడా గ్రీన్ టీ పేరు చెబితే ఆమడ దూరం పారిపోతాయట. గ్రీన్ టీ లో ఖనిజాలు, విటమిన్లు, యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.





             
 అయితే ఈ ప్రయోజనాలన్నీ దక్కాలంటే టీ సరిగ్గా చేయాలంటున్నారు నిపుణులు. కప్పు టీ కోసం ఓ టీ బ్యాగ్ లేదా నాలుగు గ్రాముల టీ పొడి వాడాలి. రోజుకు మూడు కప్పుల గ్రీన్ టీ తాగిన పురుషుల జోలికి కేన్సర్ రాలేదట. ఇక నాలుగు కప్పుల గ్రీన్ టీ తో రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ కూడా మాయమౌతుంది. ఐదు కంటే ఎక్కువ కప్పుల గ్రీన్ టీ తాగే మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ మళ్లీ రాకపోవడమే కాకుండా.. వ్యాధి వ్యాప్తి చెందే సమయం కూడా బాగా తగ్గినట్లు గుర్తించారు పరిశోధకులు.