Tuesday 8 November 2016

పండులో ఆరోగ్యం

మనం తీసుకునే ఆహారంతో పాటు .. పండ్లను కూడా తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. పండ్లలో అనేక రకాలై
పోషకపదార్థాలు ఉంటాయి. అలాగే రోజూ  పండ్లు తినివారిలో  వ్యాధి నిరోధక శక్తి  అధికంగా  ఉంటుంది. వివిధ రకాలైన  పండ్లు రోజూ  తీసుకోవడం వల్ల .. కొన్ని రకాలైన వ్యాధులు రాకుండా ముందే నిరోధించవచ్చని వైద్యులు చెబుతున్నారు.

గుండె
మన గుండెను భద్రంగా  చూసుకోవాలంటే .. పాలి పినాల్స్ ఎక్కువగా ఉండే  ఫ్రూ ట్స్ తినాలి . ద్రాక్ష, లిచీ పండ్ల లో పాలిపినాల్స్ ఎక్కవగా ఉంటాయి.  అంతే కాదు. క్యాన్సర్ ను అరికట్టడంలోనూ బాగా పనిచేస్తాయి.

 క్యాన్సర్
క్యాన్సర్  మహమ్మరి… ఎవరిని ఏరకంగా చుట్టుముడుతుందో అస్సలు చెప్పలేం.  చాలా మంది రకరకాల క్యాన్సర్ల బారిన పడుతూ ఉంటారు. అలాంటి కేన్సర్ మన దరికి చేరకుండా చూడాలంటే .. పండ్ల ప్రత్యామ్నాయం . లిచీ ఫ్రూట్ రెగ్యులర్ గా తింటూ ఉంటే … బ్రెస్ట్ కేన్సర్ ను దూరంగా పెట్టొచ్చు.  లిచీలో  యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అవి కేన్సర్ కారకాలను అరికడతాయని వైద్యులు చెబుతున్నారు. ఇక బొప్పాయి లాంటి  పండ్లలో  బీటా క్రిపోక్సాంథిన్  ఎక్కువగా ఉంటుంది. ఇది లంగ్ కేన్సర్ నుంచి రక్షిస్తుంది.

 ఒబేసిటీ , కోలెస్ట్రాల్
ఒబేసిటీ, కోలె స్ట్రాల్ తో బాధపడే వారు.. రేగుపళ్లు, యాపిల్స్ తింటే మంచిది. పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది. 40 శాతానికి పైగా  పీచు పదార్థం ఈ పండ్లలో ఉంటుంది. కోలె స్ట్రాల్ ను నియంత్రించడానికి చక్కగా సహాయ పడతాయి

రక్తపోటు
రక్తపోటును తగ్గించడంలో .. అరటి పండు చాలా మేలు చేస్తుంది.  రోజుకో అరటి పండు తింటే ..రక్త పోటు కంట్రోల్ లో ఉంటుంది. అత్తి పండు  లో కూడా రక్తపోటును తగ్గించే పోటాషియం అదికంగా ఉంటుంది.

జీర్ణశక్తి
అజీర్తితో బాధడేవాళ్లు.. బొపాయి, జామపండు ముక్కులు  తింటే మంచిది. వాటిలో ఉండే పీచు పదార్థాలు జీర్ణ శక్తి కి సహకరిస్తాయి. అలాగే బొప్పాయిలోని పపెయిన్ అనే ఎంజైమ్ జీర్ణశక్తిని పెంచుతుంది. ఇక సీ విటమిన్ ఎక్కువగా ఉండే కమలా పండు వల్ల  మహిళల్లో చర్మంపై మడతలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

No comments:

Post a Comment