Thursday 24 November 2016

రాష్ట్రాన్ని కబళిస్తున్న కేన్సర్

తినే తిండి కల్తీ! పీల్చే గాలి కల్తీ! తాగే నీరు కూడా కల్తీ! వీటితోపాటు అనారోగ్యకరమైన జీవనశైలి! కారణమేదైనా గానీ.. తెలంగాణ రాష్ట్రంలో కేన్సర్‌ రోగుల సంఖ్య క్రమేపీ పెరుగుతుందన్నది మాత్రం చేదునిజం! ఆరోగ్యశ్రీ పథకంలో కేన్సర్‌ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో పాటు ప్రభుత్వం  నిర్వహించిన బ్రెస్ట్‌కేన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్ష ల్లోనూ కేన్సర్‌ రోగులు పెరుగుతున్నట్లు తేలుతోంది. మరోవైపు కేన్సర్‌ చికిత్సల వల్ల ప్రజలపైనే కాకుండా ప్రభుత్వంపై కూడా ఆర్థికంగా భారం అధికం అవుతోంది. ఇప్పటిదాకా వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే.. రాష్ట్రంలో కేన్సర్‌ వ్యాధి ఆందోళన కలిగించేలా విస్తరిస్తోందని తెలుస్తోంది.




                  ప్రభుత్వం  మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జడ్చర్ల, గంగాపూర్‌, వరంగల్‌ జిల్లా రాయపర్తి, మహబూబాబాద్‌లలో మహిళల కోసం బ్రెస్ట్‌ కేన్సర్‌ మొబైల్‌ స్క్రీనింగ్‌ కేంద్రాలను నిర్వహించింది. రెండు రోజుల్లో 1,271 మంది మహిళలకు పరీక్షలు చేశారు. వీరిలో 273 మందికి కేన్సర్‌ ఉన్నట్లు అనుమానం కలగడంతో మమ్మోగ్రామ్‌ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 135 మందికి కేన్సర్‌ ఉందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. వీరికి మరిన్ని పరీక్షల కోసం శాంపిళ్లను సేకరించి బయాప్సీ కోసం పంపించారు. 

No comments:

Post a Comment