Monday 23 January 2017

సిటీ లేడీస్ కే కేన్సర్ ఎక్కువ

కేన్సర్ అనేది ఒక వ్యాధి కాదు. ఇది సోకిందని తెలిసే నాటికే దాని తీవ్రత పెరిగి ఉండడం కేన్సర్ వ్యాధికి ఉన్న ప్రధాన లక్షణం. శరీరంలోని ట్రిగ్గర్ కణాలు కణవిభజనపై నియంత్రణ కోల్పోవడంతో కేన్సర్ ప్రారంభమవుతుంది. సంబంధిత పరీక్షల ఆధారంగా వ్యాధి ఉందని, అవయవం ఆధారంగా రకాన్ని తెలుసుకొని సరైన చికిత్స అందిస్తే కేన్సర్‌ను అరికట్టొచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. కేన్సర్ అనేది అనేక వ్యాధుల సముదాయం. వాటన్నింటికి ఒకే సాధరణ     టాయి. శరీరంలోని  ఏ భాగం నుంచి కేన్సర్ వచ్చిందో దాని ఆధారంగా వైద్యులు కేన్సర్ రకాన్ని నిర్ధారిస్తారు. తీవ్ర ఒత్తిడికి గురవ్వడం, పొగ తాగడం, ప్రతికూల పరిసరాల ప్రభావం, కొన్ని అంటువ్యాధులు, జన్యుపరంగా వచ్చే కొన్ని లక్షణాలు కేన్సర్‌కి కారణమవుతాయి.



                 ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి 8లక్షల మంది మహిళలు గర్భాశయ, రొమ్ము కేన్సర్ భారిన పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2030నాటికి ఏడాదికి 3.2మిలియన్ల మంది మహిళలు గర్భాశయ కేన్సర్ భారిన పడే అవకాశం ఉందని ఇటీవల జరిపిన సర్వేలో వెల్లడైంది. మనదేశంలో మోనోపాజ్ దశ దాటకముందే మహిళల్లో రొమ్ము కేన్సర్ వస్తున్నట్లు గుర్తించారు. లక్షకు 102 కొత్త కేసులు నమోదవుతున్నట్లు గుర్తించారు. పల్లెల కంటే పట్టణాల్లోనే ఎక్కువ మంది కేన్సర్ భారిన పడుతున్నారు. మన దేశంలోను, చైనాలోనూ, రొమ్ము కేన్సర్ బాధితులు అధిక సంఖ్యలో నమోదవుతున్నారు. ఒకప్పుడు సంతానం లేని మహిళలకు, మోనోపాజ్ తరువాత బరువు ఎక్కువగా పెరిగే మహిళల్లో కేన్సర్ ముప్పు ఎక్కువగా ఉండేది. కానీ నేడు గర్భాశయ కేన్సర్ గతంలో కంటే 25శాతం ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని, దీనిపై ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే మహిళల మనుగడకు ముప్పేనని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి.

No comments:

Post a Comment