Thursday 7 June 2018

చిటికెలో కేన్సర్ గుర్తింపు


కేన్సర్ ఎంత ప్రమాదకరమైన  వ్యాధి అనే సంగతి ఇప్పుడు అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆ వ్యాధిపై అవగాహన కూడా పెరుగుతుండటంతో.. గతంతో పోలిస్తే ముందుగానే ఆస్పత్రికి వెళ్లే వారి సంఖ్య పెరిగింది. కేన్సర్ మొదటి స్టేజ్ లో ఉంటే తగ్గించవచ్చనే డాక్టర్ల మాటలు జనాన్ని ఆస్పత్రులకు రప్పిస్తున్నాయి. అయితే కేన్సర్ ఏ స్టేజ్ లో ఉందో తెలుసుకోవాలంటే టెస్టులు కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటున్నాయనే వారి కోసం మరింత సులభమైన టెక్నిక్ డెవలప్ చేశారు.




సరికొత్త రక్తపరీక్ష ద్వారా కేవలం గంట వ్వవధిలోనే పాంక్రియాటిక్‌ కేన్సర్‌ను గుర్తించే వ్యవస్థను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కేవలం ఒక రక్తపు బొట్టుతో గుట్టు పట్టుకోవచ్చునని ఏసీఎస్‌ నానో అనే జర్నల్‌లో వివరించారు. ప్రాథమిక దశలోనే ఈ పరీక్షలో వ్యాధి బయపటడితే మెరుగైన చికిత్స చేయవచ్చునని యూనివర్సిటీ కాలిఫోర్నియా ప్రతినిధి లీన్‌ లూయిస్‌ తెలిపారు. రక్తంలో నానో సైజ్‌లో ఉండే ఎక్సోజోమ్స్‌లో కేన్సర్‌ కణాలు గుర్తిస్తే వ్యాధి ఏ దశలో ఉందో తెలిసిపోతుందన్నారు.

No comments:

Post a Comment