Friday 1 June 2018

కేన్సర్ సర్వైవల్ మంత్ జూన్




కేన్సర్ లక్ష మంది మహిళల్లో పల్లెల్లో 8మందికి, పట్టణాల్లో 27మందికి వస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది
-దేశ వ్యాప్తంగా ఏటా 5లక్షల మందిని బలిగొంటున్న మహమ్మారి
-ఆడవారిలో సర్వైకల్ కేన్సర్, మగవారిలో నోటి కేన్సర్లు పెరుగుతున్నాయని తేల్చిన పలు నివేదికలు
-సహజ జీవన శైలి, ముందస్తు పరీక్షలే శరణ్యమంటున్న వైద్యులు..




కేన్సర్ అనేది ఒక వ్యాధి కాదు. ఇది సోకిందని తెలిసే నాటికే దాని తీవ్రత పెరిగి ఉండడం కేన్సర్ వ్యాధికి ఉన్న ప్రధాన లక్షణం. శరీరంలోని ట్రిగ్గర్ కణాలు కణవిభజనపై నియంత్రణ కోల్పోవడంతో కేన్సర్ ప్రారంభమవుతుంది. సంబంధిత పరీక్షల ఆధారంగా వ్యాధి ఉందని, అవయవం ఆధారంగా రకాన్ని తెలుసుకొని సరైన చికిత్స అందిస్తే కేన్సర్‌ను అరికట్టొచ్చని వైద్య నిపుణులు అంటున్నారు.

కేన్సర్ అనేది అనేక వ్యాధుల సముదాయం. వాటన్నింటికి ఒకే సాధరణ లక్షణాలుంటాయి. శరీరంలోని ఏ భాగం నుంచి కేన్సర్ వచ్చిందో దాని ఆధారంగా వైద్యులు కేన్సర్ రకాన్ని నిర్ధారిస్తారు. తీవ్ర ఒత్తిడికి గురవ్వడం, పొగ తాగడం, ప్రతికూల పరిసరాల ప్రభావం, కొన్ని అంటువ్యాధులు, జన్యుపరంగా వచ్చే కొన్ని లక్షణాలు కేన్సర్‌కి కారణమవుతాయి.

No comments:

Post a Comment