Thursday 5 May 2016

బంగాళాదుంపలతో జీర్ణాశయ కేన్సర్‌ దూరం


కూరగాయలతో కేన్సర్ ముప్పు నుంచి జయించవచ్చని చైనాకు చెందిన శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ముఖ్యంగా ఆలు గడ్డలతో జీర్ణాశయ కేన్సర్‌కు చెక్ పెట్టొచ్చని వారు వెల్లడించారు. బీజింగ్‌లోని జెజియాంగ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైనట్టు తెలిపారు.

ముఖ్యంగా పళ్లు, ఆకుపచ్చ, పసుపు రంగు కూరగాయల వల్ల జీర్ణాశయంలో ఒక రక్షణ పొర ఏర్పడుతుందని, వీటితో పాటు విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేసి జీర్ణాశయంలో ఒత్తిడిని తీవ్రంగా తగ్గిస్తుంది చెప్పారు. ప్రధానంగా ఆలుగడ్డ వంటి తెలుపు రంగు కూరగాయలతో ఈ కేన్సర్ ముప్పు గణనీయంగా తగ్గించుకోవచ్చని తెలిపారు.

No comments:

Post a Comment