Tuesday 3 May 2016

కీమోథెరపీతో కేన్సర్ కు చెక్

కేన్సర్‌ చికిత్సలో కీమోథెరపీ మందులకున్న ప్రాధాన్యం తెలిసిందే! సాధారణంగా ఇంట్రావీనస్‌ ఇంజెక్షన్ల రూపంలో ఈ మందులను రోగి శరీరంలోకి పంపిస్తారు. ఈ పద్ధతిలో మందు కేన్సర్‌ కణితిని చేరడానికి ఎక్కువ సమయం పట్టడంతో దాని ప్రభావం పూర్తిస్థాయిలో ఉండదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కీమోథెరపీ మందును నేరుగా కేన్సర్‌ కణితికి చేరవేస్తే మరింత మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.

ఇందుకోసం పేస్‌మేకర్‌ తరహాలో శరీరంలోకి ప్రవేశపెట్టే పరికరాన్ని మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశా రు. దీని సాయంతో పాంక్రియాటిక్‌ కేన్సర్లలో పెరిగిన కణితిని కుచించుకు పోయేలా చేయవచ్చన్నారు. ఆపై శస్త్రచికిత్స ద్వారా తొలగించవచ్చని ఎంఐటీకి చెందిన లారా ఇండోల్ఫి తెలిపారు. ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాలలో తాజా ఆవిష్కరణతో 12 రెట్లు మెరుగైన ఫలితాలు సాధించినట్లు లారా వివరించారు.

No comments:

Post a Comment