Friday 20 May 2016

బాల్యానికి చెక్ పెడుతున్న కేన్సర్

ప్రపంచంలో ప్రతి మూడు నిమిషాలకు ఒక చిన్నారి కేన్సర్‌ బారినపడుతోంది. అలాగే మన దేశంలో ఏటా యాభై వేల మంది పిల్లలకు ప్రమాదకరమైన కేన్సర్‌ వ్యాధి సోకుతోంది. దురదృష్టమేంటంటే.. కేన్సర్‌ గురించి సరైన అవగాహన లేకపోవడం, వ్యాధిని సరైన సమయంలో గుర్తించలేకపోవడం, ఒకవేళ గుర్తించినా వైద్య సదుపాయం అందకపోవడంతో దాదాపు 50 నుంచి 70 శాతం చిన్నారులు కేన్సర్‌తో మృత్యువాతపడుతున్నారు.


కెన్‌కిడ్స్‌ అనే సంస్థ ఈ వాస్తవాల్ని వెల్లడించింది. బాల్యంలోనే కేన్సర్‌ బారిన పడుతున్న చిన్నారుల గురించి మనదేశంలో అవగాహన పెంచాలనే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తోంది. కొన్ని కుటుంబాల్లో కేన్సర్‌ వ్యాధిగ్రస్తులున్నా.. దానిగురించి మాట్లాడుకోలేని స్థితి ఉందనీ, అందుకే ఈ విషయాలు వెల్లడించాం అంటోంది కెన్‌కిడ్స్‌ సంస్థ. కేన్సర్‌ ఓ అంటరానిపదంగా మారిపోయిందనీ, అయితే ఈ ప్రమాదకరమైన వ్యాధి గురించి కచ్చితంగా చర్చించుకోవాల్సి ఉందనీ ఈ సంస్థ చెబుతోంది.

No comments:

Post a Comment