Monday 16 May 2016

సిక్కోలును వణికిస్తున్న కేన్సర్

కేన్సర్‌ వ్యాధి అంటేనే జనం భయపడిపోతారు. వ్యాధి ప్రారంభంలో ఉందా, లేదా ముదిరిందా అనేదానితో నిమిత్తం లేకుండా ఆందోళనపరిచే వ్యాధి ఇది. ప్రస్తుతం ఇది శ్రీకాకుళం జిల్లా ప్రజలను బెంబేలె త్తిస్తోంది. ఒకవైపు నిరుద్యోగం, ఉపాధిలేమి, వెనుకబాటు తనంతో ప్రజలు అల్లాడుతుండగా, భయకంపితులను చేసే కేన్సర్‌ వ్యాధి ఈ జిల్లా ప్రజలను వణికిస్తోంది.

విశాఖపట్నంలోని వివిధ ఆస్పత్రులలో కేన్సర్‌ చికిత్సపొందుతున్న రోగులలో 40 శాతం శ్రీకాకుళం జిల్లా వాసులే ఉన్నారు. నోటి , రొమ్ము, గర్భాశయ కేన్సర్‌ జిల్లాలో ఎక్కువ మందిని పట్టిపీడిస్తోంది. ఆస్పత్రులకు వచ్చే రోగులలో అత్యధికులు ఇలాంటి కేన్సర్‌తోనే బాధపడుతున్నారు. జీవన విధానంలో పెనుమార్పులు రావటం, చిన్న వయస్సులోనే వివాహాలు కావటం ఈ వ్యాధికి ప్రధాన కారణంగా చెపుతున్నారు. 

No comments:

Post a Comment