Wednesday 4 May 2016

జాన్సన్ పౌడర్‌తో గర్భాశయ కేన్సర్

ప్రముఖ టాల్కం పౌడర్ ఉత్పత్తి కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి యుఎస్ జ్యూరీ భారీ అపరాధం విధించింది. ఈ కంపెనీ తయారు చేసిన టాల్కం పౌడర్‌ను వాడిన ఓ మహిళకు ఓవరిన్ కేన్సర్ బారిన పడింది. దీంతో ఈ అపరాధం చెల్లించాల్సిందిగా జ్యూరీ ఆదేశించింది.
 మూడు వారాల పాటు కేసును విచారించిన మిస్సోరీ స్టేట్ కోర్టు ఈ తీర్పును వెలువరించింది. అలాగే, బాధిత మహిళకు 5 మిలియన్ డాలర్ల నష్టపరిహారంతో పాటు.. 50 మిలియన్ డాలర్లు శిక్షాత్మక నష్టపరిహారాన్ని చెల్లించాలని ఆదేశించింది.



No comments:

Post a Comment