Tuesday 3 May 2016

ఆల్కహాల్ తో జీర్ణాశయ కేన్సర్

వరల్డ్ కేన్సర్ రీసెర్చ్ ఫెడరేషన్ ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా జరిగిన 89 పరిశోధనలను నిశితంగా విశ్లేషించి ఓ కొత్త విషయాన్ని నిర్థారించుకున్నట్లు వెల్లడించింది. దాని ప్రకారం.. రోజుకు మూడు, నాలుగు పెగ్గుల మద్యం, నిల్వ ఉంచిన మాంసాహార పదార్థాలు తీసుకోవడం జీర్ణాశయ కేన్సర్ రిస్క్ ను పెంచుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

అంతేకాకుండా ఈ రిస్క్ మహిళలతో పోలిస్తే పురుషులలో రెండింతలు ఎక్కువగా ఉంటుందని, అలాగే వృద్ధులు దీని బారిన పడటం ఎక్కువగా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే, ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు సుమారు 77 వేల మంది జీర్ణాశయ కేన్సర్ బాధితులను పరిశీలించినట్లు సమాచారం. చివరగా ఈ విషయంలో కాస్త ఆలోచించకపోతే.. పెద్ద ప్రమాదమే ఎదుర్కోవాలని వస్తుందని పరిశోధకులు స్పష్టం చేశారు.

No comments:

Post a Comment