Friday 20 May 2016

పండ్లతో కేన్సర్ కు చెక్

పండ్లు, కూరగాయలు తినటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిలో మనిషి శరీరానికి అవసరమైన ఎన్నో పోషక విలువలు వుంటాయి. ప్రతిరోజూ తాజా పండ్లు, కూరలు తినే వారికి సాధారణంగా ఎటువంటి అనారోగ్యాలు కలుగవు. మానవుడి ఆహారంలో పండ్లు, కూరగాయలు ప్రాచీనకాలంనుండి ప్రధానపాత్ర వహిస్తున్నాయి. లక్షలాదిమంది ప్రజలు పండ్లు, కూరగాయలు తినటానికి ప్రాధాన్యతనివ్వరు. దీనితో వీరికి కేన్సర్ వంటి మొండి రోగాలు అనారోగ్యం వచ్చే అవకాశం వుంటుందని ఒక తాజా సర్వే తెలుపుతోంది.


బ్రిటన్ లో నిర్వహించిన ఒక సర్వేలో అక్కడి ప్రజలలో ప్రతి అయిదుగురిలో ఒకరు మాత్రమే పండ్లు , కూరగాయలు సిఫార్సు చేసిన స్ధాయిలో తింటున్నట్లు ప్రపంచ కేన్సర్ పరిశోధనా సంస్ధ తెలిపినట్లు రీసెర్చి వెల్లడించింది. వృక్ష సంపద ఆహారమైన గింజలు, ధాన్యాలు, పండ్లు, కూరగాయలు కేన్సర్ రిస్కు తగ్గిస్తాయని, వీటిని తరచుగాను అధికంగాను లేదా సిఫార్సు చేసిన స్ధాయిలో కనుక తింటే వారికి ఏ రకమైన కేన్సర్ వచ్చే అవకాశం లేదని రీసెర్చర్లు తెలిపారు. పీచు అధికంగా వుండే ఆహారాలు, పేగు కేన్సర్ నివారణకు కూడా తోడ్పడతాయని సంస్ధ పరిశోధకులు చెబుతున్నారు.

No comments:

Post a Comment