Saturday 7 May 2016

ఏపీలో పెరుగుతున్న కేన్సర్ కేసులు

ఏపీలో కేన్సర్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువ మంది కేన్సర్‌ బారిన పడుతున్నారు. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. కేన్సర్‌పై సరైన అవగాహన లేకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో రోగ నిర్ధారణ కేంద్రాలు అందుబాటులో లేకపోవడమే కేన్సర్‌ కేసులు గ్రామాల్లో, మహిళల్లో ఎక్కువగా నమోదు కావడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.


జాతీయ స్థాయిలో కూడా పురుషులతో పోలిస్తే మహిళల్లోనే కేన్సర్‌ కేసులు అధికం. అదే సమయంలో జాతీయస్థాయిలో పట్టణ ప్రాంతాల్లోనే కేన్సర్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. వివిధ వ్యాధులకు సంబంధించి జాతీయ స్థాయిలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నిర్వహించిన నమూనా సర్వేలో తేలిందిది.

No comments:

Post a Comment