Tuesday 23 August 2016

స్మార్ట్ ఫోన్ తో కేన్సర్ రాదు

స్మార్ట్‌ఫోన్ అతిగా వాడితే దాని రేడియేషన్ వల్ల చర్మ కేన్సర్ వస్తుందని ఇన్నాళ్లూ రకరకాల భయాలు ఉండేవి. కానీ, అలా భయపడక్కర్లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే.. సెల్‌ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల వేరే ఆరోగ్య సమస్యలు వస్తాయని, ముఖ్యంగా పిల్లలకు ఇది ముప్పేనని అంటున్నారు. మొబైల్ ఫోన్ వాడకంతో పాటు ఇతర రేడియో ఫ్రీక్వెన్సీ విద్యదయస్కాంత క్షేత్రాల వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కొంతకాలం క్రితం ప్రపంచ ఆరోగ్యసంస్థకు చెందిన అంతర్జాతీయ కేన్సర్ పరిశోధన సంస్థ చెప్పింది. అయితే దాన్ని నిర్ధారించడానికి పరిశోధన మాత్రం జరగలేదని తెలిపింది.
       


స్మార్ట్ ఫోన్లతో కేన్సర్ రాకపోయినా.. అతిగా వాడటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే మొబైల్స్ కు ఎడిక్టైన యూత్.. మానసిక సమస్యలతో బాథపడుతున్నారని హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్స్ క్వాలిటీని బట్టి కూడా రేడియేషన్ ఆధారపడి ఉంటుందని మరికొందరంటున్నారు. సాధారణ స్మార్ట్ ఫోన్స్ తో పోలిస్తే.. బ్రాండెడ్ మొబైల్స్ రేడియేషన్ ఎక్కువగా విడుదల చేయవని తెలుస్తోంది. 

No comments:

Post a Comment