Wednesday 17 August 2016

బ్రెడ్డు తింటే కేన్సర్ బోనస్

ఆరోగ్యం బాగోలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు బ్రెడ్డు తినమని డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తుంటారు. కానీ భారత ఆరోగ్య శాఖ నివేదిక చదివితే మాత్రం బ్రెడ్డు తిన్నా కేన్సర్ వస్తుందని తెలిసి జనం అవాక్కవుతున్నారు. ఎక్కడో మారుమూల పల్లెల సంగతి దేవుడెరుగు.. ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముఖ కంపెనీలు యథేచ్ఛగా కేన్సర్ కారక పదార్థాలతో బ్రెడ్ తయారుచేసి విక్రయిస్తున్నాయి. బ్రిటానియా, కేఎఫ్ సీ, మెక్ డొనాల్డ్స్, డొమినోస్, పిజ్జా హట్ లాంచి రెస్టారెంట్లో ప్యాక్ చేసిన బ్రెడ్లో పొటాషియం బ్రోమైడ్, పొటాషియం అయొడైడ్ అవశేషాలున్నాయి.
             


ఆరోగ్య శాఖ పరీక్షించిన శాంపిల్స్ లో 84 శాతం కేన్సర్ కారక పదార్థాలున్నట్లు తేలింది. ఇవి తింటే కేన్సర్ కొని తెచ్చుకున్నట్లేనని అధికారులు ప్రకటించారు. అయితే బ్రాండెడ్ కంపెనీలు మాత్రం తాము నిషేధిత పదార్థాలు వాడటం లేదని చెవిలో పువ్వులు పెడుతున్నాయి. కానీ తమ ల్యాబుల్లో కాకుండా బయట ల్యాబుల్లో కూడా పరీక్షించాకే ఈ నివేదిక విడుదల చేసినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటికే ప్యాకేజ్డ్ బ్రెడ్ ను విదేశాల్లో నిషేధించారని, మన దేశంలో మాత్రం యథేచ్ఛగా అమ్ముతున్నారని తెలుస్తోంది. కాబట్టి.. బ్రెడ్డు తినేముందు పారాహుషార్. 

No comments:

Post a Comment