Monday 15 August 2016

బాల్యంలో పండ్లు తింటే కేన్సర్ దూరం




బాల్యంలో పండ్లు ఎక్కువగా తింటే రొమ్ముకేన్సర్‌ బారిన పడే ముప్పు తక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. ఆల్కహాల్‌ను ఎక్కువగా తీసుకుంటే ఈ కేన్సర్‌ మరింత అధికమయ్యే ముప్పుదని, అమెరికాలోని టిహెచ్‌ చాన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. 90వేల మంది నర్సులను 20ఏళ్ల పాటు పరిశీలించారు. చిన్నతనంలో వాళ్ల ఆహారపు ఆలవాట్లు, పండ్లు అధికంగా తీసుకున్నారో లేదా వివరాలను సేకరించారు. చిన్నతనంలో ఎక్కువగా పండ్లు తీసుకున్న వారిలో రొమ్ముకేన్సర్‌ ముప్పు 25శాతం తక్కువగా ఉందని తెలిపారు.
                   



డాక్టర్లు సూచించే సమతులాహారంలో పండ్లు కూడా భాగంగా ఉంటాయి. చిన్నప్పుడే పండ్లు తినడం అలవాటైతే.. శరీరంలో రోగనిరోదశక శక్తి పెరిగి కేన్సర్ తో పాటు మరే వ్యాధులు త్వరగా దరిచేరవని సైంటిస్టులు ఎప్పట్నుంచో చెబుతున్నారు. పోషకాహారం, బలవర్థకమైన ఆహారం, సమతులాహారం, సంతులిత ఆహారం.. ఇలా పేరేదైనా ఆ ఆహారంలో పండ్లు మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే. వెజ్ అయినా,. నాన్ వెజ్ అయినా పండ్లు తినకుండా వాటిలో దొరికే పోషకాలను మరో పదార్థాన్ని తినడం ద్వారా పొందలేమని పరిశోధనలు చెబుతున్నాయి. 

No comments:

Post a Comment