Wednesday 13 April 2016

దేశంలో పెరుగుతున్న కేన్సర్ మరణాలు

భారత దేశంలో అత్య‌ధిక మ‌ర‌ణాలు కేన్సర్ వ్యాధి వ‌ల్ల‌నే సంభ‌విస్తున్నాయి.  ఆడవారిలో గతంలో గర్భాశయ కేన్సర్ వల్ల ఎక్కువమంది చనిపోతుండే వారు. ఇప్పుడు బ్రెస్ట్ కేన్సర్ తో చాలామంది చనిపోతున్నారు. ఇక మగవారిలో లంగ్ క్యాన్సర్ ఎక్కువమంది మరణాలకు కార‌ణ‌మ‌వుతోంది. భారత దేశంలో కాలేయ  కేన్సర్ గత 23 ఏళ్ళల్లో 88 శాతం పెరిగింది. జీర్ణకోశ సంబంధ కేన్సర్ 64 శాతం పెరిగింది.

                        అంతర్జాతీయ పరిణామాలే మన  దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్  వ్యాప్తికి దారితీస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ అధ్యయనం ప్రకారం భారత్ లో గర్భాశయ, నోటి కేన్సర్ లు కూడా ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి.  గర్భాశయ కేన్సర్ ను అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా వాక్సినేషన్, నిర్బంధ ఆరోగ్య  పరీక్షల ద్వారా అదుపు చేస్తున్నారు. పొగాకు నమలడం మన దేశంలో నోటి కేన్సర్ కు ఎక్కువగా దారితీస్తోంది.

1 comment:


  1. అంతర్జాతీయ మటా !
    వింతగ కేన్సరు జిలేబి విరివిగ నయ్యెన్
    బొంతన నింతగ జబ్బులు
    చెంతన రాగన్ బిరబిర చెప్పేయ్ టాటా :)

    ReplyDelete