Monday 11 April 2016

ముందస్తు పరీక్షలతో కేన్సర్ కు చెక్

జన్యుపరంగా అనారోగ్యకరమైన జీవన విధానం వలన, ఇన్‌ఫెక్షన్‌ల ద్వారా, మద్యం,పొగకు ఉత్పత్తుల వాడకం వలన కేన్సర్‌ వస్తుంది.  ప్రస్తుతం లక్ష మందిలో ఒకరు కేన్సర్‌ బారిన పడుతు న్నారు.  శుభ్రత లేకపోవడం వలన 50 శాతం మంది కేన్సర్‌ బారిన పడుతున్నారు. ప్రాథమిక దశలోనే కేన్సర్‌ను గుర్తిస్తే సరైన వైద్యం ద్వారా కేన్సర్‌ను జయించవచ్చు. సాధారణంగా మానవ శరీరంలో ఉండే కణాలు ఒక క్రమపద్దతిలో నియంత్రించ బడతాయి. కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదల నియంత్రణ లేకపోవటం వలన అస్తవ్యస్తంగా విభజన చెంది కణుతులుగా ఏర్పాడతాయి. ఈ కణుతు లు రెండు రకాలుగా ఉంటాయి.ప్రమాదకరమైన కణుతుల వలన కేన్సర్‌ వస్తుంది.
                                               
                      శరీరానికి తగినంత వ్యా యామం లేకపోవుట, జంగ్‌ ఫుడ్స్‌, ఫాస్ట్‌ ఫుడ్స్‌ తినుట వంటి అహర అలవాట్ల వలన కూడా కేన్సర్‌ వచ్చే అవకాశముంది.  కేన్సర్‌గా గుర్తించడానికి లక్షణాలు మానని పుండు, అసహజమైన రక్తస్రావం, పెరుగుతున్న కణితి, తగ్గని దగ్గు, గొంతు బొంగురు పోవటం, మలంలో రక్తం, విసర్జన వేళల్లో మార్పు, మింగటం కష్టంగా మారటం, పుట్టుమచ్చలలో మార్పు, అసాధారణ రక్త హీనత, బరువు/ఆకలి తగ్గటం వంటి లక్షణాలు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళా ప్రతి సంవత్సరం మెమో గ్రామ్‌ తీయించుకొని బ్రెస్ట్‌ కేన్సర్‌ రాకుండ జాగ్రత్త తీసుకోవాలి.అదే విధంగా మగ వారు 60 సంవత్సరాలు దాటిన వారు 3 సంవత్సరాలకొక సారి ప్రోటెస్ట్‌ కేన్సర్‌ రాకుండా ఎస్‌.పి.ఎస్‌.ఎ అనే టెస్ట్‌ చెయించుకోవాలి.

No comments:

Post a Comment