Thursday 7 April 2016

కార్బైడ్ పండ్లతో కేన్సర్ ఖాయం

ఏ కాయనైనా రసాయనాలతో మగ్గబెట్టి మార్కెట్‌లో విక్రయిస్తున్న అక్రమార్కులు తాజాగా అరటిపండ్లపై దృష్టి పెట్టారు. అరటికాయలను పండ్లుగా మార్చేందుకు కొన్ని రసాయనాలు వినియోగిస్తున్నా, నాలుగైదు రోజులపాటు నిగనిగలాడుతూ ఉండేందుకు విషతుల్యమైన కార్బన్‌ డైజన్‌తో కడుగుతున్నారు. మనుషులు వాడరాదని సీసాలపై ఉన్నా…అరటికాయలను పండ్లుగా మగ్గబెట్టేందుకు వ్యాపారులు అతి ప్రమాదకరమైన పద్ధతులను వినియోగిస్తున్నారు. కొత్త పంటల కోసం దాచిన విత్తనాలు బూజు పట్టకుండా వాడే ఫంగిసైడ్‌ను అరటికాయలు
మగ్గబెట్టడానికి వినియోగిస్తున్నారు. దీంతోపాటు విషతుల్యమైన రసాయనాలతో పిచికారీ చేస్తున్నారు. వ్యాపారులు వినియోగిస్తున్న క్రిమి సంహారక మందుల సీసాలపై మనుషులు వాడకూడదన్న హెచ్చరికలు, విషపు తీవ్రత తెలిపే సూచికలున్నా బేఖాతరు చేస్తున్నారు.


                  కార్బన్ డైజిన్ రసాయనం పండ్లలోకి వెళ్లి తినేవారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్బైడ్ పండ్లతో అల్సర్‌తో పాటు జీర్ణాశయ సమస్యలు, కేన్సర్‌ కూడా వచ్చేఅవకాశాలున్నాయని చెబుతున్నారు.

No comments:

Post a Comment