Thursday 7 April 2016

దమ్ము కొట్టాలంటే.. ఇకపై టెర్రరే..!

దమ్ముకొట్టాలంటే ఇకపై దమ్ముండాలి. స్మోక్ చేయడమే కాదు.. జస్ట్ చూస్తేనే భయపడేలా చేసింది కేంద్ర ప్రభుత్వం. పొగాకు ఉత్పత్తులపై పిక్టోరియల్ వార్నింగ్ చిత్రాలు 85శాతం పెంచుతూ జారీ చేసిన జీవో అమల్లోకి వచ్చేసింది. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టూ హెల్త్.. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఇది అందరికీ తెలిసిన విషయమే. సిగరెట్ ప్యాకెట్లపైనా, బీడీ కట్టలపైనా, ఇతర టొబాకో ప్రొడక్ట్స్ పైనా ఇది ప్రింట్ చేసి ఉంటుంది. అటు సినిమా హాళ్లలో కంపల్సరీగా దీన్ని పబ్లిసిటీ చేస్తున్నారు. అయినా పొగాకు వాడకానికి దూరంగా ఉండటంపై కొందరిలో ఇంకా అవేర్ నెస్ రావడం లేదు.
విపరీతంగా స్మోక్ చేస్తూ, గుట్కా పాన్ మసాల వంటివి తీసుకుంటూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు టొబాకో యూజర్స్. రేట్లు పెంచితే పరిస్థితి మారుతుందని ఏటా పొగాకు ఉత్పత్తులపై సర్కార్ ట్యాక్స్ బాదేస్తుంది. అయినా నో చేంజ్. ఇక దీంతో సీరియస్ డెసీషన్ కు వచ్చింది కేంద్ర సర్కార్.

                   పొగాకు వాడకంతో ఏటా 10 లక్షల మంది క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. ప్రజలకు అత్యంత ప్రమాదకరంగా మారిన పొగాకు ఉత్పత్తులపై హెచ్చరిక బొమ్మల సైజు పెంచితే అన్నా ఫలితం ఉంటుందనే ఉద్దేశంతో.. కేంద్రం ఈ నిర్ణం తీసుకుంది. కేంద్రం నిర్ణయంపై డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ విధానాలతో పాటు ప్రజల్లో సామాజిక అవగాహన వచ్చినప్పుడే కేన్సర్ రోగులు తగ్గుతారని చెబుతున్నారు.

No comments:

Post a Comment