Tuesday 5 January 2016

భారత్ లో అత్యధిక కేన్సర్ మరణాలు

భారత దేశంలో అత్య‌ధిక మ‌ర‌ణాలు కేన్సర్ వ్యాధి వ‌ల్ల‌నే సంభ‌విస్తున్నాయి.  ఆడవారిలో గతంలో గర్భాశయ కేన్సర్ వల్ల ఎక్కువమంది చనిపోతుండే వారు. ఇప్పుడు బ్రెస్ట్ కేన్సర్ తో చాలామంది చనిపోతున్నారు. ఇక మగవారిలో లంగ్ క్యాన్సర్ ఎక్కువమంది మరణాలకు కార‌ణ‌మ‌వుతోంది.  భారత దేశంలో కాలేయ కేన్సర్ గత 23 ఏళ్ళల్లో 88 శాతం పెరిగింది. జీర్ణకోశ సంబంధ కేన్సర్ 64 శాతం పెరిగింది.

 1999 లో 34,962 మంది మహిళలు గర్భాశయ కేన్సర్ తో మృతి చెందగా  ఈ మధ్య కాలంలో 40,985 మంది మృతి చెందారు.  అదే సంవత్సరంలో బ్రెస్ట్ కేన్సర్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 47,587 వరకు ఉంది. గర్భాశయ కేన్సర్ వృద్ధి 0.2 శాతానికి పడిపోయింది. అందుకు ప్రధాన కారణాలు ఆలస్యంగా వివాహాలు జరుగుతూ ఉండడం, పునరుత్పత్తి సామర్ధ్యం తగ్గుతూ ఉండడం, మంచి ఆరోగ్య అలవాట్లు .

No comments:

Post a Comment