Tuesday 17 November 2015

యుటిరస్ కేన్సర్ కు మూడు చికిత్సలుట

స్త్రీలలో ఎక్కువగా వచ్చే కేన్సర్ గర్భాశయ కేన్సర్. ఓ అధ్యయనం ప్రకారం ప్రతి లక్ష మంది స్త్రీలలో 25 శాతం మంది యుటిరస్ కేన్సర్ తో బాథపడుతున్నారని తేలింది. కేన్సర్ కు కారణాలు నిర్ధిష్టంగా తెలియవు. సహజంగా వయసుపైబడ్డ స్త్రీలలో రుతుక్రమం ఆగిపోయిన తర్వాత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రుతుక్రమం సమయంల కాకుండా మిగతా సమయంలో రక్తం కారడం, తెలుపు అవడాన్ని బట్టి కేన్సర్ లక్షణాలను అనుమానించాలి .

                      జననాంగాన్ని భౌతికంగా పరీక్షించినా లేదంటే గర్భశయాన్ని డీఎన్సీ చేసి ఎండోమెట్రియల్ పొర పరీక్షించినా రోగ నిర్థారణ అవుతుంది. యుటిరస్ కేన్సర్ ను గుర్తించిన దశను బట్టి ట్యాబ్లెట్లు, ఆపరేషన్ లేదా రేడియేషన్ ద్వారా తగ్గించవచ్చు. ఆపరేషన్లో కేన్సర్ సోకిన భాగాన్ని కానీ.. లేదంటే మొత్తం గర్భశయాన్ని కూడా తొలగించడం జరుగుతుంది. రోగికి ట్యాబ్లెట్ల ద్వారా ప్రొజెస్టిరాన్ హార్మోన్ ఇవ్వడం వల్ల 30 శాతం మంది స్త్రీలకు కేన్సర్ తగ్గినట్లు డాక్టర్లు చెబుతున్నారు. 

No comments:

Post a Comment