Tuesday 10 November 2015

భయపెడుతున్న క్యాన్సర్

మన దేశంలో క్యాన్సర్ చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. దీంతో పేద, మధ్య తరగతి వర్గాలు వ్యాధిని ముదర బెట్టుకుంటున్నారని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. పొగ, గుట్కా అలవాట్ల మూలంగా నోటి క్యాన్సర్ వస్తోంది. పారిశ్రామిక కాలుష్యం ఊపిరితిత్తుల క్యాన్సర్ కు దారితీస్తోంది. రసాయనాల తీవ్రత నిర్థారణకు ప్రత్యేక సెంటర్లు ఏర్పాటుచేయడం వెనుక.. ఊపిరితిత్తుల క్యాన్సర్ భయం ఉంది.
           దేశంలో క్యాన్సర్ విజృంభిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే 2020 నాటికి ప్రస్తుతం ఉన్న క్యాన్సర్ కేసులు రెట్టింపవుతాయని భావిస్తున్నారు. కేన్సర్ అంత తేలిగ్గా లొంగే రకం కాదని చాలా మందికి తెలియకపోవడం, క్యాన్సర్ ను ముదరబెట్టుకోవడం కారణంగా ఏటా కేసులు పెరుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కేన్సర్ ను నిర్లక్ష్యం చేస్తున్న ప్రజలు తెలిసీ, తెలియని మందులు వాడి క్యాన్సర్ లక్షణాలను తాత్కాలికంగా మరుగున పడేసుకుంటున్నారు. వ్యాధి బాగా ముదిరాకే డాక్టర్ల దగ్గరకు రావడం మంచి పద్ధతి కాదని నిపుణులు సూచిస్తున్నారు.

No comments:

Post a Comment