Wednesday 4 July 2018

వేపాకు మిశ్రమంతో కేన్సర్ దూరం



మనకు అందుబాటులో ఉండే వేపాకుల మిశ్రమం నుంచి కేన్సర్‌ను దూరం చేసే మందును హైదరాబాద్‌కు చెందిన శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి (ఎన్‌ఐపిఇఆర్) శాస్రవేత్తలు ఈ ఘనతను సాధించారు. తమ శాస్తవ్రేత్తలు చేసిన పరిశోధనల్లో వేప ఆకులు, పువ్వులతో తయారు చేసిన రసాయన మిశ్రమం రొమ్ము కేన్సర్ వ్యాప్తిని తగ్గించి, దానిని నివారిస్తుందని రుజువైందని నిపర్ శాస్తవ్రేత్త చంద్రయ్య గొడుగు వెల్లడించారు. ప్రస్తుతం ఇవి క్లినికల్ ట్రయల్స్‌లోనే ఉన్నాయని, మున్ముందు చేసే పరిశోధనల్లో మరింత మంచి ఫలితాలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాము మరింత విస్తృతంగా పరిశోధించడానికి, క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి నిధులు సమకూర్చాలని బయోటెక్నాలజీ, ఆయుష్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కోరినట్టు ఆయన చెప్పారు.



మన దేశంలో వేపచెట్లు విస్తృతంగా ఉంటాయని, ఈ నేపథ్యంలో తాము తయారు చేసే మందు రొమ్ముకేన్సర్ చికిత్సకు అతిచౌకగా తయారవుతుందని ఆయన చెప్పారు. ఇప్పటికే వేపకు అనేక ఔషధ గుణాలున్నట్టు నిర్ధారణ అయిందని, ఆయుర్వేద వైద్యంలో దీనిని అనేక రోగాల చికిత్సకు వాడుతున్నారని, వేపను కేన్సర్ తగ్గించడంలోకూడా ఉపయోగించవచ్చునని తమ పరిశోధనల్లో ఇప్పుడు తేలిందన్నారు. రొమ్ము కేన్సర్ రోగులపై దీనిని ప్రయోగించగా, కేన్సర్‌ను తగ్గించడమే కాక, నెగటివ్ బ్రెస్ట్ కేన్సర్ కణాలను మూడింతలు చేసిందన్నారు. శాండిల్య, బైరా, అమిత్ ఖురానా, జగన్మోహన్ సోమగాని, ఆర్.శ్రీనివాస్, ఎంవిఎన్ కుమార్ తాళ్లూరి లతో కూడిన బృందం కేన్సర్ చికిత్సలో ఉపయోగించే కెమోథెరపీ దుష్పరిణామాలను సైతం తగ్గించడానికి ఈ కొత్తమందు ఉపయోగపడుతుందని కనుగొన్నారన్నారు. అంతేకాకుండా ఇది కేన్సర్ కణాలను నిర్వీర్యం చేయడం, చంపడం కూడా చేస్తుందన్నారు. రాబోయే నాలుగైదేళ్లలో క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసుకుని అందుబాటులోకి వస్తుందన్న ఆశాభావాన్ని చంద్రయ్య గొడుగు వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment